revanth reddy orders on transco department
Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి రెండు రోజులు కూడా కాలేదు కానీ.. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఏదో గెలిచాం.. అయిపోయింది అనేట్టుగా కాదు.. పక్కాగా పాలన సాగిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే వెంటనే అభయ హస్తం ఫైల్ పై సంతకం పెట్టారు. ఆ తర్వాత దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం ఇచ్చారు. తెల్లారి వెంటనే ట్రాన్స్ కో, జెన్ కో అధికారులతో సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి. అయితే.. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ట్రాన్స్ కో ఎండీ ప్రభాకర్ రావు తన పోస్ట్ కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను ఆమోదించకున్నా, సీఎం మీటింగ్ కు ప్రభాకర్ రావు హాజరు కాలేదు. అయితే.. తెలంగాణలో 24 గంటల కరెంట్ పేరుతో 84 వేల కోట్ల స్కామ్ జరిగిందని తెలుస్తోంది. అందుకే ప్రభాకర్ రావు ముందే సర్దేసుకున్నారు అనే వార్తలూ వినిపిస్తున్నాయి.
నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే చాలా రోజుల నుంచి విద్యుత్ విషయంలో పెద్ద స్కామ్ జరుగుతోందని కాంగ్రెస్ నేతలు, రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. తాము అధికారంలోకి రాగానే వెంటననే విద్యుత్ స్కామ్ పై వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. అన్నీ బయటికి తీస్తామన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి కేబినేట్ మీటింగ్ పెట్టిన రోజే విద్యుత్ సంస్కరణలు చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. సీఎండీ రాజీనామా చేయడంతో రేవంత్ కు ఇంకా డౌట్ పెరిగింది. ఎక్కువ శాతం డబ్బును గత ప్రభుత్వం సొంత అవసరాలను వాడుకున్నట్టు తెలుస్తోంది. 84 వేల కోట్ల అప్పుల్లోకి విద్యుత్ సంస్థను తీసుకెళ్లి.. ఆ డబ్బును అప్పటి ప్రభుత్వ పెద్దలు ఏం చేశారు అనేది తెలియడం లేదు. నిజంగా 24 గంటల కరెంట్ కోసమే అన్ని వేల కోట్లు అప్పు చేశారా అనే దానిపై ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోకస్ చేస్తున్నారు. నిజానికి కేసీఆర్ సర్కారు అప్పుడే తప్పు చేసిందని చెప్పారు. దానికి బలం చేకూర్చుతూ సీఎండీ రాజీనామా చేయడంతో ఆ ఆరోపణ ఇప్పుడు నిజం అయినట్టుగానే చూడాలి.
అందుకే.. రేవంత్ రెడ్డి విద్యుత్ సంస్థ కుంభకోణంపై ఒక కమిటీ వేసి ఈ స్కామ్ లో విద్యుత్ అధికారులు, ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు ఎవరు ఉన్నా వాళ్లందరినీ బయటికి లాగుతామని రేవంత్ రెడ్డి చాలెంజ్ విసిరారు. మరి.. విద్యుత్ కుంభకోణాన్ని రేవంత్ రెడ్డి ఏవిధంగా బయటికి లాగుతారో వేచి చూడాల్సిందే.
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
This website uses cookies.