Rythu Bandhu Scheme : రైతు బంధు పథకం పై కీలక మార్పులు .. వీరు మాత్రమే అర్హులు..?

Advertisement
Advertisement

Rythu Bandhu Scheme : తెలంగాణ కొత్త ప్రభుత్వం రైతుబంధు పథకంలో కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తుంది. దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. రైతు బంధు సాయానికి పరిమితులు విధించాలని నిర్ణయించింది. ఈ పథకం ఎవరికి వర్తింపచేయాలనే దానిపైన మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఐదు ఎకరాల లోపు ఉన్నవారు 90 శాతం మంది రైతులు ఉన్నారు. ఎకరం లోపు రైతులు 22.5 లక్షల మంది ఉన్నట్లు తేల్చారు. దీంతో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం రైతుబంధు పథకం పై పునఃసమీక్షిస్తుంది. ఈ యాసంగి సీజన్ వరకు గతంలో మాదిరిగానే ఎలాంటి పరిమితులు లేకుండా రైతు బంధు పంపిణీ చేసి వచ్చే వానాకాలం నుంచి 10 ఎకరాల పరిమితి తో రైతు భరోసా పేరిట నగదు పంపిణీ చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. పదికి మించి ఎన్ని ఎకరాలు ఉన్న పది ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం.

Advertisement

అంటే ఒక రైతుకు 15 ఎకరాలు ఉంటే పది ఎకరాలకే రైతు భరోసా వస్తుంది. మిగతా 5 ఎకరాలకు రాదు. అలాగే ఇప్పటిదాకా ఎకరానికి రూ. 5000 చొప్పున ఏడాదికి రూ. 10,000 పంపిణీ చేస్తుండగా వచ్చే సీజన్ నుంచి ఒక పంటకు ఎకరానికి రూ. 7500 చొప్పున ఏడాదికి రూ. 15,000 చొప్పున పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రైతు భరోసా పథకానికి పరిమితులు విధించిన లబ్ధిదారుల సంఖ్య ఏమాత్రం తగ్గదు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది పట్టాదారులు ఉండగా వీరందరికీ రైతు భరోసా అందుతుంది. రాష్ట్రంలో పది ఎకరాలనుంచి 54 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు 1.15 లక్షల మంది ఉన్నారు. వీరి పేరిట 12.5 లక్షల ఎకరాల భూమి ఉంది. అయితే పది ఎకరాల పరిమితి పెడితే 1.15 లక్షల మందికి 11.5 ఎకరాలకు పెట్టుబడి సాయం అందించాల్సి వస్తుంది. అయితే కట్ ఆఫ్ విధించడం ద్వారా కేవలం లక్ష ఎకరాలకు రైతు భరోసా ఆగిపోతుంది. ఎకరానికి రూ. 15000 చొప్పున ఏడాదికి 150 కోట్లు తగ్గుతుంది.

Advertisement

కానీ ఇప్పటివరకు ఉన్న పెట్టుబడి సాయాన్ని పదివేల నుంచి 15 వేలకు పెంచడంతో 50% ఆర్థిక భారం పెరుగుతుంది. లక్ష ఎకరాలకు మినహాయించి 1.49 కోట్ల ఎకరాలకు రైతు భరోసా పంపిణీ చేయాలంటే ఏడాదికి రూ. 22,350 కోట్లు అవుతుంది. ఇప్పటివరకు రైతుబంధు పథకానికి ఏడాదికి అవుతున్న ఖర్చు రూ. 15000 కోట్లు అంటే రూ. 7350 కోట్ల మీద ఆర్థిక భారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి వ్యవసాయ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇకపోతే రైతు బంధు పథకాన్ని 2018 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలుత ఎకరానికి రూ. 4000 చొప్పున ఎకరానికి 8వేలు ఇచ్చారు. రెండు సీజన్లు గడిచిన తర్వాత ఆ మొత్తాన్ని 5 వేలకు పెంచి ఏడాదికి ఎకరానికి రూ. 10,000 చొప్పున ఇచ్చారు. అయితే రైతు బంధు పంపిణీపై అప్పటి ప్రభుత్వం ఎలాంటి కటాఫ్ విధించలేదు. ఇప్పుడు రైతు భరోసా కింద దాన్ని పది ఎకరాలకు పరిమితం చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం.

Advertisement

Recent Posts

Nara Lokesh : బిగ్ బ్రేకింగ్ : నారా లోకేష్ పటాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ ..!

Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…

28 minutes ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్..మరో మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో భరోసా డబ్బు జమ !!

Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…

4 hours ago

AP Budget 2026-27 : ఏపీ బడ్జెట్ 2026-27 హైలైట్స్ ! ఏ శాఖకు ఎంత కేటాయించారంటే..!!

AP Budget 2026-27 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రూ. 3,32,205 కోట్ల…

5 hours ago

TG Municipal Elections : మున్సిపల్ ఎన్నికల్లో గల్వాన్ అమరుడు కల్నల్ సంతోష్ ఫ్యామిలీ కి షాక్ ఇచ్చిన ఓటర్లు

TG Municipal Elections : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సూర్యాపేటలో అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడమే కాకుండా,…

5 hours ago

TG Municipal Results : మున్సిపల్ ఎన్నికల్లో రూ.20 కోట్లు ఖర్చు చేసిన ఓడిన అభ్యర్థి..ఏ పార్టీ అభ్యర్దో తెలుసా ?

TG Municipal Results : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్ కార్పొరేషన్ వేదికగా జరిగిన ఒక ఖరీదైన ఓటమి…

6 hours ago

TG Municipal Elections : మున్సిపల్ ఎన్నికల్లో ఓటుకు రూ.70వేలు ఇచ్చాడు..మరి గెలిచాడా ?

TG Municipal Elections : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీలో చోటుచేసుకున్న ఒక ఆసక్తికరమైన…

7 hours ago

Samsung Galaxy J15 Prime 5G Review : శాంసంగ్ నుంచి అదిరిపోయే ఫోన్.. 108MP కెమెరా, 6000mAh బ్యాటరీతో గెలాక్సీ జే15 ప్రైమ్ 5G వచ్చేసింది

Samsung Galaxy J15 Prime 5G Review : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ Samsung, మరోసారి టెక్ మార్కెట్‌లో…

8 hours ago