Categories: NewsTelangana

Revanth Reddy : దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్

Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ఓరుగల్లును రాణి రుద్రమదేవి, సమ్మక్క-సారలమ్మల వంటి వీర మహిళలు పాలించిన గడ్డగా పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి వరంగల్ జిల్లా పురిటిగడ్డగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, మామునూరు ఎయిర్పోర్టు పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. మొత్తం రూ.800 కోట్లతో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులను చేపట్టామని, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులను వెచ్చించడానికి వెనుకాడదని స్పష్టం చేశారు.

Revanth Reddy : దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్

Revanth Reddy బిఆర్ఎస్ అప్పులు చేసినప్పటికీ మీము సంక్షేమ పథకాలు అందిస్తున్నాం – రేవంత్

అలాగే గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఉచిత విద్యుత్ , మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ తమ ప్రభుత్వం అందజేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. తెలంగాణ కోసం పోరాడిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు, తగిన నియామక ప్రక్రియలు చేపట్టామని, ఏడాదిలోనే 55 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించినట్లు వివరించారు. గత ప్రభుత్వ దివాళా తీయించిన ఆర్థిక పరిస్థితిని తాము మెరుగుపరుస్తున్నామని, అయినప్పటికీ ప్రజా సంక్షేమ పథకాలను నిలిపివేయడం లేదని స్పష్టం చేశారు.

వరంగల్ అభివృద్ధికి కడియం శ్రీహరి, కడియం కావ్యల కృషిని కొనియాడిన సీఎం, ప్రజలు కావ్యను ఎంపీగా గెలిపిస్తే కేంద్రంతో పోరాడి వరంగల్ ఎయిర్‌పోర్టును, కాజీపేట రైల్వే డివిజన్‌ను సాధించగలమని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా వైఫల్యమైందని, లక్షల కోట్ల రూపాయలు వెచ్చించినప్పటికీ మూడేళ్లే నిలవలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై తాము సవాల్ విసురుతున్నామని, దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలని రేవంత్ రెడ్డి సవాలు చేశారు. రాష్ట్ర ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని, ప్రజాసంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.

Recent Posts

SAI KORRAPATI : అమృతేశ్వరునికి పురాణపండ ‘సహస్ర’ సౌందర్యాన్ని సమర్పించిన కొర్రపాటి

SAI KORRAPATI  : బళ్లారి, జూన్ 24 : శరణుజొచ్చినవారిని అభయమిచ్చి కాపాడే బళ్లారి అమృతేశ్వరాలయంలో గత మహాశివరాత్రి పర్వదినం…

51 seconds ago

Energy Drinks : పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ ఇస్తున్నారా…నిపుణులు ఏమంటున్నారు తెలుసా…?

Energy Drinks : కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఇలాంటి డ్రింక్స్ ని అలవాటు చేస్తున్నారు. పిల్లలు అలసిపోయి వస్తే వారికి…

36 minutes ago

YSRCP TDP : వైసీపీ లో చేరబోతున్న టీడీపీ కీలక నేత..?

YSRCP TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న…

2 hours ago

Reheat Food : మిగిలిపోయిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తింటున్నారా… ఇలా చేస్తే ఇదే జరుగుతుంది…?

Reheat Food : సాధారణంగా చాలామంది చేసే పొరపాటు వండిన ఆహారాన్ని మరలా వేడి చేస్తూ ఉండడం. ఇలా చేస్తే…

3 hours ago

Telangana : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడబోతుందా..?

Telangana  : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఊహించని రాజకీయ సంక్షోభం పొంచి ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.…

4 hours ago

LIC Recruitment 2025 : గ్రాడ్యుయేట్ల‌కు శుభ‌వార్త‌.. ఎల్ఐసీలో ఉద్యోగావకాశాలు

LIC Recruitment 2025 : ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 250 మంది అప్రెంటిస్‌ల నియామకాన్ని ప్రకటించింది. ఈ మొత్తం ఖాళీల్లో…

5 hours ago

Curry Leaves : ఈ ఆకులని జ్యూస్ గా చేసి తాగారంటే… రేచీకటితో పాటు.. ఎన్నో వ్యాధులు పరార్…?

Curry Leaves : ఈ ఆకులని ప్రతి ఒక్కరు కూడా వంటల్లో వినియోగిస్తుంటారు. ఇది లేనిదే వంట కూడా చేయరు.…

6 hours ago

Male Ear Piercing : జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందంటే…. పురుషులు చెవులు కుట్టించుకుంటే… కలిగే లాభాలు, మీకు తెలుసా…?

Male Ear piercing : మన నాగరికతలో చెవులు కుట్టించే కార్యక్రమాన్ని ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. ఉదాహరణకు భారతదేశంలో…

7 hours ago