Phone Switched Off : ఈ చిన్న ట్రిక్ ద్వారా దొంగిలించిన ఫోన్ స్విచ్ ఆఫ్ కాకుండా చేయొచ్చు ..??
Phone Switched Off : ప్రస్తుతం అందరి చేతుల్లో మొబైల్స్ తప్పనిసరిగా ఉంటున్నాయి. ఉద్యోగులు, వ్యాపారం చేసే వాళ్ళు తమ వ్యక్తిగత అవసరాలతో పాటు ఆఫీస్ పనులకు సంబంధించిన పనులను కూడా మొబైల్ ద్వారా నిర్వహిస్తున్నారు. అయితే ఒకోసారి హడావుడి లో మొబైల్ ఫోన్లను మర్చిపోతూ ఉంటారు. మరికొందరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఫోను వేరే వాళ్ళు దొంగలిస్తుంటారు. ఎవరైనా ఫోన్ దొంగలించిన వెంటనే ముందుగా స్విచ్ ఆఫ్ చేస్తారు. కొన్ని రోజులపాటు స్విచ్ ఆఫ్ చేసి తర్వాత సిమ్ ను మార్చడం, తదితర పనులు చేస్తుంటారు. అయితే మొబైల్లో ఈ చిన్న ట్రిక్ ద్వారా దొంగిలించిన ఫోన్ స్విచ్ ఆఫ్ కాకుండా చేయవచ్చు.
మొబైల్స్ ఎంత జాగ్రత్తగా కాపాడుకున్న ఒక్కోసారి దొంగల బారిన పడకుండా ఉండదు. ఒకప్పుడు ఫోన్ దొంగలించబడితే అసలు దొరికేది కాదు. కానీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ కారణంగా ఫోన్ ఎక్కడున్నా ట్రేస్ చేయవచ్చు. అయితే అందుకు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఒకవేళ ఫోన్ దొంగలించబడితే దొంగలు ముందుగా మొబైలు స్విచ్ ఆఫ్ చేస్తుంటారు. దీంతో ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవడం కష్టం. అయితే ఒక ట్రిక్ ద్వారా అసలు మొబైల్ ఫోను స్విచ్ ఆఫ్ కాకుండా చేయవచ్చు. అందుకోసం ముందుగా మొబైల్ లోని సెట్టింగ్స్ ని మార్చుకోవాలి.
ముందుగా సెట్టింగ్స్ లోకి వెళ్లి ‘ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ ‘ లోకి వెళ్ళాలి. ఇక్కడ ‘ సిస్టం సెక్యూరిటీ ‘ అనే ఆప్షన్ కనబడుతుంది. దీనిపై క్లిక్ చేయాలి ఇప్పుడు ‘ రిక్వైర్డ్ పాస్వర్డ్ పవర్ ఆఫ్ ‘ అనే ఆప్షన్ వస్తుంది. ఇందులోకి వెళ్ళిన తర్వాత వచ్చిన ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. దీనిపై ఉన్న ‘ ఫైండ్ మై డివైస్ ‘ అనే ఆప్షన్ను కూడా ఆన్ చేయాలి. దీంతో మీరు అనుకున్న సెట్టింగ్స్ కంప్లీట్ అవుతోంది. ఈ సెట్టింగ్స్ మార్చుకున్న తర్వాత ఫోను ఎవరు దొంగలించినా కూడా దానిని స్విచ్ ఆఫ్ చేయలేరు. ఆ సమయంలో వారికి పాస్వర్డ్ అడుగుతుంది. అందువల్ల ఈ విధంగా పాస్వర్డ్ సెట్ చేసుకోవడం వలన ఫోన్ ఎక్కడుందో వెంటనే ట్రేస్ చేయవచ్చు. తర్వాత దొంగను వెంటనే పట్టుకోవచ్చు. మొబైల్ విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
This website uses cookies.