jana reddy
Jana Reddy : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా సాగబోతుంది. అధికార పార్టీ టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం అవ్వడంతో ఆపార్టీ తీవ్రంగా గెలిచేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పటికే పార్టీ ప్రచారంను మొదలు పెట్టి పెద్ద ఎత్తున సభలు సమావేశాలు నిర్వహించింది. ఇక దుబ్బాక మరియు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచి మంచి ఊపు మీదున్న బీజేపీ సాగర్ లో కమలం జెండా ఎగుర వేయాలని ఉవ్విల్లూరుతుంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సాగర్ ను గెలిచి తీరుతాం అంటూ నమ్మకంగా ఉంది. వారి నమ్మకంకు కారణం జానా రెడ్డి. గత ఎన్నికల్లో ఆ స్థానం నుండి జానా రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడి పోయాడు. దాంతో ఆయన ఈసారి గెలవడం ఖాయం అంటూ రాజకీయ వర్గాల వారు కూడా నమ్మకంగా చెబుతున్నారు.
జానారెడ్డి వల్ల నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కనుక గెలిస్తే ఖచ్చితంగా ఆ పార్టీకి మంచి బూస్ట్ లభించినట్లే. ఎందుకంటే గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రతి చోట కూడా బొక్క బోర్లా పడుతూ వస్తున్న నేపథ్యంలో రెండవ స్థానం కోసం ఇప్పికే బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ తీవ్రంగా కృషి చేస్తుంది. వారికి వరుస విజయాలు నమోదు అవుతున్న నేపథ్యంలో ప్రజల్లో కూడా వారి పట్ల నమ్మకం కలుగుతుంది. గెలిచే వారినే జనాలు కావాలనుకుంటున్నారు. ఓడిపోతుంటే మా ఓటు వృదా అవ్వడం ఎందుకు అన్నట్లుగా గెలిచే వారిని గెలిపించేందుకు ఓటు వేస్తారు. కనుక సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ముందు ముందు ఆ పార్టీకి ప్లస్ అవుతుంది.
jana reddy
సాగర్ ఉప ఎన్నికల్లో జానా రెడ్డి పోటీ చేయడం దాదాపుగా ఖాయం అయ్యింది. ఉప ఎన్నిక అనగానే మండలంకు గ్రామంకు అన్నట్లుగా పార్టీ సమన్వయ కార్యకర్తలను కేటాయిస్తుంది. రాష్ట్ర స్థాయి నాయకులు కూడా మండల స్థాయిలో పార్టీ వ్యవహారాలు చూసుకునేందుకు ఎంపిక చేయబడుతాడు. కాని ఈసారి సాగర్ లో ఆ పద్దతి వద్దని జానా రెడ్డి అంటున్నాడు. బయట నుండి ఏ ఒక్కరిని కూడా తన నియోజక వర్గంలో పర్యవేక్షకులుగా నియమించవద్దని కోరాడు. ప్రతి మండలంలో కూడా తనకు నమ్మకం అయిన వారిని నియమించి వారిని తన కొడుకు రఘువీర్ రెడ్డి తో సమన్వయం చేస్తున్నాడు. అలా గెలుపు కోసం జానారెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. పార్టీ అధినాయకత్వం మాత్రం జానా మొండిగా ముందుకు వెళ్తున్నాడని కేసీఆర్ ను ఆయన ఢీ కొట్టగలడా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…
High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…
Turmerick Milk : శా కాలం ప్రారంభమైందంటే ఇక వ్యాధులు కూడా ప్రారంభమైతాయి. కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా అంటూ…
AP : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, కేంద్రం తాజాగా జనగణనతో పాటు కులగణనకు గ్రీన్…
YS Jagan : పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసు రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. మాజీ…
Mother : సమాజంలో మానవీయత, తల్లిదండ్రుల పట్ల గౌరవం క్రమంగా తగ్గిపోతున్నాయన్న దానికి ఇదొక ఉదాహరణ. ఎంతో కష్టపడి, కన్న…
Samantha Sreeleela : అల్లు అర్జున్ నటించిన పుష్ప ఫ్రాంచైజీలో ఐటెం సాంగ్స్తో మెప్పించిన అందాల ముద్దుగుమ్మలు ఒకే ఫ్రేములో…
Manchu Manoj : మోహన్ బాబు నిర్మాణంలో మంచు విష్ణు Manchu Vishnu నటించిన సినిమా కన్నప్ప kannappa Movie…
This website uses cookies.