Congress : రోజు రోజుకి ఇరకాటంలో పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ..బీఆర్ఎస్ చెప్పిందే జరిగిందా..!
Congress : పదేళ్ల పాటు బీఆర్ఎస్ తెలంగాణలో పరిపాలన సాగించగా, వారి పరిపాలనకి విసుగు చెందిన ప్రజలు ఈ సారి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. అయితే గత పది నెలలుగా సీఎం రేవంత్రెడ్డి అనుసరిస్తున్న పాలసీ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్మాణాత్మక వైఖరిని కాకుండా డైవర్షన్ పాలిటిక్స్ను నమ్ముకొని పాలన సాగిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక సమస్య వస్తే దానిని కప్పిపుచ్చేందుకు మరో సమస్యను సృష్టిస్తూ గందరగోళంలో ముంచుతున్నారనే విమర్శను ముఖ్యమంత్రి ఎదుర్కొంటున్నారు.
రీసెంట్ గా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగమనే వాదన వినిపిస్తున్నది. నిజానికి మంత్రి సురేఖను సోషల్మీడియాలో ట్రోల్ చేయడాన్ని మాజీ మంత్రులు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్ సహా పలువురు నేతలు ఖండించారు. అటువంటి వాటిని వ్యక్తిగతంగా, బీఆర్ఎస్ పార్టీ పరంగా ఖండిస్తున్నామని హరీశ్రావు స్పష్టంచేశారు. అయినా, కేటీఆర్ స్పందించలేదంటూ ఆయనతో పాటు అక్కినేని ఫ్యామిలీ, సమంతలపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇక మూసీ సుందరీకరణ, హైడ్రా కూల్చివేతలతో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చివరకు పలువులు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అసహనం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ప్రజా వ్యతిరేకతపై నివేదికలు అందుకున్న అధిష్ఠానం.
Congress : రోజు రోజుకి ఇరకాటంలో పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ..బీఆర్ఎస్ చెప్పిందే జరిగిందా..!
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుని మొట్టికాయలు వేసిందని గాంధీభవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. హైడ్రాతో ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ పెద్దల పర్యవేక్షణలో మొన్నటికి మొన్న ఒక ప్రముఖ హీరోయిన్ చేసిన కామెంట్ అంటూ ఒక కరపత్రాన్ని సోషల్ మీడియాలోకి వదిలారు. అది వైరల్ అయినా కావాల్సినంత మైలేజ్ రాలేదు. దీంతో ఈసారి ఏకంగా మహిళా మంత్రినే రంగంలోకి దించి, సినీ కుటుంబాల వ్యక్తిగత వ్యవహారాలను రాజకీయాల్లోకి లాగారనే చర్చ జరుగుతున్నది. డిసెంబర్ 7న కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన నాటినుంచి తాజాగా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల దాకా పది నెలలుగా సీఎం రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. ‘హైడ్రా, మూసీ కూల్చివేతలపై దృష్టి మళ్లించడం కోసం ఒక మహిళా మంత్రి.. మరో స్టార్ హీరోయిన్ వ్యక్తిగత జీవితంపై నిరాధారమైన ఆరోపణలు చేసి చాలా తప్పు చేశారు.
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…
This website uses cookies.