Team India : టీం ఇండియా కప్ గెలిచింది కానీ అనుమానాలు పెంచింది

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 12 March 2025, 10:00 pm
  •  Team India : టీం ఇండియా కప్ గెలిచింది కానీ అనుమానాలు పెంచింది

Team India : దుబాయ్ వేదికగా జరిగిన ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భారత క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. ఇది భారత జట్టుకు మూడో ఛాంపియన్స్ ట్రోఫీ విజయం కావడంతో, ఐసిసి టోర్నమెంట్లలో భారత్ సాధించిన ఏడవ ట్రోఫీ గా చరిత్రలో నిలిచింది. క్రికెట్ అభిమానులు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. కానీ, విజయం అనంతరం భారత జట్టు ఆటగాళ్లు ఒకేసారి తిరిగి రావడం మానేసి, వారు విడివిడిగా స్వదేశానికి చేరుకోవడం చర్చనీయాంశమైంది. సాధారణంగా, ప్రపంచ కప్ లాంటి గొప్ప విజయాల తర్వాత, జట్టుకు ఘన స్వాగతం లభించడం సాధారణమే. అయితే, ఈసారి అలాంటి దృశ్యాలు కనిపించకపోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఓ వైపు భారత జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ ఢిల్లీ విమానాశ్రయంలో కనిపించగా, మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై విమానాశ్రయంలో దిగాడు. అతన్ని చూసేందుకు అభిమానులు గుమిగూడినప్పటికీ, జట్టును కలసి స్వాగతించేవారు లేకపోవడం గమనార్హం. అలాగే, రిషబ్ పంత్, వరుణ్ చక్రవర్తి సహా ఇతర ఆటగాళ్లు కూడా ప్రత్యేకంగా వారి సొంత నగరాలకు వెళ్లిపోయారు. ఇది గతంలో జరిగిన టీ20 ప్రపంచ కప్ విజయం సమయంలో జట్టుకు అందించిన ఘన స్వాగతానికి భిన్నంగా ఉంది. సాధారణంగా, ఒక ట్రోఫీ గెలుచుకున్న తర్వాత, జట్టు సభ్యులు కలిసి స్వదేశానికి తిరిగి వచ్చి అభిమానం పొందడం ఆనవాయితీ. కానీ, ఈసారి వారు ఒక్కో నగరానికి విడివిడిగా ప్రయాణించడం వెనుక కారణాలు ఏమిటనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి…

 

Team India : టీం ఇండియా కప్ గెలిచింది కానీ అనుమానాలు పెంచింది

Team India : టీం ఇండియా కప్ గెలిచింది కానీ అనుమానాలు పెంచిందిదీనికి ప్రధాన కారణం భారత జట్టు తక్కువ గ్యాప్‌లో చా లా టోర్నమెంట్లు ఆడడం కావొచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టు ఇంగ్లాండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడి, ఆ వెంటనే దుబాయ్‌లో జరిగిన ఈ ఐసిసి టోర్నమెంట్‌లో పాల్గొంది. ఇప్పుడు, మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఐసిసి టోర్నమెంట్‌లో కలిసి ఆడిన భారత ఆటగాళ్లు ఇప్పుడు ఐపీఎల్‌లో తమ తమ జట్ల తరఫున పోటీ పడాలి. అందుకే బీసీసీఐ వారి సౌలభ్యం మేరకు నేరుగా స్వగృహాలకు వెళ్లేందుకు అనుమతించి ఉండొచ్చు. అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికీ, ఈ నిర్ణయం వెనుక ముఖ్యమైన కారణం భారత ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించడం మరియు త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్‌ కోసం సిద్ధమవ్వడం అని భావిస్తున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "Korean Kanakaraju Censor Review : కొరియన్ కనకరాజు సెన్సార్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే..?"

  2. "TTN SPECIAL ANALYSIS : బంకీపూర్ లో అంత ఈజీ గా ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచాడు ?"

  3. "Indiramma House: పేదలకు బంపర్ ఛాన్స్.. రూ.40 లక్షల ఫ్లాట్.. కేవలం రూ.6 లక్షలకే .. అర్హతలు, అప్లై విధానం, పూర్తి వివరాలివే..!"

  4. "PM-KISAN : రైతులకు భారీ శుభవార్త.. 23 విడతల్లో రూ.4.47 లక్షల కోట్లు జమ.. కొత్త లబ్ధిదారులపై కేంద్రం కీలక ప్రకటన"

  5. "Pradeep Rawat : టాలీవుడ్ స్టార్ విలన్ ప్రదీప్ రావత్.. కోట్ల ఆస్తి వెనుక అసలు కథ..!"

  6. "Karthika Deepam 2 Today Episode August 05 : సూరజ్‌ను దత్తత తీసుకుంటానన్న శ్రీధర్.. జ్యోత్స్నకు భారీ షాక్!"

  7. "Gold Rate Today : గుడ్‌న్యూస్‌.. నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి.. ఆగస్టు 5 తాజా గోల్డ్ రేట్లు ఇవే!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp