Categories: andhra pradeshNews

Jogi Ramesh : నారా లోకేష్ ‘పిల్ల చేష్టలకు’ భయపడేది లేదు – జోగి వార్నింగ్

Advertisement
Advertisement

Jogi Ramesh : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో సెగలు పుట్టించే పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ Nara Lokesh పై మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ TDP  శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహానికి దారితీశాయి. మైలవరం నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసాన్ని ముట్టడించి, ఇంటిపైకి రాళ్లతో దాడికి దిగారు. ఇంతటితో ఆగకుండా కొందరు ఆందోళనకారులు ఇంటికి నిప్పు పెట్టడం, పెట్రోల్ బాంబులు విసిరారన్న ఆరోపణలు ఉద్రిక్తతను పరాకాష్టకు చేర్చాయి. ఘటన సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పినప్పటికీ, ఆస్తి నష్టం భారీగానే సంభవించింది.

Advertisement

Jogi Ramesh : నారా లోకేష్ ‘పిల్ల చేష్టలకు’ భయపడేది లేదు – జోగి వార్నింగ్

Jogi Ramesh మా ఇంటిపై ఎందుకు దాడి చేశారు ? – జోగి ఆవేదన

ఈ ఘటన పై జోగి రియాక్ట్ అయ్యారు. “నేనేం చేశానని ఈ దాడులు?” అటు తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరుగుతూ, తనను రాజకీయంగా వేధించడమే కాకుండా భౌతిక దాడులకు దిగడం దుర్మార్గమని మండిపడ్డారు. “అక్రమ కేసులతో ఇప్పటికే 83 రోజులు జైలులో పెట్టి వేధించింది చాలక, ఇప్పుడు మా ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడులు చేయిస్తారా?” అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజకీయాల్లో విమర్శలు సహజమని, కానీ నేరుగా నివాసాలపై దాడులు చేయడం అరాచక పాలనకు నిదర్శనమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Jogi Ramesh నారా లోకేష్‌కు మాజీ మంత్రి జోగి రమేష్ వార్నింగ్ !

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌ను ఉద్దేశించి జోగి రమేష్ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. “నీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటికి నీ ఇల్లు కూడా అంతే దూరం ఉంటుందని గుర్తుంచుకో” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ తనపై ఇలాంటి ‘పిల్ల చేష్టలకు’ పాల్పడితే తాను భయపడే ప్రసక్తే లేదని, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ పరస్పర సవాళ్లు మరియు భౌతిక దాడుల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

Recent Posts

Seetharampuram : యువ నేత సిద్ధార్థ చేతుల మీదుగా సీతారాంపురంలో బీఆర్ఎస్ వార్డు కార్యాల‌యం ప్రారంభం

Seetharampuram  : మిర్యాలగూడ పట్టణంలోని 44వ వార్డు సీతారాంపురంలో భారత రాష్ట్ర సమితి ( BRS ) పార్టీ నూతన…

53 minutes ago

Mutchintalapally Municipality : మూడు చింతలపల్లి మున్సిపాలిటీ ఛైర్మెన్ పీఠం కాంగ్రెస్ దే : తోటకూర వజ్రేష్ యాదవ్

Mutchintalapally Municipality : మూడుచింతలపల్లి మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీ Congress Party హస్తగతం చేసుకుంటుందని మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు…

1 hour ago

Constable Soumya : కానిస్టేబుల్ సౌమ్య మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం : చుంచు కుమార్

Constable Soumya  : హైదరాబాద్ రాష్ట్రంలో ఎక్సైజ్ సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని…

2 hours ago

Farmers : అన్నదాతల‌కు గుడ్‌న్యూస్‌… బ‌డ్జెట్‌లో భారీ వ‌రాలు జ‌ల్లు..!

Farmers : Budget 2026 -27 : కేంద్ర బడ్జెట్ 2026-27లో అన్నదాతలకు అద్భుతమైన ప్రోత్సాహకాలను ప్రకటించింది. వ్యవసాయ, ఉద్యానవన…

3 hours ago

Mahesh Babu – Balakrishna : ఓడియమ్మ బంటీ .. మహేష్ – బాలయ్య మల్టీ స్టారర్ .. థియేటర్‌లు బ్లాస్ట్

Mahesh Babu - Balakrishna : టాలీవుడ్‌లో Tollywood  సూపర్ స్టార్ మహేష్ బాబు  Superstar Mahesh Babu ,…

4 hours ago

KCR : ఉద్యమ రచన చేసిన గదిలోనే విచారణ .. కేసీఆర్ భావోద్వేగం..!

KCR : తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో  phone tapping case  తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.…

5 hours ago

Prabhas : అన్నా నీ కాళ్ళు పట్టుకుంటాం .. ఆ పని మాత్రం చేయకు అంటున్న ప్రభాస్ ఫ్యాన్స్

Prabhas : మారుతి దర్శకత్వంలో  Maruti Direction  ప్రభాస్ హీరోగా వచ్చిన చిత్రం ‘ది రాజాసాబ్‌’ అనుకున్న స్థాయిలో విజయం…

6 hours ago

Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఎప్పుడు ? .. యాసంగి పంట పై అన్నదాతల ఎదురు చూపులు

Rythu Bharosa : యాసంగి పంట  Yasangi panta  సీజన్ ప్రారంభమై ఇప్పటికే రెండు నెలలు గడుస్తుతుంది. కానీ ప్రభుత్వ…

7 hours ago