‘పొలంబడి’ కార్యక్రమం ద్వారా రైతులకు పంటసాగులో నూతన విధానాలు తెలుపుతున్నట్లు కందుకూరు వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్ శేషగిరి తెలిపారు. జిల్లాలోని గుడ్లూరులో జరిగిన ‘పొలంబడి’ శిక్షణా కార్యక్రమంలో శేషగిరి వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పొలంబడి ప్రోగ్రాంలో రైతులుకు వివిధ విషయాలపై అవగాహన కల్పించాలని చెప్పారు.
రైతుల సందేహాలు నివత్తి చేయాలని, వారికి అవసరమైన పలు సూచనలు చేయాలని తెలిపారు. ఇకపోతే వివిధ పంటలలో తరచూ కనపించి ఫార్మర్స్కు తీవ్ర నష్టం కలిగిస్తున్న లద్దెపురుగు నివారణకుగాను విషపు ఎరను వినియోగించాలని, తద్వారా చక్కటి ఫలితాలు ఉంటాయని శేషగిరి పేర్కొన్నారు. వ్యవసాయంలో వినూత్న పద్ధతులకు శ్రీకారం చుట్టాలని రైతులకు సూచించాలని, అందుకు అవసరమైన సలహాలు, సూచనలు వ్యవసాయ శాఖ అధికారుల నుంచి తీసుకోవాలన్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో వ్యవసాయంలో యంత్రాల వినియోగం బాగా పెరిగిందని చెప్పారు. కార్యక్రమంలో ఒంగోలు భూసార పరీక్షా కేంద్రం ఏడీ నిర్మలాకుమారి, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.