
Constable Soumya : కానిస్టేబుల్ సౌమ్య మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం : చుంచు కుమార్
Constable Soumya : హైదరాబాద్ రాష్ట్రంలో ఎక్సైజ్ సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ప్రజాధర్మ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చుంచు కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. గంజాయి స్మగ్లర్ల దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, దీనికి నేరుగా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆయన స్పష్టం చేశారు. అక్రమ మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల మాఫియాలు ఆయుధాలతో సంచరిస్తున్నా, వారిని ఎదుర్కొనే ఎక్సైజ్ సిబ్బందికి కనీస భద్రతా ఏర్పాట్లు కూడా కల్పించకపోవడం దుర్మార్గమని విమర్శించారు. భద్రత లేకుండా సిబ్బందిని ఫీల్డ్లోకి పంపడం అంటే వారి ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Constable Soumya : కానిస్టేబుల్ సౌమ్య మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం : చుంచు కుమార్
ఎక్సైజ్ సిబ్బంది ప్రజారోగ్యాన్ని కాపాడే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని, అక్రమ మత్తు పదార్థాల నియంత్రణలో వారు ముందువరుసలో ఉంటారని చుంచు కుమార్ తెలిపారు. అయితే అలాంటి కీలక విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి కనీస ఆత్మరక్షణ సాధనాలు కూడా లేకపోవడం తీవ్ర దురదృష్టకరమన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రతి పౌరుడికి జీవించే హక్కును హామీ ఇస్తుందని, అదే విధంగా విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి ప్రాణరక్షణ మరింత ప్రాధాన్యత కలిగిన అంశమని ఆయన గుర్తు చేశారు. ఆయుధాలు, బుల్లెట్ప్రూఫ్ జాకెట్లు, రక్షణ పరికరాలు లేకుండా సిబ్బందిని ప్రమాదకర పరిస్థితుల్లోకి పంపడం రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని వ్యాఖ్యానించారు.
అక్రమ మద్యం, గంజాయి మాఫియా గ్యాంగులు ఆయుధాలతో దాడులకు పాల్పడుతున్న సమయంలో, ఎక్సైజ్ సిబ్బంది మాత్రం ఖాళీ చేతులతో విధుల్లోకి వెళ్లాల్సి వస్తోందని చుంచు కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల వల్లే దాడులు, తీవ్ర గాయాలు, చివరకు ప్రాణనష్టం సంభవిస్తోందని తెలిపారు.ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం స్పందించకపోవడం ఘోర బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని, ఇది సిబ్బంది మనోధైర్యాన్ని దెబ్బతీస్తోందని విమర్శించారు.
గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడం పట్ల చుంచు కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సౌమ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, తక్షణమే కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇది దయగా కాకుండా, ప్రభుత్వ బాధ్యతగా చూడాలన్నారు.
ప్రభుత్వం వెంటనే తీసుకోవాల్సిన నిర్ణయాత్మక చర్యలు
ప్రజాధర్మ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి చుంచు కుమార్ మాట్లాడుతూ,
ఎక్సైజ్ సిబ్బందికి వెంటనే ఆయుధాలు అందించాలి
బుల్లెట్ప్రూఫ్ జాకెట్లు, రక్షణ పరికరాలు ఇవ్వాలి
ఫీల్డ్ ఆపరేషన్లకు ప్రత్యేక శిక్షణ కల్పించాలి
అక్రమ మత్తు పదార్థాల మాఫియాపై ఉక్కుపాదంతో చర్యలు తీసుకోవాలి
అని డిమాండ్ చేశారు.
ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యం చేస్తే, ప్రజాధర్మ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి దిగుతుందని ఆయన హెచ్చరించారు.
ఎక్సైజ్ సిబ్బంది భద్రత అనేది కేవలం ఉద్యోగుల సమస్య మాత్రమే కాదని, ఇది ప్రజారోగ్యం, చట్టవ్యవస్థ, సమాజ భద్రతతో నేరుగా ముడిపడి ఉన్న అత్యంత కీలక అంశమని చుంచు కుమార్ స్పష్టం చేశారు. సిబ్బంది భద్రతను నిర్లక్ష్యం చేస్తే అక్రమ మత్తు పదార్థాల వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
నేరగాళ్లకు చట్టంపై భయం కలగాలంటే, ముందుగా చట్టాన్ని అమలు చేసే సిబ్బందికి పూర్తి భద్రత కల్పించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఎక్సైజ్ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలన్న డిమాండ్ ఇప్పుడు ఐచ్ఛికం కాదు – కాలానుగుణ అవసరం అని ప్రజాధర్మ పార్టీ తేల్చి చెప్పింది
Ustaad Bhagat Singh Movie Review : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan , మాస్ డైరెక్టర్…
Hyderabad Girls : ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు లోకం మొత్తం మన గుప్పిట్లో ఉన్నట్టే…
Ustaad Bhagath singh :టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం ఒక రకమైన క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడనే చెప్పాలి.…
Malkajgiri : మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున “రంజాన్…
Iran And India : ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న గొడవలు ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వణికించేలా ఉన్నాయి.…
Telangana : తెలంగాణలో బీసీలపై అవమానకరంగా వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీసీ…
Revanth Reddy : క్వింటల్ కొద్దీ ఆరోపణలు, టన్నుల కొద్దీ విమర్శలు.. ప్రస్తుతం తెలంగాణ Telangana రాజకీయాల్లో Harish rao …
Pawan Kalyan : సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది పండగ…
Rithu Bharosa : యాసంగి సీజన్లో రైతులకు పెట్టుబడి సాయం నిరాటంకంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.…
Induction stove : ప్రస్తుతం ఎక్కువ మంది గ్యాస్ స్టౌవ్లకు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ కుక్టాప్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.…
Farmers : రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ సమావేశాల్లో ఈ విషయాన్ని…
Gold Silver Price 18th March 2026 : పండుగ సీజన్ వస్తుందంటే చాలు, తెలుగు లోగిళ్లలో పసిడి కొనుగోళ్లు…
This website uses cookies.