Rythu Bharosa : తెలంగాణ రైతులకు శుభవార్త .. ‘రైతు భరోసా’డబ్బులకు లైన్క్లియర్ మీ ఖాతాల్లో పడేది ఆరోజే.. !
ప్రధానాంశాలు:
Rythu Bharosa : తెలంగాణ రైతులకు శుభవార్త .. ‘రైతు భరోసా’డబ్బులకు లైన్క్లియర్ మీ ఖాతాల్లో పడేది ఆరోజే.. !
Rythu Bharosa : తెలంగాణ Telangana Farmars రైతులకు ఊరటనిచ్చే కీలక పరిణామం చోటుచేసుకుంది. యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు ప్రారంభించింది. రైతుల ఖాతాల్లో త్వరలోనే నిధులు జమయ్యేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి భారీ మొత్తంలో రుణం సమీకరించేందుకు ముందడుగు వేసింది.
Rythu Bharosa : తెలంగాణ రైతులకు శుభవార్త .. ‘రైతు భరోసా’డబ్బులకు లైన్క్లియర్ మీ ఖాతాల్లో పడేది ఆరోజే.. !
Rythu Bharosa: బహిరంగ మార్కెట్ నుంచి రూ.9,000 కోట్ల రుణం
యాసంగి సీజన్ రైతు భరోసా పంపిణీకి అవసరమైన నిధుల కోసం తెలంగాణ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు రూ.9,000 కోట్ల రుణం కోసం ఇండెంట్ సమర్పించింది. ఈ రుణాన్ని వివిధ కాల పరిమితుల్లో సమీకరించనుంది. 13 ఏళ్ల కాలపరిమితితో రూ.2,000 కోట్లు, 16 ఏళ్ల గడువుతో మరో రూ.2,000 కోట్లు, 21 ఏళ్ల కాలపరిమితితో రూ.2,500 కోట్లు, 27 ఏళ్ల కాలానికి మరో రూ.2,500 కోట్లు సేకరించనున్నారు. ఈ విధంగా మొత్తం రూ.9,000 కోట్ల రుణాన్ని దశలవారీగా పొందేందుకు ప్రణాళిక రూపొందించారు. ఫిబ్రవరి 10న ఆర్బీఐ ఈ-వేలం నిర్వహించనుంది. ఈ వేలం ద్వారా రాష్ట్ర ఖజానాకు నిధులు చేరే అవకాశం ఉంది. రుణం మంజూరైన వెంటనే రైతు భరోసా నిధుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమాచారం. బహిరంగ మార్కెట్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో రుణం సేకరించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
Rythu Bharosa: రైతుల ఖాతాల్లోకి నేరుగా జమకు సన్నాహాలు
రుణం ద్వారా సమీకరించిన నిధులను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. యాసంగి సీజన్కు సంబంధించిన అర్హులైన రైతుల జాబితాను ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. రైతు భరోసా పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందించడం ద్వారా పంటల సాగుకు ఊతమివ్వడం ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. విత్తనాలు, ఎరువులు, కార్మిక ఖర్చులు వంటి వ్యవసాయ అవసరాల కోసం ఈ నిధులు ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు. యాసంగి సీజన్లో రైతులు ఎదుర్కొనే ఆర్థిక భారం తగ్గించడంలో ఈ సాయం కీలక పాత్ర పోషించనుంది.
Rythu Bharosa : మున్సిపల్ ఎన్నికల తర్వాత నిధుల జమ: సీఎం స్పష్టం
రైతు భరోసా నిధుల విడుదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల స్పష్టత ఇచ్చారు. మిర్యాలగూడలో జరిగిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మున్సిపల్ ఎన్నికలు పూర్తైన వెంటనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రకటించారు. పార్టీలకు అతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. పంట రుణాల మాఫీ కింద ఇప్పటికే రూ.21 వేల కోట్లను రైతులకు అందించామని వెల్లడించారు. అదనంగా పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు సన్న వడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇక, రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుండటంతో తెలంగాణ రైతుల్లో ఆశావాదం నెలకొంది. ఆర్బీఐ ఈ-వేలం అనంతరం నిధుల విడుదలకు మార్గం సుగమం కానుంది. దీంతో యాసంగి సీజన్లో రైతులకు తగిన ఆర్థిక మద్దతు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి.