తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన సైదాబాద్ అత్యాచార నిందితుడి కోసం వారం రోజులుగా పోలీసులు వెతుకుతున్న సంగతి తెలిసిందే. కాగా నిందితుడు రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కోసం రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ పడుతున్న పోలీసులకు రాజు మృతదేహం లభ్యం అయింది.
ఈ ఘటన కొద్ది గంటల క్రితమే జరిగినట్టు పోలీసులు తెలుపుతున్నారు. వారం రోజుల క్రితం సైదాబాద్లోని సింగరేణి కాలనీలో చిన్నారిని అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితుడు రాజు ఎవరికీ చిక్కకుండా పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నాడు.కాగా అతన్ని పట్టిస్తే రూ.10లక్షలు ఇస్తామని పోలీసులు రివార్డు కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే రాజు కొద్ది సేపటి క్రితమే స్టేషన్ ఘన్పూర్ రైల్వేస్టేషన్కు సమీపంలో ట్రైన్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా సమాచారం.
మృతుడి చేతిపై ఉన్నటువంటి పచ్చబొట్టు ఆధారంగా అది రాజు మృతదేహం అని పోలీసులు గుర్తించారు. ఇక అతని చేతిపై మౌనిక అనే పేరు ఆధారంగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఇక రాజు ఆత్మహత్యపై చిన్నారి కుటుంబ సభ్యులు స్పందించారు. తమకు డెడ్ బాడీని చూపిస్తే గానీ నమ్మలేమన్నారు. ఎందుకంటే ఈ కాలంలో అందరూ టాటూలు వేయించుకుంటున్నారని, కాబట్టి అతడి మృతదేహాన్ని ఒకసారి సైదాబాద్కు తీసుకువస్తే చూసిన తర్వాతే నమ్ముతామంటూ చెబుతున్నారు. కాగా ఇంకోవైపు రాజు కుటుంబ సభ్యులు ఈ విషయం తెలుసుకుని కన్నీరు పెడుతున్నారు.రాజు మృతదేహాన్ని స్థానికులు చూసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగి పూర్తి వివరాలు సేకరించేందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. అయితే అను ఏ టైమ్కు చేసుకున్నాడో, ఏ ట్రైన్ కింద పడ్డాడో తెలియాల్సి ఉంది.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.