Shoaib Akhtar : టి20 ప్రపంచకప్ 2022లో లీగ్ దశలో భారత్, పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి అందరికీ విదితమే. ఈ ఏడాది అక్టోబర్ 23న టీమిండియా, పాకిస్థాన్ మెల్ బోర్న్ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ జరగడానికి ఇంకా 9 నెలల టైం ఉంది. అయినప్పటికీ పాక్ ఆటగాళ్లు ఇప్పటి నుంచే కత్తులు దూస్తున్నారు.గతంలో పాక్ ఆటగాళ్లు భారత్ పైన పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా షోయబ్ అక్తర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ సారి కూడా విజయం తమేదనని, మెల్ బోర్న్ వేదికగా జరిగే మ్యాచ్లో టీమిండియాపై పాకిస్థాన్ విజయం సాధిస్తుందని అన్నాడు.
ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడు జరిగినా భారత మీడియా పని గట్టుకుని టీమిండియాపై ఒత్తిడి చేస్తుందని కామెంట్ చేశాడు. అలా ఒత్తిడి చేయడం వల్లే , అది తమకు అనుకూలంగా మారుతున్నదని, అలా తామే గెలుస్తున్నామని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు.షోయబ్ అక్తర్ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్కు అంత సీన్ లేదని, ఈసారి టీమిండియాదే పై చేయి అవుతుందని అంటున్నారు. మ్యాచ్ జరగడానికి ఇంకా తొమ్మిది నెలల టైం ఉందని, ఇప్పుడే అంత తొందరెందుకు అక్తర్ దానికి ఇంకా చాలా టైం ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
గతేడాది టీ20 ప్రపంచకప్ 2021 లీగ్ దశలో భారత్ తన దాయాది దేశమైన పాక్ చేతిలో ఘోర ఓటమి పాలయిన సంగతి అందరికీ విదితమే. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు జరగనుంది. నవంబర్ 9న తొలి సెమి ఫైనల్, నవంబర్ 10న రెండో సెమీఫైనల్ జరుగనున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ మెల్బోర్న్ వేదికగా నవంబర్ 13న జరగనుంది. ఈ సారి జరిగే మ్యాచ్లో టీమిండియా విజయం గ్యారెంటీ అని టీమిండియా అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.