Shikhar Dhawan : టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్, ఆయన మాజీ భార్య ఆయేషా ముఖర్జీ ఎట్టకేలకు విడిపోయారు. వీళ్లు చాలా రోజుల నుంచి విడిగా ఉంటున్నారు. అలాగే వీళ్లు విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. కానీ.. విడాకులు చాలా రోజుల తర్వాత కోర్టు తాజాగా మంజూరు చేసింది. ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు ఇచ్చింది. ఆయేషా ముఖర్జీ తనను మానసికంగా హింసించిందని.. తనతో ఇక కలిసి ఉండలేనని శిఖర్ ధావన్ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు. దానిపై విచారణ చేసిన కోర్టు శిఖర్ ధావన్ చేసిన ఆరోపణలు కరెక్టే అని విడాకులు ఇచ్చింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు చివరకు విడాకులు మంజూరు చేసింది. అయితే.. వీళ్ల కొడుకు విషయంలో మాత్రం ఇంకా కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆయేషానే ప్రస్తుతానికి తన కొడుకు బాగోగులు చూసుకుంటోంది. నిజానికి ఆయేషా ఆస్ట్రేలియాలో స్థిరపడింది. తనది వెస్ట్ బెంగాల్. తనకు ఇదివరకే పెళ్లి అయి విడాకులు తీసుకుంది. తన మొదటి భర్త ద్వారా ఇద్దరు కూతుళ్లు కూడా తనకు ఉన్నారు.
మొదటి భర్తతో విడాకుల తర్వాత తను శిఖర్ ధావన్ తో రిలేషన్ షిప్ లో ఉంది. ఆ తర్వాత తను ఇండియాకు తిరిగి వస్తా అని శిఖర్ కు భరోసా ఇవ్వడంతో ధావన్ కూడా తన మాటలు నమ్మి పెళ్లి చేసుకున్నాడు. కానీ.. తన ఇద్దరు కుమార్తెలను వదిలిపెట్టలేక తను ఇండియాకు రాలేదు. ఇంతలో వీళ్లకు ఒక కొడుకు జన్మించాడు. కొడుకును కూడా ఆస్ట్రేలియాలోనే పెంచి పెద్ద చేసింది ఆయేషా. తన కొడుకును ధావన్ కు కొన్నేళ్ల పాటు దూరం చేసి కనిపించకుండా చేసి తనను మానసిక వేదనకు గురి చేసిందని కోర్టు నమ్మింది. అలాగే.. తాను సంపాదించిన ఆస్తులను ఆయేషా తన పేరు మీద రాయాలని శిఖర్ పై ఒత్తిడికి గురి చేసిందని విచారణలో తేలింది. ధావన్ కు పరువు నష్టం కూడా కలిగేలా చేసింది. అంతే కాకుండా ఆస్ట్రేలియాలో ఉన్న తమ ఇద్దరు కుమార్తెల స్కూల్ ఫీజుల కోసం కూడా ధావన్ నుంచే డబ్బులు వసూలు చేసింది.
తమ కుమార్తెల చదువు కోసం నెలకు కోటి రూపాయలు పంపాలంటూ ధావన్ కు ఒత్తిడికి గురి చేసినట్టు కోర్టు గుర్తించింది. ఈ ఆరోపణలపై ఆయేషా ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో ధావన్ ఆరోపణలనే కోర్టు పరిగణనలోకి తీసుకుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కోర్టు ధావన్, ఆయేషాకు విడాకులు మంజూరు చేసింది. ఎనిమిదేళ్ల వయసులోనే ఆస్ట్రేలియాకు వెళ్లిపోయిన ఆయేషా.. అక్కడే కిక్ బాక్సర్ గా ఎదిగి.. ఒక బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టాక వాళ్లు విడిపోయారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ ద్వారా శిఖర్ పరిచయం కావడంతో శిఖర్ ను రెండో పెళ్లి చేసుకుంది. 2012 లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. శిఖర్ కంటే ఆయేషా 10 ఏళ్లు వయసులో పెద్దది. పెళ్లి తర్వాత ఆయషా ఇద్దరు పిల్లల బాధ్యత కూడా శిఖర్ చూసుకునేవాడు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.