జిల్లాలోని కుంభంలో రైతు భరోసా కేంద్రానికి గిద్దలూరు శాసన సభ్యుడు అన్నా వెంకట రాంబాబు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పారు. రైతులకు మేలు చేసేందుకు జగన్ సర్కారు పని చేస్తున్నదని, తమ సర్కారు ఎప్పుడూ రైతుల పక్షమని పేర్కొన్నారు. రైతుకు పెట్టుబడి సాయం ఇవ్వడంతో పాటు సాగులో మెలకువలు తెలిపేందుకుగాను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘పొలంబడి’ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు.
వ్యవసాయ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో భాగంగా పంటల సాగుపై పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వ్యవసాయంలో నూతన పద్ధతులు అవలంభించి దిగుబడి పెంచుకునే విధంగా సూచనలిస్తున్నారు. రైతుల కోసం సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని, ఏపీని అభివృద్ధి పథంలో నడిపించడం జగన్ ఒక్కడికే సాధ్యమని తెలిపారు. ఈ రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
GST : జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం…
Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…
Telangana Cabinet Expansion : ఎన్నాళ్లుగానో వేచి చూస్తు మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకి సాకారం అయింది.. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురు…
Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 8వ తేదీ ఆదివారం నాటి…
Vastu Tips : భోజనం చేసే దిశ కూడా వాస్తు శాస్త్రంలో ఏ దిశ మంచిదో తెలియజేయడం జరిగింది. సరైన…
Health Benefits Vitamin F : మనము ఇప్పటివరకు విటమిన్లలో ఎ, బి, బి 1, బి 2, బి…
This website uses cookies.