Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఇంకా పడలేదా ? అయితే ఇలా చేయండి..?
Rythu Bharosa : తెలంగాణ సర్కార్ Telangana Govt రైతు భరోసా Rythu Bharosa పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. జనవరి 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Revanth reddy ఈ పథకాన్ని ప్రారంభించారు. రైతులకు farmers పంట పెట్టుబడి సహాయం కోసం ఎకరానికి 12,000 రూపాయలను రెండు విడతలుగా అందజేయనున్నారు. తొలి విడుత రూ.6 వేలను ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేస్తుంది. 26వ తేదీన ప్రారంభమైన రైతు భరోసా పథకం రాష్ట్రంలోని మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి నిధులు విడుదల చేశారు. ప్రభుత్వం 4.42 లక్షల మంది రైతులకు 593 కోట్ల రూపాయలను విడుదల చేసింది.
Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఇంకా పడలేదా ? అయితే ఇలా చేయండి..?
వారికి 27వ తేదీన రైతుల ఖాతాలలో నిధులు జమయ్యాయి. తిరిగి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఫిబ్రవరి 5వ తేదీ నుంచి పంట పెట్టుబడి సహాయం రైతుల ఖాతాలలో జమ అవుతుంది. 17.03 లక్షల మంది రైతులకు 533 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఫిబ్రవరి 5వ తేదీన నుంచి రైతులకు పంట పెట్టుబడి సహాయంగా రైతు భరోసా పథకం ద్వారా ఎకరం లోపు ఉన్న రైతులకు వారి వారి ఖాతాలలో జామ అవుతున్నాయి. కాగా కొంతమంది రైతులకు ఖాతాలలో డబ్బులు జమ కాలేదని ఆందోళన చెందుతున్నారు.అయితే డబ్బులు జమకాని రైతులు సంబంధిత ఏఈఓ లకు తెలియజేస్తే వారు సాంకేతిక కారణాలు ఏమైనా ఉంటే పరిశీలించి ఆన్ లైన్ లో పొందుపరచనున్నారు. ఆ తర్వాత అర్హులైన వారందరికీ రైతుల ఖాతాలలో డబ్బులు జమ కానున్నాయి.
కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చిన రైతులకు farmers రైతు భరోసా పథకం Rythu Bharosa అందలేదు. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతులకు కూడా రైతు భరోసా అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జనవరి 24వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వ్యవసాయ అధికారులు వారి పేర్లను ఆన్ లైన్ లో నమోదు చేశారు. అయినా కూడా వారికి ఇంకా భరోసా బ్యాంకు ఖాతాలలో జమ కాలేదు. ఈ విషయాన్ని వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా రైతు భరోసా నిధులు కొత్తవారికి కూడా వస్తాయని చెబుతున్నారు.
Tea | కొంతమంది కొంచెం "స్టైల్" కోసం, మరికొందరు అలవాటుగా... సిగరెట్ కాలుస్తూ, ఒక చేతిలో టీ కప్పుతో ఎంతో…
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
This website uses cookies.