Virat Kohli – Suryakumar Yadav : ఇన్నాళ్లు సాఫీగా సాగుతున్న టీమిండియా ప్రయాణంకి వరల్డ్ కప్ లో బ్రేకులు పడ్డాయి. ఆడిన ప్రతి మ్యాచ్లోను సాదాసీదాగా ఆడారు. గెలిచిన ప్రతి మ్యాచ్ కష్టంగా గెలిచిందే. దక్షిణాఫ్రికా లాంటి పెద్ద జట్టుపై తేలిపోయిన భారత్ చిన్న జట్లపై ఏదో అలా నెట్టుకొచ్చింది. సెమీస్లాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్లో పూర్తిగా తేలిపోయింది.ఈ టోర్నీలో టీమిండియా స్టార్లు కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణించిన కూడా బౌలింగ్ విభాగం బలహీనంగా ఉండటం, ఓపెనర్లు వరుస వైఫల్యాల వలన భారత జట్టుకు ట్రోఫీ అందించలేకపోయారు. గ్రూప్ దశలో జోరు చూపించి, సెమీస్లో ఓడిన భారత జట్టుని ప్రక్షాళన చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.
టీ20 జట్టు నుంచి సీనియర్లను తప్పించి.. యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలని బోర్డు ఒక ఆలోచన చేస్తుందని సమాచారం. ప్రస్తుత జట్టులో 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లు ఎక్కువగా ఉండటం వలన అనుకున్నంతగా పరుగులు చేయలేకపోతున్నారు. అందుకే 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లను టీ20 జట్టు నుండి పక్కకు పెట్టాలని అనుకుంటుందట. ఇదే జరిగితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితోపాటు సూర్యకుమార్ యాదవ్ను కూడా సెలక్టర్లు టీ20లకు పరిగణనలోకి తీసుకోరనే వాదన ఉంది.. భారత్ తరఫున పొట్టి ఫార్మాట్లో కీలక ఆటగాడిగా ఎదిగిన సూర్య..!
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆయనని పక్కన పెట్టడం భావ్యం కాదని కొందరు చెప్పుకొస్తున్నారు. రానున్న రోజులలో వరుసగా వన్డేలు, టెస్టులు ఉండనుండగా, కీలక ఆటగాళ్లపై అధిక భారం పడకుండా, ఫిట్నెస్ దెబ్బతినకుండా చూడటం కోసం బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోనుందని కొందరి మాటగా తెలుస్తుంది. చూడాలి మరి దీనిపై పూర్తి క్లారిటీ ఎప్పుడొస్తుందనేది. మరి కొద్ది రోజులలో టీమ్ ఇండియా ప్లేయర్లలో కొంతమంది రిటైర్మెంట్ ఇచ్చే ఆస్కారముందని కూడా ఓ వార్త అందుతుంది. రోహిత్ శర్మ తర్వాత హార్దిక్ పాండ్య జట్టు పగ్గాలు చేపడతాడని, అతనిలో కెప్టెన్ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నమాట.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.