Home » News » Rythu Bharosa Scheme New Update
News

Rythu Bharosa : రైతు భరోసా కొత్త అప్డేట్.. ఎకరానికి రూ.15 వేలు…!

Authored By
aruna
The Telugu News | Published on: May 28, 2024, 8:00 am
Advertisement

Rythu Bharosa : తెలంగాణలోని రైతులందరికీ ఆర్థిక సహాయం అందించాలి అనే లక్ష్యంతో రైతు భరోసా పథకం అమలుకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గణనీయమైన నవీకరణను అందించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Advertisement

Rythu Bharosa పథకం అవలోకనం..

ఆర్థిక సహాయం : ప్రతి రైతుకు కూడా ఎకరాకు రూ.15000 అందజేస్తాము అని ఈ పథకం హామీ ఇచ్చింది.
అమలు కాలక్రమం : ఈ పథకం యొక్క అమలు రాబోయే వర్షాకాలం నుండి మొదలవుతుంది.

Rythu Bharosa సందర్భం మరియు నేపథ్యం..

ఎన్నికల కోడ్ ప్రభావం : లోక్ సభ ఎన్నికల కోడ్ ను ఎత్తివేసిన తరువాత అమలు వివరాలు అనేవి ప్రారంభం అవుతాయి.
చారిత్రక సందర్భం : గతంలో రైతు బంధు పథకం కింద ఖరీఫ్ మరియు రబీ సీజన్లకు రెండు విడతలుగా ఎకరానికి రూ. 10000 ఇచ్చేవారు. ఈ సాయం అనేది ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకి మాత్రమే పరిమితము. కొత్త పథకం ఈ సహాయాన్ని ఎకరాకు రూ.15,000 పెంచనుంది.

Advertisement

అర్హత మరియు షరతులు :
పంట సాగు అవసరం : పంట వేసిన రైతులకు మాత్రమే ఈ సహాయం అనేది అందించనున్నారు.
కౌలు రైతులు : కౌలుదారుడు భూమిని లీజు తీసుకునే టైం లో భూమి యజమానుల నుండి అఫీడవిట్ లను కలిగి ఉన్నట్లయితే వారు కూడా ఈ నిధులు పొందవచ్చు.

Rythu Bharosa : రైతు భరోసా కొత్త అప్డేట్.. ఎకరానికి రూ.15 వేలు…!

Advertisement

అమలు ప్రక్రియ :
సంప్రదింపులు : జూన్లో ఎన్నికల కోడ్ గడువు ముగిసిన తరువాత ఈ విధి విధానాలను ఖరారు చేసేందుకు ప్రభుత్వం రైతులు మరియు రైతు సంఘాలతో సంప్రదించరున్నారు. శాసనసభ, మంత్రి మండలి లో కూడా చర్చలు జరగనున్నాయి.
రుణమాఫీ : ప్రభుత్వం ₹2 వరకు రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేయడానికి కట్టుబడి ఉన్నది. ఈ నిధుల సమీకరణ కోసం ప్రత్యేక కార్పొరేషన్లను కూడా ఏర్పాటు చేయాలి అని వారు పరిశీలిస్తున్నారు. మరియు ₹ 2 లక్షల లోపు పంట రుణాలపై డేటాను కూడా అందించాలి అని బ్యాంకులకు కూడా ఆదేశాలు జారీ చేశారు.

అదనపు మద్దతు చర్యలు :
పంటల బీమా : అకాల వర్షాలు మరియు వరదలు పకృతి వైపరీత్యాలు మరియు కరువు వల్ల నష్టాపోయిన రైతులను ఆదుకునేందుకు ఈ పథకం లో పంట బీమా భాగం అనేది ఉంటుంది. బీమా కంపెనీల కంటే నేరుగా రైతులకు ప్రయోజనం చేకూర్చే విధానాలను నిర్ధారిస్తూ ఈ చొరవ కోసం ₹ 3500 కోట్లు ప్రభుత్వం కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నది..

ఈ సమగ్ర విధానం అనేది తెలంగాణలోని రైతులకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం మరియు మద్దతు అందించటం వారి వ్యవసాయ ఉత్పాదకత మరియు ఆర్థిక స్థిరత్వాన్ని కూడా పెంచాలి అనే ఉద్దేశంతో లక్ష్యంగా పెట్టుకుంది..

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి