Ys sharmila : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన వైయస్ షర్మిల తన అన్న జగన్ మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలు కార్యక్రమాలలో వైయస్ జగన్ గురించి మాట్లాడుతూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా విజయవాడ బస్సు యాత్రలో పాల్గొన్న జగన్ పై రాయి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ రాయి దాడిని ప్రతిపక్షాలు చేయించాయి అంటూ వైసీపీ నాయకులు చెప్పుకొస్తున్న మాట. అయితే తాజాగా దీనిపై స్పందించిన వైయస్ షర్మిల వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…జగనన్నకు చిన్న రాయి తగిలితేనే హత్యాయత్నం చేశారని చెబుతున్నారు. చిన్న రాయి దెబ్బకే విలవిల్లాడి పోతున్నారు. చిన్న రాయితో దాడి చేస్తేనే వారికి అది హత్యయత్నం లాగా కనిపించింది. కానీ తన బాబాయ్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైయస్ వివేకానంద రెడ్డి రెడ్డిని గొడ్డలితో 7సార్లు నరికి నరికి నరికి చంపితే మాత్రం అది హత్యయత్నం లాగా ఎందుకు కనిపించలేదు అంటూ షర్మిల ప్రశ్నించారు.వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు దానికి కారణం చంద్రబాబు అంటూ “నారా సుర రక్త చరిత్ర” అంటూ సాక్షి పత్రికలో పెద్దపెద్ద పోస్టర్లు చేశారు.
అలాగే ఎలక్షన్స్ కి ముందు ఈ కేసు పై సీబీఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం సీబీఐ ఎంక్వయిరీ ఎందుకు ఆపించారని దానికి జగన్ సమాధానం చెప్పాల్సిందిగా షర్మిల కోరారు. ఈ కేసులో సీబీఐ ప్రధాన నిధితుడుగా చేర్చిన అవినాష్ రెడ్డిని జగన్ గారు ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారో ప్రజలందరకు తెలియజేయాల్సిందిగా షర్మిల కోరారు. గత 5 సంవత్సరాలుగా వారిని ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలన్నింటికీ వైయస్ జగన్ కచ్చితంగా సమాధానం చెప్పాల్సిందిగా షర్మిల కోరారు.
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…
Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-డ్రైవ్)…
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…
Shekar Basha : బిగ్బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…
This website uses cookies.