Telangana : నిజంగా గ్రేట్.. తెలంగాణలో ప్రభుత్వ స్కూల్స్ అన్ని ఫుల్.. అడ్మిషన్స్ అనేవి లేవు బోర్డు..!
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల తీసుకున్న సంకల్పత్మక చర్యలు ఇప్పుడు ఫలితాలు ఇస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల ముందు “Admissions Closed” అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్లోని MPPS ప్రాథమిక పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు పూర్తయిన నేపథ్యంలో, స్కూల్ ముందు “అడ్మిషన్స్ క్లోజ్” బోర్డు ఉంచడం ఈ మార్పుకు స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తోంది…
Telangana : నిజంగా గ్రేట్.. తెలంగాణలో ప్రభుత్వ స్కూల్స్ అన్ని ఫుల్.. అడ్మిషన్స్ అనేవి లేవు బోర్డు..!
రాష్ట్ర ప్రజల్లో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరగడమే ఈ దృశ్యాల వెనుక ఉన్న అసలైన నిజం. నూతన మౌలిక సదుపాయాలు, చక్కగా నిర్వహించబడుతున్న పాఠశాలలు, రుచికరమైన మధ్యాహ్న భోజనం, బహుళ భాషల్లో నైపుణ్యాలపై దృష్టి, మరియు సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇచ్చే కొత్త తరహా పాఠ్య విధానం విద్యార్థుల్ని ఆకర్షిస్తున్నాయి. ఈ మార్పు రేవంత్ రెడ్డి నాయకత్వంలో తీసుకున్న ప్రగతిశీల విద్యా విధానాలకు నిదర్శనం.
ఈ తరహా విజయం ఖిలాషాపూర్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక పాఠశాలల్లో కనిపిస్తోంది. ఇది కేవలం విద్యార్థులే కాదు, వారి తల్లిదండ్రుల నమ్మకాన్ని గెలుచుకున్న పాలనా శైలికి చిహ్నం. సమానమైన విద్యా అవకాశాలను అందించే దిశగా, ప్రైవేట్ పాఠశాలలపై ఆధారపడే పరిస్థితిని తగ్గిస్తూ, ప్రభుత్వ పాఠశాలల పట్ల గౌరవం పెంచే మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం దృఢంగా అడుగులు వేస్తోంది. “సర్కార్ బడి” ఇప్పుడు ప్రజల సెలక్షన్ అయింది – ఇది విద్యా రంగంలో సంకల్పబద్ధమైన మార్పుకు నాంది.
Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్తో…
Actress : ఒకనాటి బాలీవుడ్ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకి కాస్త దూరంగానే…
Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…
Warangal Congress : కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్…
RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…
Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…
Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…
Guntur Sp : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో.. సింగయ్య అనే వ్యక్తి…
This website uses cookies.