Ponguleti Srinivas Reddy : బీఆర్ఎస్ మోసాలపై త్వరలో రాజకీయ బాంబులు : మంత్రి పొంగులేటి
Ponguleti Srinivas Reddy : ఒకటి రెండు రోజుల్లో తెలంగాణలో రాజకీయపరంగా బాంబులు పేలుతాయని అవి పెను విస్పోవడానికి దారి తీస్తాయని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. పలువురు మంత్రులు, మీడియా ప్రతినిధులతో కలిసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దక్షిణ కొరియా రాజధాని నగరం సియోలో పర్యటిస్తున్నారు. సియోల్ లో హాన్ నది పునర్జీవనానికి సంబంధించి అధ్యయనం చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఇలా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో ఒకటి లేదా రెండు రోజుల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటాయని అది కూడా తాను హైదరాబాద్కు తిరిగి వచ్చే సమయానికి ఇది జరగవచ్చునని తెలిపారు.
ఆరోపించిన కుంభకోణాలపై కాంగ్రెస్ ప్రభుత్వం తొందరపడి చర్యలు తీసుకోదలుచుకోలేదని, అయితే సాక్ష్యాలను బట్టి చర్యలు తీసుకుంటామని ఆయన ఉద్ఘాటించారు. అవకతవకలపై విచారణ జరిపేందుకు ఏర్పాటైన కమిషన్ త్వరలోనే నివేదికను అందజేస్తుందని ఆయన పేర్కొన్నారు. ధరణిలోని అవకతవకలను ప్రస్తావిస్తూ, విదేశీ కంపెనీని (గతంలో ధరణి పోర్టల్ను నిర్వహించే ఫాల్కన్ SG హోల్డింగ్ (ఫిలిప్పీన్స్) ఇంక్.) ఎలాంటి దుష్ప్రవర్తనకు బాధ్యత వహించాలనే దానిపై ఎంపికలను అన్వేషిస్తున్నట్లు ఆయన చెప్పారు.
భూమికి సంబంధించిన హక్కులపై సామాన్య రైతుల నుంచి పెద్ద వ్యక్తుల వరకు ఎవరు ఎటువంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదు. అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా కొత్త ఆర్వో ఆర్ చట్టాన్ని తీసుకొస్తున్నాం. కొత్త చట్టం ప్రజలకు అనుకూలంగా ఉంటుంది.. లక్షల మంది రైతులకు ప్రభుత్వం భరోసా ఇస్తుంది. 15 దేశాలలో అమల్లో ఉన్న రెవెన్యూ విధానాలను అధ్యయనం చేసి కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఈ ముసాయిదా కు సంబంధించి రైతులు, మేధావులు, సామాన్యుల నుంచి అభిప్రాయాలు తీసుకుని చట్టంగా రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి బృందంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, కాలె యాదయ్య, ఉన్నతాధికారులు ఉన్నారు. దక్షిణ కొరియాలో ఇటీవల అభివృద్ధి చేసిన ఇంచియాన్లో భాగమైన చియోంగ్నా, సాంగ్డో మరియు యోంగ్జాంగ్ స్మార్ట్ సిటీలను వారు సందర్శించారు.
Ponguleti Srinivas Reddy : బీఆర్ఎస్ మోసాలపై త్వరలో రాజకీయ బాంబులు : మంత్రి పొంగులేటి
పట్టణాభివృద్ధిలో పెట్టుబడులు మరియు డివిడెండ్ల గురించి స్థానిక పరిపాలన ప్రతినిధి బృందం తెలియజేసింది. హైదరాబాదులో ఇదే విధమైన విద్యా సదుపాయాన్ని ఏర్పాటు చేయడం గురించి చర్చించడానికి అధికారిక ప్రతినిధి బృందం యంగ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా సందర్శించింది.
Keerthy Suresh : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…
Maha News Channel : హైదరాబాద్లోని మహా న్యూస్ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…
Imprisonment : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…
Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…
Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…
Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…
Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…
Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…
This website uses cookies.