Kalvakuntla Kavitha : లిక్కర్ స్కామ్ కేసులో తాజాగా కలవకుంట్ల కవిత అరెస్టు అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థలు తీసుకువచ్చిన ఇలాంటి కేసులను రోజ్ వెన్యూ కోర్టులో విచారణ జరుపుతుంటారు. అయితే ఈ కోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు గురించి చాలా ఆసక్తికరమైన వాదనను వినిపించాయి. అయితే ఈ కేసు పై కవిత చాలా క్లారిటీగా ఇది మనీ లాండరింగ్ కి సంబంధించిన కేసు కాదు పొలిటికల్ లాండరింగ్ కు సంబంధించిన కేసు. ప్రతి పక్షాలు నామీద కక్ష సాధింపు చర్యలు తప్ప దీనిలో ఎలాంటి స్కామ్ లేదు అంటూ తెలియజేశారు. ఈ విధంగా కల్వకుంట్ల కవిత కోర్టులో తన తరఫున వాదనలు వినిపించారు. మరోపక్క ఈడి ఏమో లేదు కచ్చితంగా స్కామ్ జరిగింది మీకు సాక్షాలు కూడా సబ్ మిట్ చేశామంటూ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో బేయిల్ కావాలని కలవకుంట్ల కవిత తరపున లాయర్లు కోరడం జరిగింది.అయితే ఇక్కడ కవిత తరఫున లాయర్లు బెయిల్ కోరుతూ కవిత కొడుకుకు త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయని తన కొడుకును ఆమె చదివించుకోవాలని దానికి బేయిల్ ఇవ్వమని అడిగారు. అయితే ఈ వాదనలు అనేవి జడ్జికి చాలా కోపం తెప్పించాయని చెప్పాలి.
దీంతో కోర్టు కూడా ఇలాంటి సిల్లీ రీజన్స్ కు బెయిల్ రిజెక్ట్ చేయడం జరిగింది. దీంతో కవితను తీహార్ జైలుకు జ్యూడిషియల్ కష్టడి కు పంపించడం జరిగింది. అయితే తీహార్ జైల్ గురించి ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తుంది. అక్కడ ఎన్నో రకాల ఫెసిలిటీస్ కూడా ఉంటాయని వార్తలు ఉన్నాయి. అయితే ఆ జైలుకు కవితను పంపించడం జరిగింది. అయితే కోర్టులో జరిగిన వాదన గురించి కవిత బెయిల్ కు చెప్పిన రీజన్స్ గురించి చాలామంది ఇప్పుడు నవ్వుకుంటున్నారు. అయితే లిక్కర్స్ స్కామ్ కేసులో ఆమెను ఇరికించారా లేక నిజంగానే ఆమెకు సంబంధం ఉందా అనేది పక్కన పెడితే , ఈ కేసులో బీజేపీ కు సంబంధించిన నాయకులు కూడా ఉన్నప్పటికీ వారిని దీంట్లోకి లాగడం లేదని కవిత చాలా స్ట్రాంగ్ గా తెలియజేశారు. ఈ క్రమంలోనే బీజేపీ వాళ్లు ఎన్ని తప్పులు చేసినా వాషింగ్ పౌడర్ నిర్మా లాగా అయిపోతారు అంటూ తెలియజేస్తున్నారు. అయితే వాస్తవానికి కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా సరే ఆ పార్టీ నాయకులు ఎలాంటి తప్పులు చేసినా వాషింగ్ పౌడర్ నిర్మలాగా వెంటనే తెల్లగా అయిపోతారు. అంటే ఎలాంటి తప్పులు లేకుండా అయిపోతారు. ఇక ఇదే విషయాన్ని కవిత చాలా గట్టిగా చెప్పడం జరిగింది.
అయితే ఢిల్లీ ఎక్స్చేంజ్ పాలసీ గురించి ఒకసారి మనం మాట్లాడుతున్నట్లయితే…ఆ పాలసీ ప్రకారం ఢిల్లీ వ్యాప్తంగా మందులు ఎలా అమ్మాలో తీసేసి కొత్త పాలసీను తీసుకురావడం జరిగింది. ఇక ఈ కొత్త పాలసీ యొక్క లెక్క ప్రకారం లిక్కర్ లాటరీ ఎవరికి వచ్చిన దానిని వారు వేరే వారికి అమ్మవచ్చు. ఆ విధంగా కొత్త పాలసీని తీసుకువచ్చి దాని ద్వారా వేలకు వేలు గడిద్దామని ప్లాన్ చేశారు. దీనిలో భాగంగానే సౌత్ గ్రూప్ అని ఒక గ్రూప్ ఇన్వాల్వ్ అయి ఉంది. ఇక ఈ గ్రూపు అన్ని లిక్కర్ షాప్ లను తీసుకుని ఆ పని చేసి పెట్టినందుకు ఆ ప్రభుత్వ పార్టీకి మనీ ఇవ్వడం జరిగింది. ఇక ఆ డబ్బులు వారు పలు ఎన్నికల్లో వాడుకోవడం జరిగింది. అయితే ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న సౌత్ గ్రూప్ లో కలవకుంట్ల కవిత కూడా ఉన్నారు. ఈమె తో పాటు చాలామంది రాజకీయ నాయకులు ఈ కేసులో ఉన్నారు. అదే ఈ కేసులో చాలామంది దొరికినప్పటికీ వారందరూ కూడా కవిత పేరు చెప్పడం జరుగుతుందని తెలుస్తుంది. మరి ఈ కేసులో కవిత ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు అనేది కోర్టు చెప్పాల్సి ఉంది. మరి కవిత మాత్రం చాలా సందర్భాల్లో కడిగిన ముత్యం లాగా నేను బయటకు వస్తానంటూ చెప్పుకొస్తున్నారు. మరి లిక్కర్ స్కామ్ కేసు లో ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే.
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
Electric Tractor : రైతులకు శుభవార్త... వ్యవసాయంలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచే సరికొత్త ట్రాక్టర్ను మహారాష్ట్రకు చెందిన యువకుడు అభివృద్ధి…
This website uses cookies.