Singareni Employees : సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. దసరా కానుకను ప్రకటించారు. ప్రతి సంవత్సరం సింగరేణి కార్మికులకు దసరా సందర్భంగా బోనస్ ఇస్తారు. ఈ సంవత్సరం సింగరేణి కార్మికులకు భారీ బోనస్ ప్రకటించారు. దీంతో సింగరేణి కార్మికులు ఎగిరి గంతేస్తున్నారు. దసరా పండుగ వేళ భారీగా బోనస్ ప్రకటించారు. ముందుగా మాటిచ్చిన ప్రకారంగా 2022- 2023 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన లాభాల్లో కార్మికులకు బోనస్ ప్రకటించారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం సింగరేణి ఎక్కువ లాభాలు ఆర్జించింది. సింగరేణి సంస్థ రికార్డు స్థాయిలో రూ.2222 కోట్ల లాభాలను ఈ సంవత్సరం ఆర్జించింది. ఇందులో 32 శాతం అంటే రూ.711 కోట్లను దసరా బోనస్ గా సింగరేణి కార్మికులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు బోనస్ నిధులను విడుదల చేశారు. ఈ బోనస్ డబ్బులు ఈ నెల 16 వ తేదీన సింగరేణి కార్మికుల అకౌంట్ లో జమ కానున్నాయి. సగటున ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.1.53 లక్షలు బోనస్ అందనున్నట్టు అధికారులు అంచనా వేశారు. పండుగ పూట పెద్ద ఎత్తున బోనస్ ప్రకటించడంతో సింగరేణి కార్మికులు పట్టలేని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే కార్మికులకు 11వ వేతన ఒప్పందానికి సంబంధించిన 23 నెలల బకాయిలను కార్మికులకు ప్రభుత్వం చెల్లించింది. సుమారు 1450 కోట్ల రూపాయలను ప్రభుత్వం పెండింగ్ బకాయిలను చెల్లించింది.
మంచిర్యాల సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్ మునుపెన్నడూ లేని విధంగా కార్మికులకు లాభాల్లో వాటాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే గతంలో ఇచ్చిన వాటా కంటే ఎక్కువగా ఏకంగా 32 శాతం వాటాను ప్రకటించారు. ఈమేరకు ఈరోజు నిధులు విడుదల చేశారు. దీంతో ఈ ఏడాది సింగరేణి ముఖాల్లో రెట్టింపు సంతోషం కనిపిస్తోంది. దసరా, దీపావళి పండుగల సందర్భంగా వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ దమాకా ప్రకటించింది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.