Good News : కరెంట్ బిల్లు పై శుభవార్త చెప్పిన ప్రభుత్వం…!

Good News : కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలను ఇస్తామని హామీ ఇచ్చారు.అందులో ఒకటి గృహ జ్యోతి పథకం. 200 యూనిట్ల లోపు బిల్లును ప్రభుత్వం కడుతుందని ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ గృహ జ్యోతి పథకం ప్రకారం 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ అంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఊదరగొట్టారు.ఇవాళ ఒకటో తారీకు మరో రెండు మూడు రోజులలో బిల్లులు ఇంటికి వస్తాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం కరెంట్ బిల్లు కట్టాలా వద్దా అనేది ప్రజలలో సందేహం కలుగుతుంది. కాంగ్రెస్ నాయకులు చెప్పిన దాని ప్రకారం బిల్లు కట్టకూడదు. అలా అని బిల్ కట్టకపోతే కట్ చేసేస్తారు. ప్రభుత్వం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు సామాన్యులు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు తమకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుందని అనుకున్నారు.

కానీ అనుకున్నది ఒక్కటి అయిందొకటి అన్నట్టుగా నేడు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. కరెంటు బిల్లులు కట్టొద్దంటూ గతంలో చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు. 200 యూనిట్ల లోపు ఫ్రీ అన్నవారు కానరాకుండా పోయారు. ఇప్పుడు ఆ విషయం గురించి ఎక్కడ మాట్లాడటం లేదు. గృహజ్యోతి పథకం అంటూ గొప్పగా ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నంతగా దాన్ని మార్చింది. తమ ప్రభుత్వం రావటం వలన అన్ని సమస్యలు తీరిపోతాయని ప్రచారం చేసుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ముఖం చాటేసుకుంటున్నారు. కరెంటు కోతలతో ఒకపక్క రైతులు, ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా అందని కరెంటు తిప్పలతో పేషెంట్లు మరోపక్క ఉన్నారు. ఈ క్రమంలో అసలు ఫ్రీ కరెంటు ఉంటుందా..ఇస్తారా..ఇవ్వరా.. సందిగ్ధత ఏర్పడింది.

ఇక గత ప్రభుత్వం బీఆర్ఎస్ విద్యుత్ రంగంపై అప్పులు చేసిందంటూ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కరెంటు బిల్లులు కట్టొద్దు అంటూ ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు సైలెంట్ గా అప్పుల పేరుతో పక్కకు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు గృహజ్యోతి పథకం నిబంధన ఎక్కడ ప్రకటించలేదు. అసలు ఈ పథకాన్ని అమలు చేస్తారా లేక ఎగ్గొడతారా అని అనుమానాలు కలుగుతున్నాయి. అలాగే పింఛనుదారులకు గతంలో 2016 రూపాయలు వచ్చేవి. అయితే కాంగ్రెస్ ఈ డబ్బులను 4000 చేస్తామంటూ ప్రచారం చేసింది. దీనితో చాలామంది కాంగ్రెస్ హామీలకు ఆకర్షితులయ్యారు. ఇప్పుడు ఓటేసిన వారికి మొండి చేయి చూపించింది హస్తం గుర్తు పార్టీ. పాత డబ్బులనే వాళ్ళకి ఇచ్చింది. దీంతో వృద్ధులు ఇతర పింఛన్ దారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

Share

Recent Posts

Rajiv yuva Vikasam : గుడ్‌న్యూస్‌.. నిరుద్యోగ యువతకు ఇక ఆ దిగులు లేదు.. రాజీవ్ యువ వికాసం మీకు వచ్చినట్లే !!

Rajiv yuva Vikasam  : తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్…

7 hours ago

AP Dwcra Women : డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే వాయిదాలు చెల్లించే అవకాశం..!

AP Dwcra Women : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ,…

8 hours ago

Bhu Bharati : జూన్ 2 నుంచి తెలంగాణ వ్యాప్తంగా భూ భారతి రెవెన్యూ సదస్సులు

Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ వ్యవస్థలో పారదర్శకత, సమగ్రత కలిగించేందుకు చేపట్టిన "భూభారతి" చట్టానికి ప్రజల…

9 hours ago

Mangoes : వామ్మో .. మామిడి పండు కిలో ధర రూ.2 లక్షలా..? అంత ప్రత్యేకత ఏంటి..?

Mangoes :  వేసవి అంటే మామిడి పండ్ల రుచులే గుర్తొస్తాయి. దేశవ్యాప్తంగా మామిడి సీజన్‌ ఊపందుకుంటే, పలు రకాల వెరైటీలు…

11 hours ago

Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్‌ యువ వికాసం స్కీమ్‌ దరఖాస్తుదారులకు పండగలాంటి వార్త

Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకం నిరుద్యోగ యువతకు…

12 hours ago

Pushkarini : ఏపీలో పుష్కరిణిలో స్నానం చేస్తే.. గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం

Pushkarini : ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో ఉన్న చిత్తూరు జిల్లాలోని ములభాగల్ ప్రాంతంలో 600 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ పాద…

13 hours ago

Today Gold Rate : తగ్గిన బంగారం ధర .. ధరలెలా ఉన్నాయంటే?

Today Gold Rate : బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం…

14 hours ago

New Ration Card : కొత్త రేషన్ కార్డు కావాలంటే ఈ డాక్యుమెంట్లు ఉండాల్సిందే..!!

New Ration Card : ఏపీ సర్కార్ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానించడంతో ఎన్నో కుటుంబాలు ఎంతో…

15 hours ago