
జిల్లాలోని పెడన పట్టణంలో నియోజకవర్గ శాసన సభ్యుడు జోగి రమేశ్ బుధవారం వైసీపీ కార్యాలయంలో ప్రజలతో ‘ముఖాముఖి’ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యేకు తమ సమస్యలపై విన్నవించారు. ఈ క్రమంలోనే ప్రజల నుంచి అర్జీలు తీసుకున్న శాసన సభ్యుడు జోగి రమేశ్ అప్పటికప్పుడు కొన్ని సమస్యలను పరిష్కరించారు.
ఈ కార్యక్రమం ద్వారా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యేకు అర్జీలు సమర్పించారు. అర్జీలను పరిష్కరించాలని శాసన సభ్యుడు వెంటనే ఆయా ప్రభుత్వ శాఖల అధికారులకు చేరవేశారు. పలు సమస్యలపై ఎమ్మెల్యే ఫోన్ ద్వారా అధికారులకు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఇంకా ఏవైనా సమస్యలుంటే ప్రజలు స్థానిక వైసీపీ నాయకులకు తెలపాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చినట్లు వైసీపీ నేతలు పేర్కొన్నారు.
YS Jagan Tour : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం…
Virosh Wedding Photos టాలీవుడ్లో Tollywood అభిమానులు ఎంతోకాలంగా “ఆన్ స్క్రీన్ మోస్ట్ వాంటెడ్ కపుల్” Vijay Devarakonda విజయ్…
Balakrishna Nagababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి…
YS Bharathi : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు నందిపల్లి నందీశ్వర ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం పెద్ద చర్చకు దారితీసింది. వేంపల్లె…
Real Life Beggar : సినిమాల్లో తల్లి ఆరోగ్యం కోసం కోటీశ్వరుడైన కుమారుడు భిక్షాటన చేసే కథలు మనం చూసి…
SHANMUKH JASWANTH : సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక సంచలనం సృష్టిస్తూ ఉండే షణ్ముఖ్ జస్వంత్ ఇప్పుడు మరోసారి…
Tallest Gandhi statue : హైదరాబాద్లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న…
Kethireddy : ధర్మవరం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తనదైన శైలిలో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. పార్టీలు…
Success Story of Woman - Bharti Pohorkar వ్యవసాయం దండగ అనే రోజుల్లో, సరైన శాస్త్రీయ విధానాలు పాటిస్తే…
Rythu Bharosa : తెలంగాణలో రైతు భరోసా నిధుల పంపిణీలో జరుగుతున్న జాప్యంపై అన్నదాతల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.…
Ind Vs Zim T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో గురువారం రెండు…
Sweepers : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరిగినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించారు. ప్రత్యేకంగా…
This website uses cookies.