
Rythu Bandhu Scheme : రైతు బంధు పథకం పై కీలక మార్పులు .. వీరు మాత్రమే అర్హులు..?
Rythu Bandhu Scheme : తెలంగాణ కొత్త ప్రభుత్వం రైతుబంధు పథకంలో కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తుంది. దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. రైతు బంధు సాయానికి పరిమితులు విధించాలని నిర్ణయించింది. ఈ పథకం ఎవరికి వర్తింపచేయాలనే దానిపైన మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఐదు ఎకరాల లోపు ఉన్నవారు 90 శాతం మంది రైతులు ఉన్నారు. ఎకరం లోపు రైతులు 22.5 లక్షల మంది ఉన్నట్లు తేల్చారు. దీంతో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం రైతుబంధు పథకం పై పునఃసమీక్షిస్తుంది. ఈ యాసంగి సీజన్ వరకు గతంలో మాదిరిగానే ఎలాంటి పరిమితులు లేకుండా రైతు బంధు పంపిణీ చేసి వచ్చే వానాకాలం నుంచి 10 ఎకరాల పరిమితి తో రైతు భరోసా పేరిట నగదు పంపిణీ చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. పదికి మించి ఎన్ని ఎకరాలు ఉన్న పది ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం.
అంటే ఒక రైతుకు 15 ఎకరాలు ఉంటే పది ఎకరాలకే రైతు భరోసా వస్తుంది. మిగతా 5 ఎకరాలకు రాదు. అలాగే ఇప్పటిదాకా ఎకరానికి రూ. 5000 చొప్పున ఏడాదికి రూ. 10,000 పంపిణీ చేస్తుండగా వచ్చే సీజన్ నుంచి ఒక పంటకు ఎకరానికి రూ. 7500 చొప్పున ఏడాదికి రూ. 15,000 చొప్పున పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రైతు భరోసా పథకానికి పరిమితులు విధించిన లబ్ధిదారుల సంఖ్య ఏమాత్రం తగ్గదు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది పట్టాదారులు ఉండగా వీరందరికీ రైతు భరోసా అందుతుంది. రాష్ట్రంలో పది ఎకరాలనుంచి 54 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు 1.15 లక్షల మంది ఉన్నారు. వీరి పేరిట 12.5 లక్షల ఎకరాల భూమి ఉంది. అయితే పది ఎకరాల పరిమితి పెడితే 1.15 లక్షల మందికి 11.5 ఎకరాలకు పెట్టుబడి సాయం అందించాల్సి వస్తుంది. అయితే కట్ ఆఫ్ విధించడం ద్వారా కేవలం లక్ష ఎకరాలకు రైతు భరోసా ఆగిపోతుంది. ఎకరానికి రూ. 15000 చొప్పున ఏడాదికి 150 కోట్లు తగ్గుతుంది.
కానీ ఇప్పటివరకు ఉన్న పెట్టుబడి సాయాన్ని పదివేల నుంచి 15 వేలకు పెంచడంతో 50% ఆర్థిక భారం పెరుగుతుంది. లక్ష ఎకరాలకు మినహాయించి 1.49 కోట్ల ఎకరాలకు రైతు భరోసా పంపిణీ చేయాలంటే ఏడాదికి రూ. 22,350 కోట్లు అవుతుంది. ఇప్పటివరకు రైతుబంధు పథకానికి ఏడాదికి అవుతున్న ఖర్చు రూ. 15000 కోట్లు అంటే రూ. 7350 కోట్ల మీద ఆర్థిక భారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి వ్యవసాయ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇకపోతే రైతు బంధు పథకాన్ని 2018 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలుత ఎకరానికి రూ. 4000 చొప్పున ఎకరానికి 8వేలు ఇచ్చారు. రెండు సీజన్లు గడిచిన తర్వాత ఆ మొత్తాన్ని 5 వేలకు పెంచి ఏడాదికి ఎకరానికి రూ. 10,000 చొప్పున ఇచ్చారు. అయితే రైతు బంధు పంపిణీపై అప్పటి ప్రభుత్వం ఎలాంటి కటాఫ్ విధించలేదు. ఇప్పుడు రైతు భరోసా కింద దాన్ని పది ఎకరాలకు పరిమితం చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.