Pakistan: ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ రంజుగా సాగుతుంది. గ్రూప్ ఏలో భారత్ ఉండగా, ఈ టీం తొలి పరాజయాన్ని చవి చూసింది. ఆదివారం పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఆఫ్రికన్ జట్టుకు 134 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన టీమ్ ఇండియా.. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఆ లక్ష్యాన్ని చేరుకోవడంతో ఓడిపోయింది. భారత్ తమ గత మ్యాచ్ల్లో పాకిస్థాన్, నెదర్లాండ్లను ఓడించింది. దక్షిణాఫ్రికాపై భారత జట్టు ఓటమి తర్వాత గ్రూప్ బి పాయింట్ల పట్టికలో భారీ మార్పు చోటు చేసుకున్నాయి.
దక్షిణాఫ్రికా ఓడితే పాక్కి సెమీస్ అవకాశాలు చాలా ఉండేవి. అందుకే ఈ మ్యాచ్లో భారత్ గెలవాలని పాక్ క్రికెటర్స్, అభిమానులు ఎంతగానో కోరుకున్నారు. కాని వారి పూజలు ఫలించలేదు. ఇప్పుడు భారత్ ఓటమి చెందాలని కోరుకుంటున్నారు. దాదాపు దక్షిణాఫ్రికా సెమీస్కి వెళ్లే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో భారత్ ఓటమి పాక్కి కలిసి వచ్చేలా కనిపిస్తుంది. పాక్ రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉండగా, ఆ రెండు గెలిస్తే ఆరు పాయింట్స్ వస్తాయి.భారత్ ఒక మ్యాచ్ ఒడిపోతే ఆరు పాయింట్స్ ఉంటాయి. అప్పడు రన్ రేట్ కీలకగా మారనుంది. ఆ రకంగా పాక్కి ఏమైన అవకాశం ఉంటుందేమోనని పాక్ అభిమానులు భారత్ ఓటమిని కోరుకుంటున్నారు.
గ్రూప్-బీలో బంగ్లాదేశ్ మూడో స్థానంలో ఉంది. ఇది ఇప్పటివరకు మూడు మ్యాచ్లలో రెండు విజయాలు సాధించింది. బంగ్లాదేశ్కు కూడా నాలుగు పాయింట్లు ఉన్నాయి. కానీ, దాని నెట్ రన్ రేట్ మైనస్లో ఉంది. జింబాబ్వే జట్టు మూడు మ్యాచ్లలో ఒక విజయం, ఒక ఓటమి, ఒక మ్యాచ్ రద్దు కావడం కారణంగా మొత్తం మూడు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు పాక్ జట్టు రెండు పాయింట్లతో ఐదో స్థానంలో, నెదర్లాండ్స్ ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి. నెదర్లాండ్స్ మాత్రమే ఆడిన మూడు మ్యాచ్లలో ఓడి సెమీ-ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. సెమీఫైనల్కు చేరుకోవాలంటే భారత్ ఇప్పుడు ఆడాల్సిన రెండు మ్యాచ్ల్లోనూ గెలవాలి. బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లు కూడా రేసులో ఉన్నాయి. రెండు మ్యాచ్లు గెలవడం ద్వారా బంగ్లాదేశ్ జట్టు 8 పాయింట్లకు చేరుకోవడం విశేషం. మరోవైపు జింబాబ్వే కూడా మిగిలిన రెండు మ్యాచ్లు గెలిస్తే 7 పాయింట్లకు చేరుకోవచ్చు.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.