Ys sharmila : వైయస్ జగన్ రాయి దాడి పై స్పందించిన షర్మిల... బాబాయ్ ని 7సార్లు నరికి చంపితే...!
Ys sharmila : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన వైయస్ షర్మిల తన అన్న జగన్ మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలు కార్యక్రమాలలో వైయస్ జగన్ గురించి మాట్లాడుతూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా విజయవాడ బస్సు యాత్రలో పాల్గొన్న జగన్ పై రాయి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ రాయి దాడిని ప్రతిపక్షాలు చేయించాయి అంటూ వైసీపీ నాయకులు చెప్పుకొస్తున్న మాట. అయితే తాజాగా దీనిపై స్పందించిన వైయస్ షర్మిల వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…జగనన్నకు చిన్న రాయి తగిలితేనే హత్యాయత్నం చేశారని చెబుతున్నారు. చిన్న రాయి దెబ్బకే విలవిల్లాడి పోతున్నారు. చిన్న రాయితో దాడి చేస్తేనే వారికి అది హత్యయత్నం లాగా కనిపించింది. కానీ తన బాబాయ్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైయస్ వివేకానంద రెడ్డి రెడ్డిని గొడ్డలితో 7సార్లు నరికి నరికి నరికి చంపితే మాత్రం అది హత్యయత్నం లాగా ఎందుకు కనిపించలేదు అంటూ షర్మిల ప్రశ్నించారు.వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు దానికి కారణం చంద్రబాబు అంటూ “నారా సుర రక్త చరిత్ర” అంటూ సాక్షి పత్రికలో పెద్దపెద్ద పోస్టర్లు చేశారు.
Ys sharmila : వైయస్ జగన్ రాయి దాడి పై స్పందించిన షర్మిల… బాబాయ్ ని 7సార్లు నరికి చంపితే…!
అలాగే ఎలక్షన్స్ కి ముందు ఈ కేసు పై సీబీఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం సీబీఐ ఎంక్వయిరీ ఎందుకు ఆపించారని దానికి జగన్ సమాధానం చెప్పాల్సిందిగా షర్మిల కోరారు. ఈ కేసులో సీబీఐ ప్రధాన నిధితుడుగా చేర్చిన అవినాష్ రెడ్డిని జగన్ గారు ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారో ప్రజలందరకు తెలియజేయాల్సిందిగా షర్మిల కోరారు. గత 5 సంవత్సరాలుగా వారిని ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలన్నింటికీ వైయస్ జగన్ కచ్చితంగా సమాధానం చెప్పాల్సిందిగా షర్మిల కోరారు.
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
This website uses cookies.