Etela Rajender : కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం నాకు లేదు - ఈటెల..!
Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఈటల, తాను కమిషన్ ఎదుట హాజరై విచారణకు సమాధానాలు ఇచ్చినట్టు తెలిపారు. తన ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలను స్పష్టంగా వివరించానని చెప్పారు. ప్రాజెక్ట్కు సంబంధించిన ఆర్థిక నిర్ణయాలు పూర్తిగా మంత్రివర్గ సమావేశాల ద్వారా జరిగాయని స్పష్టం చేశారు. “కేసీఆర్ను నేను రక్షించాల్సిన అవసరం లేదు,” అని ఆయన తేల్చి చెప్పారు.
Etela Rajender : కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం నాకు లేదు – ఈటెల..!
ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలపై ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. తప్పుడు వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ మంత్రులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేక దశలలో మంత్రివర్గ ఉపసంఘం (కేబినెట్ సబ్ కమిటీ) సిఫార్సుల ఆధారంగా ముందుకెళ్లిందని వివరించారు. ప్రాజెక్ట్లో జరిగిన రీడిజైనింగ్, వాటి వెనుకనున్న నిర్ణయాలను త్వరలోనే అన్ని జీవోలు (G.O.s), సబ్ కమిటీ నివేదికల రూపంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఇది అసలు నిజాలు వెలుగులోకి వచ్చే దశగా అభివర్ణించారు.
అలాగే కేబినెట్లో చర్చించకుండా ఏ ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని ఈటల స్పష్టం చేశారు. అప్పటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కడియం శ్రీహరి వంటి వారంతా ఈ ప్రక్రియకు సాక్షులేనని గుర్తు చేశారు. ప్రతి ఒక్క నిర్ణయంపై కేసీఆర్ మంత్రులతో సంపూర్ణ చర్చ చేసిన తరువాతే అమలు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ నేతలు నిజంగా ధైర్యం ఉంటే, అప్పటి పీసీ ఘోష్ కమిటీ నివేదికను ప్రజల ముందు ఉంచాలని, లేదంటే కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
This website uses cookies.