pakistan fans prayers for india loss
Pakistan: ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ రంజుగా సాగుతుంది. గ్రూప్ ఏలో భారత్ ఉండగా, ఈ టీం తొలి పరాజయాన్ని చవి చూసింది. ఆదివారం పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఆఫ్రికన్ జట్టుకు 134 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన టీమ్ ఇండియా.. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఆ లక్ష్యాన్ని చేరుకోవడంతో ఓడిపోయింది. భారత్ తమ గత మ్యాచ్ల్లో పాకిస్థాన్, నెదర్లాండ్లను ఓడించింది. దక్షిణాఫ్రికాపై భారత జట్టు ఓటమి తర్వాత గ్రూప్ బి పాయింట్ల పట్టికలో భారీ మార్పు చోటు చేసుకున్నాయి.
దక్షిణాఫ్రికా ఓడితే పాక్కి సెమీస్ అవకాశాలు చాలా ఉండేవి. అందుకే ఈ మ్యాచ్లో భారత్ గెలవాలని పాక్ క్రికెటర్స్, అభిమానులు ఎంతగానో కోరుకున్నారు. కాని వారి పూజలు ఫలించలేదు. ఇప్పుడు భారత్ ఓటమి చెందాలని కోరుకుంటున్నారు. దాదాపు దక్షిణాఫ్రికా సెమీస్కి వెళ్లే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో భారత్ ఓటమి పాక్కి కలిసి వచ్చేలా కనిపిస్తుంది. పాక్ రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉండగా, ఆ రెండు గెలిస్తే ఆరు పాయింట్స్ వస్తాయి.భారత్ ఒక మ్యాచ్ ఒడిపోతే ఆరు పాయింట్స్ ఉంటాయి. అప్పడు రన్ రేట్ కీలకగా మారనుంది. ఆ రకంగా పాక్కి ఏమైన అవకాశం ఉంటుందేమోనని పాక్ అభిమానులు భారత్ ఓటమిని కోరుకుంటున్నారు.
pakistan fans prayers for india loss
గ్రూప్-బీలో బంగ్లాదేశ్ మూడో స్థానంలో ఉంది. ఇది ఇప్పటివరకు మూడు మ్యాచ్లలో రెండు విజయాలు సాధించింది. బంగ్లాదేశ్కు కూడా నాలుగు పాయింట్లు ఉన్నాయి. కానీ, దాని నెట్ రన్ రేట్ మైనస్లో ఉంది. జింబాబ్వే జట్టు మూడు మ్యాచ్లలో ఒక విజయం, ఒక ఓటమి, ఒక మ్యాచ్ రద్దు కావడం కారణంగా మొత్తం మూడు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు పాక్ జట్టు రెండు పాయింట్లతో ఐదో స్థానంలో, నెదర్లాండ్స్ ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి. నెదర్లాండ్స్ మాత్రమే ఆడిన మూడు మ్యాచ్లలో ఓడి సెమీ-ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. సెమీఫైనల్కు చేరుకోవాలంటే భారత్ ఇప్పుడు ఆడాల్సిన రెండు మ్యాచ్ల్లోనూ గెలవాలి. బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లు కూడా రేసులో ఉన్నాయి. రెండు మ్యాచ్లు గెలవడం ద్వారా బంగ్లాదేశ్ జట్టు 8 పాయింట్లకు చేరుకోవడం విశేషం. మరోవైపు జింబాబ్వే కూడా మిగిలిన రెండు మ్యాచ్లు గెలిస్తే 7 పాయింట్లకు చేరుకోవచ్చు.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.