Virat Kohli : టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ముగిసిన తర్వాత కొందరు బ్యాట్స్మెన్స్ ని పక్కన పెట్టనున్నారని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్కి ప్రకటించిన జట్టులోనూ రోహిత్, విరాట్లకు చోటు దక్కకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచిన విరాట్కి టీ20ల్లో చోటు దక్కకపోవడాన్ని మాజీ వికెట్ కీపర్ సబా కరీం.. తీవ్రంగా తప్పుబట్టాడు. టీ20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ లేకుంటే టీమిండియా ఓటమిపాలయ్యేదని ఆయన అన్నాడు.
ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీల్లో కోహ్లీ లీడింగ్ రన్ స్కోరర్గా ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్థాన్తో మ్యాచ్లో విరాట్ కోహ్లీ లేకపోతే టీమిండియా ఓడిపోయేదన్న విషయం అందరికి తెలుసు . అతను ఆడిన ఇన్నింగ్స్ అంత విలువైనది. అలాంటి ఇన్నింగ్స్ ఆడిన తర్వాత కూడా విరాట్ కోహ్లీని టీ20ల నుంచి తప్పిస్తారా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నాకు తెలిసి శ్రీలంకతో టీ20 సిరీస్కు ఎంపిక కానంత మాత్రాన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇక పొట్టి ఫార్మాట్ ఆడరని కాదు కాని కుర్రాళ్లకు అవకాశం ఇస్తున్నట్టున్నారు. యంగ్ ప్లేయర్లు సరిగ్గా రాణించకపోతే మళ్లీ సీనియర్లు టీమ్లోకి రావాల్సిందే అని అన్నాడు.
మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్లు ఇచ్చిన తర్వాత కూడా మెయిన్ ప్లేయర్స్ ని టీమ్లో నుంచి తప్పించడం సరి కాదు.’అని సబా కరీం చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది టీ20ల్లో 138.23 స్ట్రైయిక్ రేటుతో 55.78 సగటుతో 781 పరుగులు చేశాడు స్టైలిస్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ. 2022లో అత్యధిక టీ20 పరుగులు చేసిన బ్యాటర్లలో ఆయన మూడో స్థానంలో నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ 46.56 సగటుతో 1164 పరుగులు చేయగా మహ్మద్ రిజ్వాన్ 45.27 సగటుతో 996 పరుగులు చేశారు . కాగా, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో నాలుగు హాఫ్ సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ, 296 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా టాప్లో నిలిచిన విషయం తెలిసిందే.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.