Rythu Bandhu Scheme : తెలంగాణ కొత్త ప్రభుత్వం రైతుబంధు పథకంలో కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తుంది. దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. రైతు బంధు సాయానికి పరిమితులు విధించాలని నిర్ణయించింది. ఈ పథకం ఎవరికి వర్తింపచేయాలనే దానిపైన మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఐదు ఎకరాల లోపు ఉన్నవారు 90 శాతం మంది రైతులు ఉన్నారు. ఎకరం లోపు రైతులు 22.5 లక్షల మంది ఉన్నట్లు తేల్చారు. దీంతో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం రైతుబంధు పథకం పై పునఃసమీక్షిస్తుంది. ఈ యాసంగి సీజన్ వరకు గతంలో మాదిరిగానే ఎలాంటి పరిమితులు లేకుండా రైతు బంధు పంపిణీ చేసి వచ్చే వానాకాలం నుంచి 10 ఎకరాల పరిమితి తో రైతు భరోసా పేరిట నగదు పంపిణీ చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. పదికి మించి ఎన్ని ఎకరాలు ఉన్న పది ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం.
అంటే ఒక రైతుకు 15 ఎకరాలు ఉంటే పది ఎకరాలకే రైతు భరోసా వస్తుంది. మిగతా 5 ఎకరాలకు రాదు. అలాగే ఇప్పటిదాకా ఎకరానికి రూ. 5000 చొప్పున ఏడాదికి రూ. 10,000 పంపిణీ చేస్తుండగా వచ్చే సీజన్ నుంచి ఒక పంటకు ఎకరానికి రూ. 7500 చొప్పున ఏడాదికి రూ. 15,000 చొప్పున పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రైతు భరోసా పథకానికి పరిమితులు విధించిన లబ్ధిదారుల సంఖ్య ఏమాత్రం తగ్గదు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది పట్టాదారులు ఉండగా వీరందరికీ రైతు భరోసా అందుతుంది. రాష్ట్రంలో పది ఎకరాలనుంచి 54 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు 1.15 లక్షల మంది ఉన్నారు. వీరి పేరిట 12.5 లక్షల ఎకరాల భూమి ఉంది. అయితే పది ఎకరాల పరిమితి పెడితే 1.15 లక్షల మందికి 11.5 ఎకరాలకు పెట్టుబడి సాయం అందించాల్సి వస్తుంది. అయితే కట్ ఆఫ్ విధించడం ద్వారా కేవలం లక్ష ఎకరాలకు రైతు భరోసా ఆగిపోతుంది. ఎకరానికి రూ. 15000 చొప్పున ఏడాదికి 150 కోట్లు తగ్గుతుంది.
కానీ ఇప్పటివరకు ఉన్న పెట్టుబడి సాయాన్ని పదివేల నుంచి 15 వేలకు పెంచడంతో 50% ఆర్థిక భారం పెరుగుతుంది. లక్ష ఎకరాలకు మినహాయించి 1.49 కోట్ల ఎకరాలకు రైతు భరోసా పంపిణీ చేయాలంటే ఏడాదికి రూ. 22,350 కోట్లు అవుతుంది. ఇప్పటివరకు రైతుబంధు పథకానికి ఏడాదికి అవుతున్న ఖర్చు రూ. 15000 కోట్లు అంటే రూ. 7350 కోట్ల మీద ఆర్థిక భారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి వ్యవసాయ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇకపోతే రైతు బంధు పథకాన్ని 2018 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలుత ఎకరానికి రూ. 4000 చొప్పున ఎకరానికి 8వేలు ఇచ్చారు. రెండు సీజన్లు గడిచిన తర్వాత ఆ మొత్తాన్ని 5 వేలకు పెంచి ఏడాదికి ఎకరానికి రూ. 10,000 చొప్పున ఇచ్చారు. అయితే రైతు బంధు పంపిణీపై అప్పటి ప్రభుత్వం ఎలాంటి కటాఫ్ విధించలేదు. ఇప్పుడు రైతు భరోసా కింద దాన్ని పది ఎకరాలకు పరిమితం చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.