Pensions And Ration Cards : ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ సమరం నడుస్తోంది. అన్ని పార్టీలు నువ్వా నేనా అన్నట్టు ప్రచారాలు చేస్తున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ ఎస్, బీజేపీ మీద విమర్శల వర్షం కురిపిస్తోంది. ఇటు వైపు బీజేపీ కూడా కేంద్రంలో మోడీ రావాలంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తోంది. బీఆర్ ఎస్ కూడా ఆ రెండు పార్టీలకు తగ్గట్టే ప్రచారం నిర్వహిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఇంకా అమలు చేయలేదని.. కాబట్టి ఆ పార్టీకి ఓటేయొద్దంటూ కోరుతోంది. ఇంకోవైపు బీజేపీ కేంద్రంలో చేసింది ఏమీ లేదు కాబట్టి ఆ పార్టీకి ఓటేయొద్దంటూ కోరుతోంది.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ మీద ఎక్కువగా ఆరు గ్యారెంటీలు ఎక్కడ అంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. దాంతో ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా ఆరు గ్యారెంటీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన గురువారం హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న బీఆర్ ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడ్డారు. కేవలం రూ.2వేల పింఛన్ మాత్రమే ఇచ్చిందని.. కానీ తమ ప్రభుత్వం మాత్రం కచ్చితంగా రూ4వేలు ఇస్తుందని తెలిపారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే వాటిని అమలుచేస్తామన్నారు. అంతే కాకుండా రేషన్ కార్డులపై కూడా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం పదేండ్లలో ఏ ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని.. ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. కానీ తమ ప్రభుత్వ హయాంలో మాత్రం కచ్చితంగా త్వరలోనే కొత్త రేషన్ కార్డు ఇస్తామని తెలిపారు.
ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి.. కోడ్ అయిపోయిన వెంటనే కొత్త రేషన్ కార్డులపై ప్రకటన విడుదల చేస్తామన్నారు. అంతే కాకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభిస్తామన్నారు. దాంతో పాటు మిగిలిన గ్యారెంటీలను కూడా అమలు చేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. అయితే పొన్నం ప్రభాకర్ ఇప్పుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రితో పాటు రవాణా శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన కు పౌరసరఫరాల శాఖతో కూడా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఆయనకు పూర్తి సమాచారం ఉంటేనే ఇలాంటి కామెంట్లు చేస్తారని అంటున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.