Categories: NewsTelangana

Rythu Bharosa : తెలంగాణ రైతులకు శుభవార్త .. ‘రైతు భరోసా’డబ్బులకు లైన్‌క్లియర్ మీ ఖాతాల్లో పడేది ఆరోజే.. !

Advertisement
Published by
Advertisement

Rythu Bharosa : తెలంగాణ Telangana Farmars  రైతులకు ఊరటనిచ్చే కీలక పరిణామం చోటుచేసుకుంది. యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు ప్రారంభించింది. రైతుల ఖాతాల్లో త్వరలోనే నిధులు జమయ్యేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి భారీ మొత్తంలో రుణం సమీకరించేందుకు ముందడుగు వేసింది.

Advertisement

Rythu Bharosa : తెలంగాణ రైతులకు శుభవార్త .. ‘రైతు భరోసా’డబ్బులకు లైన్‌క్లియర్ మీ ఖాతాల్లో పడేది ఆరోజే.. !

Rythu Bharosa: బహిరంగ మార్కెట్ నుంచి రూ.9,000 కోట్ల రుణం

యాసంగి సీజన్ రైతు భరోసా పంపిణీకి అవసరమైన నిధుల కోసం తెలంగాణ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు రూ.9,000 కోట్ల రుణం కోసం ఇండెంట్ సమర్పించింది. ఈ రుణాన్ని వివిధ కాల పరిమితుల్లో సమీకరించనుంది. 13 ఏళ్ల కాలపరిమితితో రూ.2,000 కోట్లు, 16 ఏళ్ల గడువుతో మరో రూ.2,000 కోట్లు, 21 ఏళ్ల కాలపరిమితితో రూ.2,500 కోట్లు, 27 ఏళ్ల కాలానికి మరో రూ.2,500 కోట్లు సేకరించనున్నారు. ఈ విధంగా మొత్తం రూ.9,000 కోట్ల రుణాన్ని దశలవారీగా పొందేందుకు ప్రణాళిక రూపొందించారు. ఫిబ్రవరి 10న ఆర్బీఐ ఈ-వేలం నిర్వహించనుంది. ఈ వేలం ద్వారా రాష్ట్ర ఖజానాకు నిధులు చేరే అవకాశం ఉంది. రుణం మంజూరైన వెంటనే రైతు భరోసా నిధుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమాచారం. బహిరంగ మార్కెట్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో రుణం సేకరించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

Advertisement

Rythu Bharosa: రైతుల ఖాతాల్లోకి నేరుగా జమకు సన్నాహాలు

రుణం ద్వారా సమీకరించిన నిధులను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. యాసంగి సీజన్‌కు సంబంధించిన అర్హులైన రైతుల జాబితాను ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. రైతు భరోసా పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందించడం ద్వారా పంటల సాగుకు ఊతమివ్వడం ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. విత్తనాలు, ఎరువులు, కార్మిక ఖర్చులు వంటి వ్యవసాయ అవసరాల కోసం ఈ నిధులు ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు. యాసంగి సీజన్‌లో రైతులు ఎదుర్కొనే ఆర్థిక భారం తగ్గించడంలో ఈ సాయం కీలక పాత్ర పోషించనుంది.

Rythu Bharosa : మున్సిపల్ ఎన్నికల తర్వాత నిధుల జమ: సీఎం స్పష్టం

రైతు భరోసా నిధుల విడుదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల స్పష్టత ఇచ్చారు. మిర్యాలగూడలో జరిగిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మున్సిపల్ ఎన్నికలు పూర్తైన వెంటనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రకటించారు. పార్టీలకు అతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. పంట రుణాల మాఫీ కింద ఇప్పటికే రూ.21 వేల కోట్లను రైతులకు అందించామని వెల్లడించారు. అదనంగా పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇక, రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుండటంతో తెలంగాణ రైతుల్లో ఆశావాదం నెలకొంది. ఆర్బీఐ ఈ-వేలం అనంతరం నిధుల విడుదలకు మార్గం సుగమం కానుంది. దీంతో యాసంగి సీజన్‌లో రైతులకు తగిన ఆర్థిక మద్దతు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement
Suma Ch

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Recent Posts

Bottle Gourd Juice : సొరకాయ జ్యూస్‌తో నిజంగానే పొట్ట కొవ్వు తగ్గుతుందా..? నిపుణులు చెప్పిన నిజాలు ఇవే!

Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…

1 day ago

Petrol : భారత్‌లో అత్యధికంగా పెట్రోల్ వాడేది ఏ రాష్ట్రం..? షాకింగ్ గణాంకాలు వైరల్!

Petrol  : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…

3 days ago

PM Modi : ఖర్చు ఆపమని కాదు.. తెలివిగా ఖర్చు చేయమన్న మోదీ.. కేంద్రం క్లారిటీ!

PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…

3 days ago

Farmers Good News : రైతులకు గుడ్ న్యూస్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. !

Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…

3 days ago

Donald Trump : చైనాలో ట్రంప్ కి అవ‌మానం.. ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చ!

Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…

3 days ago

Heart Health : హార్ట్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఇవి చేయండి.. గుండె ఆరోగ్యానికి సింపుల్ ఫిట్‌నెస్ టిప్స్!

Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…

3 days ago

Working Hours : ఎక్కువసేపు కూర్చునే పని చేస్తున్నారా..? అయితే మీరు డేంజ‌ర్‌లో ప‌డ్డ‌ట్టే..?

Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…

3 days ago

AP Rajya Sabha : ఏపీ రాజ్యసభ రేసులో కొత్త ట్విస్ట్.. టీడీపీ-జనసేన అభ్యర్థులపై కీలక నిర్ణయం!

AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…

3 days ago

Anushka Shetty : ఫస్ట్ లవ్‌పై మనసు విప్పిన అనుష్క.. అత‌ని గురించి చెప్పిన మాటలు వైరల్

Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…

3 days ago

Vijay and Trisha Marriage : ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్.. విజయ్-త్రిష పెళ్లి గాసిప్స్‌కు ఫుల్ స్టాప్ పడిందా..?

Vijay and Trisha Marriage  : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…

4 days ago

Hair : జుట్టు పెరగడం లేదా..? రోజూ ఈ జ్యూసులు తాగితే అద్భుత ఫలితాలు!

Hair  : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…

4 days ago

Rice Water : హెయిర్ గ్రోత్‌కు బియ్యం నీటితో అద్భుత ప్రయోజనాలు.. మీరు ట్రై చేండి..!

Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…

4 days ago