‘పొలంబడి’ కార్యక్రమం ద్వారా రైతులకు పంటసాగులో నూతన విధానాలు తెలుపుతున్నట్లు కందుకూరు వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్ శేషగిరి తెలిపారు. జిల్లాలోని గుడ్లూరులో జరిగిన ‘పొలంబడి’ శిక్షణా కార్యక్రమంలో శేషగిరి వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పొలంబడి ప్రోగ్రాంలో రైతులుకు వివిధ విషయాలపై అవగాహన కల్పించాలని చెప్పారు.
రైతుల సందేహాలు నివత్తి చేయాలని, వారికి అవసరమైన పలు సూచనలు చేయాలని తెలిపారు. ఇకపోతే వివిధ పంటలలో తరచూ కనపించి ఫార్మర్స్కు తీవ్ర నష్టం కలిగిస్తున్న లద్దెపురుగు నివారణకుగాను విషపు ఎరను వినియోగించాలని, తద్వారా చక్కటి ఫలితాలు ఉంటాయని శేషగిరి పేర్కొన్నారు. వ్యవసాయంలో వినూత్న పద్ధతులకు శ్రీకారం చుట్టాలని రైతులకు సూచించాలని, అందుకు అవసరమైన సలహాలు, సూచనలు వ్యవసాయ శాఖ అధికారుల నుంచి తీసుకోవాలన్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో వ్యవసాయంలో యంత్రాల వినియోగం బాగా పెరిగిందని చెప్పారు. కార్యక్రమంలో ఒంగోలు భూసార పరీక్షా కేంద్రం ఏడీ నిర్మలాకుమారి, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Vastu Tips : భోజనం చేసే దిశ కూడా వాస్తు శాస్త్రంలో ఏ దిశ మంచిదో తెలియజేయడం జరిగింది. సరైన…
Health Benefits Vitamin F : మనము ఇప్పటివరకు విటమిన్లలో ఎ, బి, బి 1, బి 2, బి…
Ajwain Leaves : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జింక్ ఫుడ్ ని అలవాటు చేసుకుంటున్నారు. దీని వల్ల…
Seem Chintakaya : సీమ చింతకాయ, దీని గురించి ఇప్పటి ప్రజలకు అసలు తెలియదు. పల్లెల్లో హేమ చింతకాయ గురించి…
Mint Health Benefits : పుదీనా ప్రకృతి నుంచి లభించిన దివ్య ఔషధం. దీని సువాసన అమోఘం. దిని రుచి…
Mars Transit : జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశుల గురించి, గ్రహాల గురించి, అవి జీవితంలో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో…
Rashmi Gautam : బుల్లితెర సెన్సేషన్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు . వ్యాఖ్యాతగా స్మాల్ స్క్రీన్…
Iphone 15 : ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల కంటే ఐఫోన్లు ఖరీదైనవి అనే విషయం తెలిసిందే. ఇవి కొనాలంటే కాస్త ఆలోచిస్తాం.…
This website uses cookies.