Prakasham..జగన్ సర్కారు రైతుల పక్షం: ఎమ్మెల్యే రాంబాబు | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Prakasham..జగన్ సర్కారు రైతుల పక్షం: ఎమ్మెల్యే రాంబాబు

జిల్లాలోని కుంభంలో రైతు భరోసా కేంద్రానికి గిద్దలూరు శాసన సభ్యుడు అన్నా వెంకట రాంబాబు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పారు. రైతులకు మేలు చేసేందుకు జగన్ సర్కారు పని చేస్తున్నదని, తమ సర్కారు ఎప్పుడూ రైతుల పక్షమని పేర్కొన్నారు. రైతుకు పెట్టుబడి సాయం ఇవ్వడంతో పాటు సాగులో మెలకువలు తెలిపేందుకుగాను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘పొలంబడి’ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు […]

 Authored By praveen | The Telugu News | Updated on :8 September 2021,6:54 pm

జిల్లాలోని కుంభంలో రైతు భరోసా కేంద్రానికి గిద్దలూరు శాసన సభ్యుడు అన్నా వెంకట రాంబాబు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పారు. రైతులకు మేలు చేసేందుకు జగన్ సర్కారు పని చేస్తున్నదని, తమ సర్కారు ఎప్పుడూ రైతుల పక్షమని పేర్కొన్నారు. రైతుకు పెట్టుబడి సాయం ఇవ్వడంతో పాటు సాగులో మెలకువలు తెలిపేందుకుగాను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘పొలంబడి’ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు.

వ్యవసాయ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో భాగంగా పంటల సాగుపై పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వ్యవసాయంలో నూతన పద్ధతులు అవలంభించి దిగుబడి పెంచుకునే విధంగా సూచనలిస్తున్నారు. రైతుల కోసం సీఎం వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని, ఏపీని అభివృద్ధి పథంలో నడిపించడం జగన్ ఒక్కడికే సాధ్యమని తెలిపారు. ఈ రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

 

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది