
Ys sharmila : వైయస్ జగన్ రాయి దాడి పై స్పందించిన షర్మిల... బాబాయ్ ని 7సార్లు నరికి చంపితే...!
Ys sharmila : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన వైయస్ షర్మిల తన అన్న జగన్ మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలు కార్యక్రమాలలో వైయస్ జగన్ గురించి మాట్లాడుతూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా విజయవాడ బస్సు యాత్రలో పాల్గొన్న జగన్ పై రాయి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ రాయి దాడిని ప్రతిపక్షాలు చేయించాయి అంటూ వైసీపీ నాయకులు చెప్పుకొస్తున్న మాట. అయితే తాజాగా దీనిపై స్పందించిన వైయస్ షర్మిల వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…జగనన్నకు చిన్న రాయి తగిలితేనే హత్యాయత్నం చేశారని చెబుతున్నారు. చిన్న రాయి దెబ్బకే విలవిల్లాడి పోతున్నారు. చిన్న రాయితో దాడి చేస్తేనే వారికి అది హత్యయత్నం లాగా కనిపించింది. కానీ తన బాబాయ్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైయస్ వివేకానంద రెడ్డి రెడ్డిని గొడ్డలితో 7సార్లు నరికి నరికి నరికి చంపితే మాత్రం అది హత్యయత్నం లాగా ఎందుకు కనిపించలేదు అంటూ షర్మిల ప్రశ్నించారు.వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు దానికి కారణం చంద్రబాబు అంటూ “నారా సుర రక్త చరిత్ర” అంటూ సాక్షి పత్రికలో పెద్దపెద్ద పోస్టర్లు చేశారు.
Ys sharmila : వైయస్ జగన్ రాయి దాడి పై స్పందించిన షర్మిల… బాబాయ్ ని 7సార్లు నరికి చంపితే…!
అలాగే ఎలక్షన్స్ కి ముందు ఈ కేసు పై సీబీఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం సీబీఐ ఎంక్వయిరీ ఎందుకు ఆపించారని దానికి జగన్ సమాధానం చెప్పాల్సిందిగా షర్మిల కోరారు. ఈ కేసులో సీబీఐ ప్రధాన నిధితుడుగా చేర్చిన అవినాష్ రెడ్డిని జగన్ గారు ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారో ప్రజలందరకు తెలియజేయాల్సిందిగా షర్మిల కోరారు. గత 5 సంవత్సరాలుగా వారిని ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలన్నింటికీ వైయస్ జగన్ కచ్చితంగా సమాధానం చెప్పాల్సిందిగా షర్మిల కోరారు.
Mana Shankara Vara Prasad Garu Ccollection : డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్…
Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్లకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
This website uses cookies.