Dhoni : నువ్వు ఇలా చేయడం ఏంటి ధోని.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు
Dhoni : ఎంఎస్ ధోని క్రికెట్లో ఓ లెజెండ్. ఆయన చాలా కూల్గా ఉంటూ ఇతర ఆటగాళ్లని ప్రోత్సహిస్తూ అద్భుతమైన క్రికెట్ ఆడుతుంటాడు. అయితే గత రాత్రి పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ధోని ఆట తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముందుగా చెన్నై టీం బ్యాటింగ్ చేసింది. పంజాబ్ బౌలర్స్ అద్భుతమైన బౌలింగ్ చేయడంతో చెన్నై జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 162 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(48 బంతుల్లో 5 ఫోర్లతో 2 సిక్స్లతో 62) హాఫ్ సెంచరీతో మరోసారి అదరగొట్టగా.. అజింక్యా రహానే(24 బంతుల్లో 5 ఫోర్లతో 29) పర్వాలేదనిపించాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్(2/17), రాహుల్ చాహర్(2/16) రెండేసి వికెట్లు తీయగా.. కగిసో రబడా, అర్ష్దీప్ సింగ్ తలో వికెట్ తీసారు.
ఇక లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ 17.5 ఓవర్లలో 3 వికెట్లకు 163 పరుగులు చేసి మంచి విజయాన్ని సాధించింది. జానీ బెయిర్ స్టో(30 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 46), రీలీ రోసౌ(23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 43) విరుచుకుపడగా.. శశాంక్ సింగ్(25 నాటౌట్), సామ్ కరణ్(26 నాటౌట్) అద్భుతమైన బ్యాటింగ్తో జట్టుని గెలిపించారు. ఇక చెన్నై బౌలర్లలో శివమ్ దూబే, రిచర్డ్ గ్లీసన్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు.అయితే మ్యాచ్ చివరి ఓవర్లో డారిల్ మిచెల్-ధోని క్రీజులో ఉండి బ్యాటింగ్ చేస్తున్నారు. చివరి ఓవర్ తొలి బంతికి ఫోర్ కొట్టి ధోనీ శుభారంభం చేశాడు. రెండో బంతికే అద్భుతమైన షాట్ కొట్టినా, బంతి బౌండరీకి వెళ్లలేదు.
Dhoni : నువ్వు ఇలా చేయడం ఏంటి ధోని.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు
కాకపోతే అక్కడ సింగిల్ వస్తుందని గ్రహించిన డారిల్ మిచెల్ సింగిల్ కోసం పరిగెత్తాడు, కానీ ధోని అతనిని వెనక్కి పంపాడు. అంటే పరుగులు వచ్చే టైమ్ లో క్రీజులో నుంచి పరుగుకు కాల్ ఇచ్చినా.. అవతలి వైపుకు ధోని వెళ్లలేదు. ఆ ఓవర్ మొత్తం ధోని బ్యాటింగ్ చేశాడు. ఒక్క సిక్సర్ తప్ప పెద్దగా హిట్ చేసింది లేదు.అయితే డారెల్ మిచెల్ కూడా మంచి ఆటగాడే . అయినప్పటికీ అతనికి స్ట్రైక్ ఇవ్వనందుకు అభిమానులు ధోనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తూ.. తీవ్రంగా కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా వైరల్ గా మారాయి. కొందరు అయితే ధోని ప్రవర్తించిన విధానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
This website uses cookies.