kavitha KCR : కేసీఆర్ ను కవిత కలవడం వెనుక రహస్యం ఏమైనా ఉందా..?
kavitha KCR : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంపై విచారణకు హాజరయ్యే ముందు కవిత తన భర్త అనిల్తో కలిసి ఎర్రవెల్లి ఫాం హౌస్లో కేసీఆర్ను కలిశారు. ఇప్పటికే ఈ విచారణ నేపథ్యంలో కవిత తన తండ్రికి మద్దతుగా ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనను ప్రత్యక్షంగా కలవడం, తండ్రి పరిణామాలపై చర్చించేందుకు ప్రయత్నించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
kavitha KCR : కేసీఆర్ ను కవిత కలవడం వెనుక రహస్యం ఏమైనా ఉందా..?
కవిత ఇటీవల రాసిన లేఖ, ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. తన అన్న కేటీఆర్పై పరోక్షంగా విమర్శలు చేయడం, పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులను తండ్రి వద్ద ఉన్నారని వ్యాఖ్యానించడం బీఆర్ఎస్ లో తీవ్ర సంక్షోభాన్ని కలిగించాయి. బీజేపీలో విలీనం అవుతారన్న ప్రచారాల మధ్య కవిత చేసిన ఆరోపణలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశాయి. అయితే, హరీష్ రావు స్పష్టత ఇవ్వడంతో, పార్టీ బీజేపీలో విలీనం కానుందన్న వార్తలకు బ్రేక్ పడింది. దీంతో కవిత స్వరాన్ని తగ్గించి, తండ్రిని కలుస్తానని ప్రకటించారు. ఇక ఈరోజు ఆమె కలువడం జరిగింది.
ఇటు కేసీఆర్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరుకానుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ విచారణకు కేసీఆర్తో పాటు కవిత కూడా బీఆర్కే భవన్కి వెళ్లనున్నట్లు సమాచారం. విచారణ సమయంలో తండ్రికి మద్దతుగా ఉండాలని కవిత నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు కేటీఆర్ పార్టీ ఆఫీసులో నుంచే పరిస్థితిని సమీక్షిస్తున్నారని సమాచారం.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.