Home » Exclusive » Ys Sharmila To Give Support To Congress Party
Exclusive

YS Sharmila : నేను పోటీ చేయడం లేదు.. పాలేరులో పొంగులేటికి మద్దతు ఇస్తున్నా.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నా.. షాకిచ్చిన వైఎస్ షర్మిల

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: November 3, 2023 1:20 pm
Advertisement

YS Sharmila : అనుకున్నట్టుగానే వైఎస్ షర్మిల తెలంగాణ ప్రజలకు, పాలేరు ప్రజలకు షాకిచ్చారు. చాలా రోజుల నుంచి కంటిన్యూ అవుతున్న సస్పెన్స్ కు నేడు ముగింపు పలికారు వైఎస్ షర్మిల. తెలంగాణలో పోటీ చేయడం లేదని.. ఈసారి వైఎస్సార్టీపీ పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తోందని తాజాగా ప్రకటించారు. వైఎస్ షర్మిల ఈసారి పోటీ చేయకుండా, తమను పోటీ చేయనీయకుండా మోసం చేశారని.. వైఎస్సార్టీపీ నాయకులు ఆ పార్టీ కార్యాలయంలో ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే తమ నేతలతో సమీక్ష నిర్వహించిన వైఎస్ షర్మిల తాజాగా ఈ ప్రకటన చేశారు. తెలంగాణలో పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నా. పాలేరులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మద్దతు ఇస్తున్నా అంటూ వైఎస్ షర్మిల ప్రకటించారు.

Advertisement

మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావద్దు కాబట్టే కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇవ్వడం కరెక్ట్ అనిపిస్తోంది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తోంది వైఎస్సార్ తెలంగాణ పార్టీ. పాలేరు ప్రజలు నాకు సమాధానం చెప్పాలి. నన్నేం చేయమంటారు. మొండిగా తెగించి నిలబడమంటారా? పొంగులేటిని ఓడించమంటారా? నన్ను ఓడిపోమంటారా? రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఏం కోరుకుంటున్నారు? గెలుపు ముఖ్యమే, గెలుపు గొప్పదే. కానీ.. త్యాగం అంతకంటే గొప్పది. రాజశేఖర్ రెడ్డి బిడ్డను అర్థం చేసుకుంటారని పాలేరు ప్రజలను మనస్ఫూర్తిగా కోరుతోంది రాజశేఖర్ బిడ్డ. ఎప్పటికైనా పాలేరు ప్రజలతో ఓటు వేయించుకుంటా. ఎప్పటికైనా పాలేరు ప్రజలను నేను రిప్రజెంట్ చేయాలనేది నా కోరిక అంటూ షర్మిల కంటతడి పెట్టుకున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి