Categories: Newssports

Team India : టీం ఇండియా కప్ గెలిచింది కానీ అనుమానాలు పెంచింది

Team India : దుబాయ్ వేదికగా జరిగిన ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భారత క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. ఇది భారత జట్టుకు మూడో ఛాంపియన్స్ ట్రోఫీ విజయం కావడంతో, ఐసిసి టోర్నమెంట్లలో భారత్ సాధించిన ఏడవ ట్రోఫీ గా చరిత్రలో నిలిచింది. క్రికెట్ అభిమానులు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. కానీ, విజయం అనంతరం భారత జట్టు ఆటగాళ్లు ఒకేసారి తిరిగి రావడం మానేసి, వారు విడివిడిగా స్వదేశానికి చేరుకోవడం చర్చనీయాంశమైంది. సాధారణంగా, ప్రపంచ కప్ లాంటి గొప్ప విజయాల తర్వాత, జట్టుకు ఘన స్వాగతం లభించడం సాధారణమే. అయితే, ఈసారి అలాంటి దృశ్యాలు కనిపించకపోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఓ వైపు భారత జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ ఢిల్లీ విమానాశ్రయంలో కనిపించగా, మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై విమానాశ్రయంలో దిగాడు. అతన్ని చూసేందుకు అభిమానులు గుమిగూడినప్పటికీ, జట్టును కలసి స్వాగతించేవారు లేకపోవడం గమనార్హం. అలాగే, రిషబ్ పంత్, వరుణ్ చక్రవర్తి సహా ఇతర ఆటగాళ్లు కూడా ప్రత్యేకంగా వారి సొంత నగరాలకు వెళ్లిపోయారు. ఇది గతంలో జరిగిన టీ20 ప్రపంచ కప్ విజయం సమయంలో జట్టుకు అందించిన ఘన స్వాగతానికి భిన్నంగా ఉంది. సాధారణంగా, ఒక ట్రోఫీ గెలుచుకున్న తర్వాత, జట్టు సభ్యులు కలిసి స్వదేశానికి తిరిగి వచ్చి అభిమానం పొందడం ఆనవాయితీ. కానీ, ఈసారి వారు ఒక్కో నగరానికి విడివిడిగా ప్రయాణించడం వెనుక కారణాలు ఏమిటనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి…

 

Team India : టీం ఇండియా కప్ గెలిచింది కానీ అనుమానాలు పెంచిందిదీనికి ప్రధాన కారణం భారత జట్టు తక్కువ గ్యాప్‌లో చా లా టోర్నమెంట్లు ఆడడం కావొచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టు ఇంగ్లాండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడి, ఆ వెంటనే దుబాయ్‌లో జరిగిన ఈ ఐసిసి టోర్నమెంట్‌లో పాల్గొంది. ఇప్పుడు, మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఐసిసి టోర్నమెంట్‌లో కలిసి ఆడిన భారత ఆటగాళ్లు ఇప్పుడు ఐపీఎల్‌లో తమ తమ జట్ల తరఫున పోటీ పడాలి. అందుకే బీసీసీఐ వారి సౌలభ్యం మేరకు నేరుగా స్వగృహాలకు వెళ్లేందుకు అనుమతించి ఉండొచ్చు. అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికీ, ఈ నిర్ణయం వెనుక ముఖ్యమైన కారణం భారత ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించడం మరియు త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్‌ కోసం సిద్ధమవ్వడం అని భావిస్తున్నారు.

Recent Posts

Phone | రూ.15,000 బడ్జెట్‌లో మోటరోలా ఫోన్ కావాలా?.. ఫ్లిప్‌కార్ట్‌లో Moto G86 Power 5Gపై భారీ ఆఫర్!

Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…

8 hours ago

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

11 hours ago

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ఆందోళన .. కాకినాడ తీరంలో కల్లోలం

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…

14 hours ago

Dry Eyes | కళ్ళు పొడిబారడం వ‌ల‌న పెరుగుతున్న సమస్య .. కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…

15 hours ago

Lemon Seeds | అవి పారేయకండి ..నిమ్మగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…

18 hours ago

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

21 hours ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

1 day ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

1 day ago