Rationcard holders : రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..!!
Rationcard holders : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను ప్రభుత్వం నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డు ను తీసుకోవాలి అని ప్రజలకు సూచించింది. రేషన్ పంపిణీలో మరింత పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ-కేవైసీ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ-కేవైసీ గడువును ప్రభుత్వం పెంచింది. రేషన్ కార్డ్ లబ్ధిదారులు జనవరి 31వ తేదీ లోపు ఈ – కేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రేషన్ కార్డులో ఎంతమంది ఉంటారో వారంతా రేషన్ దుకాణానికి వెళ్లి అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
రెండు నెలలుగా రేషన్ షాపుల్లో డీలర్లు ఈ-కేవైసీ ని సేకరిస్తున్నారు. అందుకోసం ఆధార్ ధ్రువీకరణతో పాటు వేలిముద్రలు, కంటిపాప గుర్తింపును తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ శనివారం నాటికి 70 శాతం పూర్తి అయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా 87.81% నమోదు తో మొదటి స్థానంలో ఉంది. అతి తక్కువగా వనపర్తి జిల్లాలో 54.17% పూర్తయింది. రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ఐరీస్ , ఈపోస్ మిషన్లు జియో ట్యాగింగ్ విధానాలను అందుబాటులోకి తెచ్చి కొంతవరకు అడ్డుకట్ట వేయగలిగింది. అయితే సరుకులు తీసుకునేందుకు కార్డుదారుల్లో ఏ ఒక్కరు వేలిముద్ర వేసిన సరిపోయేది. దీంతో చనిపోయిన వారి పేరిట సైతం సరుకులు తీసుకుంటున్నారు. అంతేకాకుండా కొందరు అర్హత లేని వారు కూడా కార్డులు పొంది నెల నెలా రేషన్ తీసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే సరుకుల పంపిణీ లో పూర్తి పారదర్శకత కోసం రేషన్ కార్డులకు ఈ-కేవైసీ చేస్తున్నారు. దీంతో అర్హత కలిగిన వారే రేషన్ కార్డును పొందుతారు. కాబట్టి తెలంగాణ ప్రజలు జనవరి 31 లోపు రేషన్ కార్డులకు ఈ-కేవైసీ చేయించుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ సూచించింది. గతంలో రేషన్ సరుకులు తీసుకునేందుకు లబ్ధిదారుల్లో ఏ ఒక్కరు వేలిముద్ర వేసిన సరిపోయేది. దీంతో చనిపోయిన వారి పేరిట కూడా కొందరు సరుకులు తీసుకుంటున్నారు. అర్హత లేని వారు కూడా కార్డులు పొంది ప్రతి నెలా రేషన్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సరుకుల పంపిణీలో లోపాలను సవరిస్తూ రేషన్ కార్డులకు ఈ-కేవైసీ చేస్తున్నారు. ప్రతి ఒక్క రేషన్ కార్డు కి ఈ-కేవైసీ తప్పనిసరి అని తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సూచించింది.
Chaurya Paatam : అమెజాన్ ప్రైమ్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగిపోతోంది. అదే 'చౌర్య పాఠం' (Chaurya Paatam).…
Motorola Edge 50 : మోటోరోలా ఫోన్పై ఖతర్నాక్ డిస్కౌంట్ ప్రకటించారు. రూ.22వేల లోపు కొత్త ఫోన్ కొనేవారికి మోటోరోలా…
Good News : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది.…
Women : మహిళలని ప్రోత్సహించేందుకు మోదీ సర్కారు అనేక పథకాలు తీసుకొస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి వాటిలో ముద్రా…
Tea : టీ కూడా ప్రజలలో, ఎంతో ఇష్టంగా, అలవాటు గా మారిపోయింది. లేనిదే ప్రపంచమే ఆగిపోతుంది అన్నట్లు ఫీలింగ్…
Sekhar Kammula : సాధారణంగా శేఖర్ కమ్ముల చాలా స్లో అండ్ స్టడీగా సాగుతుంటాయి. ఆయన సినిమాల్లో స్టార్ హీరోలు,…
Watermelon : కొన్ని సీజనల్గా వచ్చే పండ్లను తింటే ఆరోగ్యకరమని ఆ సీజన్లో లభించే పండ్లను అప్పుడే తినడానికి ఎక్కువ…
Yoga Asanas : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా రంగంలో మరో ఘనత నమోదైంది. కర్ణాటక రాష్ట్రంలోని హసన్కు…
This website uses cookies.