Jana Reddy : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా సాగబోతుంది. అధికార పార్టీ టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం అవ్వడంతో ఆపార్టీ తీవ్రంగా గెలిచేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పటికే పార్టీ ప్రచారంను మొదలు పెట్టి పెద్ద ఎత్తున సభలు సమావేశాలు నిర్వహించింది. ఇక దుబ్బాక మరియు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచి మంచి ఊపు మీదున్న బీజేపీ సాగర్ లో కమలం జెండా ఎగుర వేయాలని ఉవ్విల్లూరుతుంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సాగర్ ను గెలిచి తీరుతాం అంటూ నమ్మకంగా ఉంది. వారి నమ్మకంకు కారణం జానా రెడ్డి. గత ఎన్నికల్లో ఆ స్థానం నుండి జానా రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడి పోయాడు. దాంతో ఆయన ఈసారి గెలవడం ఖాయం అంటూ రాజకీయ వర్గాల వారు కూడా నమ్మకంగా చెబుతున్నారు.
జానారెడ్డి వల్ల నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కనుక గెలిస్తే ఖచ్చితంగా ఆ పార్టీకి మంచి బూస్ట్ లభించినట్లే. ఎందుకంటే గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రతి చోట కూడా బొక్క బోర్లా పడుతూ వస్తున్న నేపథ్యంలో రెండవ స్థానం కోసం ఇప్పికే బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ తీవ్రంగా కృషి చేస్తుంది. వారికి వరుస విజయాలు నమోదు అవుతున్న నేపథ్యంలో ప్రజల్లో కూడా వారి పట్ల నమ్మకం కలుగుతుంది. గెలిచే వారినే జనాలు కావాలనుకుంటున్నారు. ఓడిపోతుంటే మా ఓటు వృదా అవ్వడం ఎందుకు అన్నట్లుగా గెలిచే వారిని గెలిపించేందుకు ఓటు వేస్తారు. కనుక సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ముందు ముందు ఆ పార్టీకి ప్లస్ అవుతుంది.
సాగర్ ఉప ఎన్నికల్లో జానా రెడ్డి పోటీ చేయడం దాదాపుగా ఖాయం అయ్యింది. ఉప ఎన్నిక అనగానే మండలంకు గ్రామంకు అన్నట్లుగా పార్టీ సమన్వయ కార్యకర్తలను కేటాయిస్తుంది. రాష్ట్ర స్థాయి నాయకులు కూడా మండల స్థాయిలో పార్టీ వ్యవహారాలు చూసుకునేందుకు ఎంపిక చేయబడుతాడు. కాని ఈసారి సాగర్ లో ఆ పద్దతి వద్దని జానా రెడ్డి అంటున్నాడు. బయట నుండి ఏ ఒక్కరిని కూడా తన నియోజక వర్గంలో పర్యవేక్షకులుగా నియమించవద్దని కోరాడు. ప్రతి మండలంలో కూడా తనకు నమ్మకం అయిన వారిని నియమించి వారిని తన కొడుకు రఘువీర్ రెడ్డి తో సమన్వయం చేస్తున్నాడు. అలా గెలుపు కోసం జానారెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. పార్టీ అధినాయకత్వం మాత్రం జానా మొండిగా ముందుకు వెళ్తున్నాడని కేసీఆర్ ను ఆయన ఢీ కొట్టగలడా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.