
Swachha Ratham : ఏపీ ప్రజలకు గుడ్న్యూస్.. స్వచ్ఛ రథాలు వచ్చేసాయోచ్.. అసలు వీటివల్ల ఉపయోగాలు ఏంటి..?
Swachha Ratham : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ పరిశుభ్రతను పెంపొందించేందుకు కొత్త ప్రయోగంగా ‘స్వచ్ఛ రథం’ అనే పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజల మౌలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ కాన్సెప్ట్కు మంచి స్పందన లభిస్తోంది. గుంటూరు జిల్లాలోని లాల్పురం గ్రామంలో ఈ రథాన్ని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు జూలై 10న ప్రారంభించారు. గ్రామాల్లో చెత్తను సేకరించి, వాటిని రీసైకిల్ చేయడం ద్వారా పరిశుభ్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది.
ఈ స్వచ్ఛ రథంలో తడి చెత్త (ఆర్గానిక్), పొడి చెత్త (రీసైక్లబుల్) వేరు వేరుగా సేకరిస్తారు. తడి చెత్తను ప్రతి రోజూ, పొడి చెత్తను వారంలో రెండు సార్లు సేకరించడానికి వాహనాలు వస్తాయి. గ్రామస్తులు తమ ఇంట్లో ఉండే చెత్తను వేరు చేసి ఈ వాహనాలకు అందిస్తారు. అందుకు బదులుగా కిరాణా సరుకులు తీసుకునే అవకాశం ఉంటుంది. చెత్తకు కూడా విలువ కల్పిస్తూ, ఉపయోగపడే పదార్థాలపై ధరను నిర్ణయించి ప్రజలకు నష్టంలేకుండా మేలుచేస్తున్నారు. చెత్తతో వ్యాపారం అనే కాన్సెప్ట్ గ్రామస్తులకు నచ్చుతోందన్న మాట.
Swachha Ratham : ఏపీ ప్రజలకు గుడ్న్యూస్.. స్వచ్ఛ రథాలు వచ్చేసాయోచ్.. అసలు వీటివల్ల ఉపయోగాలు ఏంటి..?
సేకరించిన తడి చెత్తను కంపోస్టింగ్ చేసి జైవ ఎరువుగా, పొడి చెత్తను రీసైక్లింగ్ కంపెనీలకు పంపించి పునఃప్రాసెసింగ్ చేస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి హాని లేకుండా, చెత్తను సంపదగా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఇది స్వచ్ఛ భారత్ మిషన్ భాగంగా పనిచేస్తోంది. గ్రామీణ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెరుగుతుంది. ఒకప్పటి వైసీపీ హయాంలో ఉన్న ఖాళీ రేషన్ బండ్లను ఈ స్వచ్ఛ రథాలుగా మార్చే అవకాశం ఉందన్న ప్రచారం కూడా ఉంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం గ్రామీణ అభివృద్ధికి దోహదపడుతుండగా, సీఎం చంద్రబాబు అభిప్రాయాలను ప్రతిబింబిస్తోంది.
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
Delhi liquor case : దేశ రాజకీయాల్లో కలకలం రేపిన లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమ్…
Medchal : శతమానం భవతి అని కుటుంబ సభ్యులు ఆశీర్వదిస్తూ నిండునూరేళ్లు పూర్తి చేసుకున్న వృద్ధుడికి ఘనంగా శతాబ్ది వేడుకలు…
MODI Geo politics : ప్రస్తుతం అరబ్ దేశాల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, యునైటెడ్…
Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసేందుకు సిద్ధమైంది. రాబోయే 2026-27…
This website uses cookies.