#image_title
IND VS PAK : దాయాదుల పోరు ఆరంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా.. పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ సందడే వేరు. అది వరల్డ్ కప్ అంటే.. ప్రపంచమంతా ఈ మ్యాచ్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంది. ఆ తరుణం రానే వచ్చింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం దానికి వేదిక అయింది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అయింది. ఇక క్రికెట్ అభిమానులు అయితే అందరూ టీవీలకు అతుక్కుపోయారు. ఇప్పటి వరకు పాకిస్థాన్ 25 ఓవర్లు ఆడింది. అంటే సగం మ్యాచ్ అయిపోయినట్టే లెక్క. 25 ఓవర్లలో రెండు వికెట్లను పాకిస్థాన్ కోల్పోయింది. 25 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి పాకిస్థాన్ 125 పరుగులు చేసింది.
ఓపెనర్లు అబ్దుల్లా, ఇమామ్ ఇద్దరూ అవుట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజ్ లో కెప్టెన్ బాబర్ అజామ్, రిజ్వాన్ ఉన్నారు. అబ్దుల్లా 24 బంతుల్లో 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పాకిస్థాన్ మంచి ఫామ్ లోనే ఉంది. స్కోర్ బాగానే చేస్తోంది. ఇక.. ఇమామ్ 38 బంతుల్లో 36 పరుగులు చేశాడు. క్రీజులో ఉన్న అజామ్ 43 బంతుల్లో 34 పరుగులు చేశాడు. రిజ్వాన్ 41 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ఇక.. బౌలింగ్ విషయానికి వస్తే.. బుమ్రా 4 ఓవర్లు వేసి 14 పరుగులు ఇచ్చాడు. సిరాజ్, పాండ్యా చెరో వికెట్ తీశారు.
#image_title
ఈ మ్యాచ్ ను ప్రపంచమంతా టీవీల్లో తిలకిస్తోంది. ఇక.. నరేంద్ర మోదీ స్టేడియం అయితే ఈ మ్యాచ్ కోసం కిక్కిరిసిపోయింది. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ మ్యాచ్ చూడటానికి జనాలు అహ్మదాబాద్ వెళ్లారు. అసలే దాయాదుల పోరు. 1992 నుంచి ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో భారత్ ను పాకిస్థాన్ ఓడించలేదు. అందుకే ఈ మ్యాచ్ కు అంత ప్రాధాన్యత. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు కాసేపు బాలీవుడ్ సెలబ్రిటీలు స్టేడియంలో ఆడిపాడారు.
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
This website uses cookies.