#image_title
ICC World Cup 2023 : ప్రస్తుతం ప్రపంచమంతా రేపటి మ్యాచ్ కోసం ఎదురు చూస్తోంది. అదే భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా. అసలే ఆదివారం.. ఇక క్రికెట్ మ్యాచ్. అది కూడా వన్డ్ క్రికెట్ మ్యాచ్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి. రచ్చ రంబోలానే కదా. అది కూడా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా అంటే రెండు దిగ్గజ టీమ్ ల మధ్య పోటీ అంటే మామూలుగా ఉండదు. అందుకే ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని ఆ మ్యాచ్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు. అయితే.. ఆ మ్యాచ్ కి శుభ్ మన్ గిల్ దూరం అవుతాడని వార్తలు వచ్చాయి. ఎందుకంటే.. శుభ్ మన్ కి డెంగ్యూ రావడంతో ఓపెనర్, ఆల్ రౌండర్ శుభ్ మన్ తొలి మ్యాచ్ కే దూరం అవుతాడని అంతా అనుకున్నారు. కానీ.. తాజాగా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఒక గుడ్ న్యూస్ చెప్పాడు.
డెంగ్యూ బారిన పడ్డ ఓపెన్ శుభ్ మన్ గిల్ ప్రస్తుతం ఫిట్ గానే ఉన్నాడని గుడ్ న్యూస్ చెప్పాడు. దీంతో క్రికెట్ అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. మ్యాచ్ కి ఇంకా సమయం ఉండటంతో శుభ్ మన్ గిల్ వన్డే వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో ఉండే చాన్స్ ఉంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరగనుంది. డెంగ్యూ రావడంతో శుభ్ మన్ గిల్ ప్రాక్టీస్ సెషన్స్ లోనూ పాల్గొనలేదు. దీంతో శుభ్ మన్ గిల్ ప్లేస్ లో ఇషాన్ కిషన్ ను తీసుకుంటారని అనుకున్నారు. నిజానికి శుభ్ మన్ గిల్ ప్రస్తుతం ఫామ్ లో ఉన్నాడు. ఓపెనర్ గా శుభ్ మన్ అయితే పరుగుల వరద సృష్టించడం ఖాయం. అందుకే.. శుభ్ మన్ ను ఓపెనర్ గా పంపించాలని టీమిండియా భావిస్తోంది.
#image_title
తాజాగా మీడియాతో మాట్లాడిన రాహుల్ ద్రవిడ్.. శుభ్ మన్ గిల్ ఆరోగ్యంగానే ఉన్నాడని.. మ్యాచ్ కు ఇంకా సమయం ఉన్నందున అప్పటి వరకు శుభ్ మన్ గిల్ కోలుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. మ్యాచ్ సమయానికి పూర్తిగా కోలుకొని మ్యాచ్ ఆడుతాడనే ఆశాభావం వ్యక్తం చేశారు రాహుల్. మరోవైపు మ్యాచ్ కోసం ప్లేయర్స్ అంతా సిద్ధంగా ఉన్నారని.. చెన్నై పిచ్ ను అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ప్రాక్టీస్ చేస్తున్నామని రాహుల్ స్పష్టం చేశాడు.
Naga Chaitanya Sobhita Dhulipala : సమంత నుండి విడిపోయిన తర్వాత నాగ చైతన్య.. శోభితని వివాహం చేసుకున్న విషయం…
Chanakyaniti : సాధార్నంగా కొన్ని విషయాలలో మహిళలే ఎక్కువగా సిగ్గు పడుతుంటారు. కానీ చాణిక్య నీతిలో చాణిక్యుడు స్త్రీలే కాదు,పురుషులు…
Pan India Star : సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కడం ఒక అదృష్టం. అవకాశాన్ని అందిపుచ్చుకున్న తర్వాత సక్సెస్ ఉన్నంతకాలం…
Asaduddin Owaisi : ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పాకిస్తాన్ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. భారత్ కంటే పాకిస్తాన్…
CM Revanth Reddy : తెలంగాణ Telangna CM ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ సందర్భంగా తెలంగాణ…
TS SSC Results 2025 : తెలంగాణ రాష్ట్రంలో TS SSC Class 10th Results 2025 పదో తరగతి…
Horse Gram : నిత్యం ఆరోగ్యంగా Health ఉండాలని ఎవరు కోరుకోరు. అందరికీ ఆరోగ్యంగా ఉండాలని కోరిక. కానీ ప్రస్తుత…
Shahid Afridi : పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన 26 మంది అమాయక భారతీయుల మరణాన్ని ఇంకా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.…
This website uses cookies.