Categories: NewsTelangana

Telangana Farmers : వరి సాగు మానేస్తే ఎకరాకు రూ.10 వేల సాయం.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

Advertisement
Published by
Advertisement

Telangana Farmers  : తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పెరగడంతో వరి సాగు Paddy Cultivation విస్తీర్ణం రికార్డు స్థాయిలో పెరిగింది. నేడు దేశంలోనే అత్యధికంగా వరిని పండించే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ అగ్రభాగాన నిలుస్తోంది. అయితే, ఈ స్థాయిలో వరి పండటం ఒకవైపు సంతోషాన్నిస్తున్నా.. మరోవైపు ప్రభుత్వానికి, పర్యావరణానికి తీవ్ర సవాళ్లను విసురుతోంది. ఈ నేపథ్యంలో రైతులను ‘పంట మార్పిడి’ Crop Diversification వైపు ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. వరి సాగు మానేసి ఇతర ఆరుతడి పంటలు, వాణిజ్య పంటలు వేసే రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం అందించాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.

Advertisement

Telangana Farmers Scheme: వరి సాగు మానేస్తే ఎకరాకు రూ.10 వేల సాయం.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

Telangana Farmers Scheme వరి సాగుతో వస్తున్న ప్రధాన సమస్యలు ఇవే

రాష్ట్రంలో రైతులు ఏళ్ల తరబడి కేవలం వరి పంటనే సాగు చేయడం వల్ల అనేక దుష్ప్రభావాలు ఎదురవుతున్నాయని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

భూగర్భ జలాల పతనం: వరి పంటకు అత్యధికంగా నీరు అవసరం. రైతులు బోర్ల ద్వారా విపరీతంగా నీటిని తోడేస్తుండటంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు Groundwater levels అడుగంటిపోతున్నాయి.

భూసారం తగ్గిపోవడం: పంట మార్పిడి Crop rotation చేయకుండా, ఏటా ఒకే పంట (వరి) వేయడం వల్ల భూమిలోని సహజ సిద్ధమైన పోషకాలు నశించిపోయి భూసారం దారుణంగా పడిపోతోంది.

నిల్వ కష్టాలు: రికార్డు స్థాయిలో పండుతున్న ధాన్యాన్ని సేకరించడం, ఆ బియ్యాన్ని గోదాముల్లో నిల్వ చేయడం ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారుతోంది.

Telangana Farmers Scheme ప్రభుత్వంపై తీవ్ర ఆర్థిక భారం

ధాన్యం సేకరణ, నిల్వ ప్రక్రియల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఎకరాకు సుమారు రూ.20 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. గత వానాకాలం సీజన్‌లో తెలంగాణ రైతులు దేశంలోనే అత్యధికంగా 148 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించారు. ఈ ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం ఏకంగా రూ.24 వేల కోట్లు వెచ్చించింది. ఆ తర్వాత వచ్చిన యాసంగి సీజన్‌లోనూ 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో గోదాములన్నీ నిండిపోయాయి.

దీనికి తోడు, రేషన్ బియ్యం కోసం కేంద్ర ప్రభుత్వం FCI సేకరించే కోటాపై పరిమితులు విధించింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌కు మన బియ్యాన్ని ఎగుమతి చేద్దామంటే.. థాయ్‌లాండ్, వియత్నాం వంటి దేశాల నుంచి విపరీతమైన పోటీ ఎదురవుతోంది. దీంతో మిగులు నిల్వలు నిరుపయోగంగా పేరుకుపోతున్నాయి. ఈ ఆర్థిక, నిల్వ భారాన్ని తగ్గించుకోవడానికే ప్రభుత్వం ‘పంట మార్పిడి’ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది.

పంజాబ్ మోడల్ తరహాలో.. ఎకరాకు రూ.10 వేలు

మనకంటే ముందే పంజాబ్ రాష్ట్రం ఈ సమస్యను గుర్తించింది. అక్కడ వరి సాగును తగ్గించి ఇతర పంటల వైపు మళ్లే రైతులకు హెక్టారుకు రూ.17 వేలు (ఎకరాకు సుమారు రూ.6,800) ప్రోత్సాహకంగా అందిస్తున్నారు. అదే మోడల్‌ను మరింత ఆకర్షణీయంగా తెలంగాణలో అమలు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. వరికి బదులుగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పప్పుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, ఉద్యానవన పంటలు వేసే రైతులకు ఎకరాకు రూ.10,000 నగదు సాయం Financial Assistance అందించే ప్రతిపాదనను పరిశీలిస్తోంది.

ప్రత్యామ్నాయ పంటలు ఏంటి? మార్కెటింగ్ ఎలా?

రైతులు వరి మానేస్తే ఏ పంటలు వేయాలి? వాటికి లాభాలు వస్తాయా? అనే భయం లేకుండా వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రణాళిక రచిస్తోంది. పప్పుధాన్యాలు, కూరగాయలు, క్యాప్సికం, పూలు, ఇతర విదేశీ (ఎక్సోటిక్) పండ్ల సాగుపై అధికారులతో నివేదిక సిద్ధం చేయిస్తున్నారు. ఈ డేటా ఆధారంగా ప్రాంతాల వారీగా ఏ నేలకు ఏ పంట అనువైనదో ఒక జాబితాను రూపొందించి రైతులకు అందించనున్నారు.

కేవలం ఎకరాకు 10 వేలు ఇచ్చి చేతులు దులుపుకోకుండా.. రైతులు పండించిన ప్రత్యామ్నాయ పంటలకు కనీస మద్దతు ధర MSP కల్పించడంతో పాటు, మార్కెటింగ్ సౌకర్యాలను కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

త్వరలోనే క్యాబినెట్ ఆమోదం

ఇప్పటికే ఈ పథకం విధివిధానాలపై సీఎం రేవంత్ రెడ్డి.. వ్యవసాయ, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులతో ప్రాథమిక చర్చలు జరిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, పారదర్శకంగా ఈ నిధులను నేరుగా వారి ఖాతాల్లోకి ఎలా జమ చేయాలి అనేదానిపై కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. రాబోయే కేబినెట్ సమావేశంలో Cabinet Meeting ఈ పంట మార్పిడి ప్రోత్సాహక పథకంపై సమగ్రంగా చర్చించి, సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ఈ ‘మెగా స్కీమ్’ను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం అమలైతే భూగర్భ జలాలు సేవ్ అవ్వడమే కాకుండా, రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Recent Posts

Peddi Movie Trailer : రామ్ చరణ్ ‘పెద్ది’ ట్రైలర్ రచ్చ.. మాస్ అవతార్‌తో మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్!

Peddi Movie Trailer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan  నటిస్తున్న భారీ Pan India…

8 hours ago

LPG Hormuz : ఇరాన్ ఉద్రిక్తతల నడుమ భారత్‌కు గుడ్ న్యూస్.. LPG ట్యాంకర్ సురక్షితంగా భార‌త్‌కు..!

LPG Hormuz : ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న హోర్ముజ్ జలసంధి ( Strait of Hormuz ) మార్గం…

9 hours ago

Sreeleela Tilak Varma : తిలక్ వర్మతో డేటింగ్ వార్తలపై శ్రీలీల ఫ్యామిలీ క్లారిటీ.. అసలు నిజం ఇదే!

Sreeleela Tilak Varma : ఇటీవల సోషల్ మీడియాలో హీరోయిన్ శ్రీలీల, టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్…

10 hours ago

Heart Attack : 30 ఏళ్లకే హార్ట్ అటాక్ ప్రమాదం.. యువత తప్పక తెలుసుకోవాల్సిన కారణాలు!

Heart Attack :  ఇటీవల కాలంలో యువతలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గతంలో ఎక్కువగా వృద్ధుల్లో కనిపించే ఈ సమస్య…

11 hours ago

Heatstroke : వడదెబ్బకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుందా..? పాలసీదారులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!

Heatstroke  : దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో హీట్‌వేవ్‌, వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చాలామంది…

15 hours ago

Blood Sugar : డయాబెటిస్ ఉన్నవారికి మజ్జిగతో జీలకర్ర మేలా..? అసలు నిజం ఇదే..!

Blood Sugar : ప్రస్తుతం డయాబెటిస్ సమస్య ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు చాలామంది సహజ…

16 hours ago

Raw Mangoes : పచ్చి మామిడిని అస్సలు మిస్ అవొద్దు.. వేసవిలో శరీరానికి సూపర్ బెనిఫిట్స్..!

Raw Mangoes : వేసవి సీజన్ ప్రారంభం కాగానే మార్కెట్లో పచ్చి మామిడి కాయల సందడి మొదలవుతుంది. పుల్లపుల్లగా ఉండే…

17 hours ago

Rajinikanth : రాజకీయాల్లోకి వచ్చుంటే సీఎం అయ్యేవాడిని.. రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు!

Rajinikanth :  సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…

1 day ago

Linguda : లింగుడా ఆకుకూరలో దాగి ఉన్న అద్భుత ప్రయోజనాలు.. షుగర్, జాయింట్ పెయిన్‌కు సూపర్ ఫుడ్..!

Linguda  : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…

1 day ago

Fenugreek Seeds : మెంతులు శరీరంలో వేడి పెంచుతాయా..? తగ్గిస్తాయా..? అసలు నిజం ఇదే!

Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…

1 day ago

Bottle Gourd Juice : సొరకాయ జ్యూస్‌తో నిజంగానే పొట్ట కొవ్వు తగ్గుతుందా..? నిపుణులు చెప్పిన నిజాలు ఇవే!

Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…

3 days ago

Petrol : భారత్‌లో అత్యధికంగా పెట్రోల్ వాడేది ఏ రాష్ట్రం..? షాకింగ్ గణాంకాలు వైరల్!

Petrol  : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…

4 days ago