
Congress : రోజు రోజుకి ఇరకాటంలో పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ..బీఆర్ఎస్ చెప్పిందే జరిగిందా..!
Congress : పదేళ్ల పాటు బీఆర్ఎస్ తెలంగాణలో పరిపాలన సాగించగా, వారి పరిపాలనకి విసుగు చెందిన ప్రజలు ఈ సారి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. అయితే గత పది నెలలుగా సీఎం రేవంత్రెడ్డి అనుసరిస్తున్న పాలసీ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్మాణాత్మక వైఖరిని కాకుండా డైవర్షన్ పాలిటిక్స్ను నమ్ముకొని పాలన సాగిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక సమస్య వస్తే దానిని కప్పిపుచ్చేందుకు మరో సమస్యను సృష్టిస్తూ గందరగోళంలో ముంచుతున్నారనే విమర్శను ముఖ్యమంత్రి ఎదుర్కొంటున్నారు.
రీసెంట్ గా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగమనే వాదన వినిపిస్తున్నది. నిజానికి మంత్రి సురేఖను సోషల్మీడియాలో ట్రోల్ చేయడాన్ని మాజీ మంత్రులు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్ సహా పలువురు నేతలు ఖండించారు. అటువంటి వాటిని వ్యక్తిగతంగా, బీఆర్ఎస్ పార్టీ పరంగా ఖండిస్తున్నామని హరీశ్రావు స్పష్టంచేశారు. అయినా, కేటీఆర్ స్పందించలేదంటూ ఆయనతో పాటు అక్కినేని ఫ్యామిలీ, సమంతలపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇక మూసీ సుందరీకరణ, హైడ్రా కూల్చివేతలతో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చివరకు పలువులు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అసహనం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ప్రజా వ్యతిరేకతపై నివేదికలు అందుకున్న అధిష్ఠానం.
Congress : రోజు రోజుకి ఇరకాటంలో పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ..బీఆర్ఎస్ చెప్పిందే జరిగిందా..!
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుని మొట్టికాయలు వేసిందని గాంధీభవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. హైడ్రాతో ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ పెద్దల పర్యవేక్షణలో మొన్నటికి మొన్న ఒక ప్రముఖ హీరోయిన్ చేసిన కామెంట్ అంటూ ఒక కరపత్రాన్ని సోషల్ మీడియాలోకి వదిలారు. అది వైరల్ అయినా కావాల్సినంత మైలేజ్ రాలేదు. దీంతో ఈసారి ఏకంగా మహిళా మంత్రినే రంగంలోకి దించి, సినీ కుటుంబాల వ్యక్తిగత వ్యవహారాలను రాజకీయాల్లోకి లాగారనే చర్చ జరుగుతున్నది. డిసెంబర్ 7న కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన నాటినుంచి తాజాగా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల దాకా పది నెలలుగా సీఎం రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. ‘హైడ్రా, మూసీ కూల్చివేతలపై దృష్టి మళ్లించడం కోసం ఒక మహిళా మంత్రి.. మరో స్టార్ హీరోయిన్ వ్యక్తిగత జీవితంపై నిరాధారమైన ఆరోపణలు చేసి చాలా తప్పు చేశారు.
Buttermilk : వేసవి కాలం రాగానే ఎండలు మండిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో డీహైడ్రేషన్…
Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చల్లని పానీయాలపై మనసు మరింత ఆకర్షితమవుతుంది. ముఖ్యంగా నిమ్మరసం (లెమన్ జ్యూస్) వేసవిలో…
Gond and Gond Katira : చూడ్డానికి దగ్గరగా కనిపించడం పేర్లు కూడా కలిపివచ్చేలా ఉండడం వల్ల గోండ్ మరియు…
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
This website uses cookies.