
#image_title
Telangana Revenue Department : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థను సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమైన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీవో, ప్రతి మండలానికి భూ విస్తీర్ణాన్ని బట్టి నాలుగు నుంచి ఆరు లైసెన్స్డ్ సర్వేయర్లు నియమించనున్నారు. భూ సమస్యలపై గ్రామస్థులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. లైసెన్స్డ్ సర్వేయర్ల కోసం ఇప్పటికే 10 వేల మంది దరఖాస్తు చేసుకోగా, మొదటి విడతలో 7 వేల మందికి శిక్షణ పూర్తిచేసి తుది పరీక్షలు, ల్యాబ్ ప్రాక్టికల్స్ నిర్వహించి ఫలితాలను ఆగస్టు 12న ప్రకటించనున్నారు.
రాష్ట్రంలోని భూభారతి చట్టం ప్రకారం భూ రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి కావడంతో సర్వేయర్ల అవసరం పెరిగింది. అదే దృష్టిలో ఉంచుకుని, 50 రోజుల శిక్షణ అనంతరం అప్రెంటిస్ శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే, రెవెన్యూ గ్రామాల్లో సేవలందించేందుకు వీఆర్వో, వీఆర్ఏల ఎంపిక ప్రక్రియలో 3554 మంది ఎంపికయ్యారని మంత్రి తెలిపారు. వీరిలో మరికొందరికి అవకాశం కల్పించేందుకు జూలై 27న మరోసారి అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ఇది ప్రజలకు నేరుగా సేవలు అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగం.
Telangana Revenue Department : తెలంగాణ రెవెన్యూశాఖలో భారీ సంస్కరణలు
ఇక నక్షా లేని గ్రామాల సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మొత్తం 413 గ్రామాల్లో నక్షాల సమస్య ఉన్నప్పటికీ, మొదటి దశలో మహబూబ్నగర్, జగిత్యాల, ఖమ్మం, ములుగు, సంగారెడ్డి జిల్లాల్లో ఐదు గ్రామాల్లో రీ-సర్వే విజయవంతంగా పూర్తయింది. రైతుల సమక్షంలో భూముల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని, భూ వివాదాలు తేలిపోతాయని మంత్రి అన్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలను పరిశీలించి మిగతా గ్రామాల్లోనూ ఈ రీ-సర్వే పద్ధతిని అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Revanth Reddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.…
Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం మరింత చర్చనీయాంశంగా మారింది.…
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
Delhi liquor case : దేశ రాజకీయాల్లో కలకలం రేపిన లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమ్…
Medchal : శతమానం భవతి అని కుటుంబ సభ్యులు ఆశీర్వదిస్తూ నిండునూరేళ్లు పూర్తి చేసుకున్న వృద్ధుడికి ఘనంగా శతాబ్ది వేడుకలు…
This website uses cookies.