Komatireddy Raj Gopal Reddy : అవును రైతుబంధు అందరికి రాలేదు అని ఒప్పుకున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
Komatireddy Raj Gopal Reddy :మునుగోడు నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజల పట్ల తనకున్న నిబద్ధతను మరోసారి స్పష్టంగా వ్యక్తం చేస్తూ, మంత్రి పదవికంటే ప్రజలే తనకు ముఖ్యమని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం ఎల్బీనగర్ నుంచి పోటీ చేయమన్నా, మంత్రి పదవి హామీ ఇచ్చినా, తాను మునుగోడునే వదలలేదని చెప్పారు. నల్గొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే ఉన్నారని పేర్కొన్నారు.
Komatireddy Raj Gopal Reddy : అవును రైతుబంధు అందరికి రాలేదు అని ఒప్పుకున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
రైతుబంధు పథకం విషయంలో కూడా ఆయన నిర్మొహమాటంగా మాట్లాడారు. “రైతుబంధు అందరికి రాలేదు, కొందరికే వచ్చింది. ఇది నిజం.. నేను ఒప్పుకుంటాను” అంటూ ప్రభుత్వ విధానాలపై స్పష్టమైన విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన “2034 వరకు నేనే సీఎంగా ఉంటా” అన్న వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ నియమాలను అతిక్రమించే ప్రకటనలతో పార్టీ పేరు మసకబారుతుందని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినందున అధిష్టానం నిర్ణయమే కీలకం అన్నారు.
గతంలో బీజేపీలో చేరిన తర్వాత, ఆశించిన ప్రాధాన్యత లేకపోవడంతో తిరిగి కాంగ్రెస్లోకి వచ్చిన కోమటిరెడ్డి, మునుగోడు ఉప ఎన్నికలో కూడా నైతిక విజయం తనదేనని పేర్కొన్నారు. 2018లో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఏకైక అభ్యర్థిగా తనను గుర్తు చేశారు. భవిష్యత్తులో ఎప్పుడైనా మునుగోడు నుంచే పోటీ చేస్తానంటూ స్పష్టం చేశారు. మునుగోడులో ప్రతి ఒక్కరికి ఇళ్లు నిర్మిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇలా మంత్రి పదవుల కన్నా ప్రజల సంక్షేమమే తనకు ప్రాధాన్యత అని మరోసారి చాటిచెప్పారు.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.