Nepal Crisis Deepens : ప్రధాని ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళన కారులు..నేపాల్ లో టెన్షన్ టెన్షన్
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి పాలనకు వ్యతిరేకంగా వేలాది మంది యువకులు రాజధాని ఖాట్మాండూలో భారీ నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారడంతో 19 మందికి పైగా మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు. ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు ప్రధాని అధికారిక నివాసానికి, మంత్రులు, మాజీ ప్రధానుల ఇళ్లకు నిప్పుపెట్టడంతో పాటు పార్లమెంట్ భవనంలోకి చొరబడ్డారు. పరిస్థితి అదుపుతప్పడంతో సైన్యాన్ని రంగంలోకి దింపగా, చివరికి ప్రధాని కేపీ శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేశారు.
Nepal Crisis Deepens : ప్రధాని ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళన కారులు..నేపాల్ లో టెన్షన్ టెన్షన్
ఈ పరిణామాలన్నింటికీ మూలకారణం నేపాల్ ప్రభుత్వం 26 యాప్లను, ముఖ్యంగా ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి సోషల్ మీడియా ప్లాట్ఫాంలను నిషేధించడం. కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిర్దేశించిన గడువులోగా నమోదు కానందువల్ల ఈ యాప్లను నిషేధించారు. ఈ నిర్ణయం యువతలో తీవ్ర ఆగ్రహం రేపింది. ముఖ్యంగా విద్యార్థులు, జెన్-జెడ్ తరం యువత జాతీయ జెండాలతో, జాతీయ గీతం పాడుతూ నిరసనలను ప్రారంభించి, తర్వాత నినాదాలతో తీవ్ర ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యుల జీవితాలను దెబ్బతీస్తోందని నిరసనకారులు ఆరోపించారు.
ప్రస్తుతం టిక్టాక్ మాత్రం పనిచేస్తుండటంతో, యువత తమ అసంతృప్తిని వ్యక్తం చేసే ప్రధాన వేదికగా మారింది. రాజకీయ నాయకుల పిల్లలు విలాసవంతమైన జీవనం గడుపుతుంటే, సామాన్య ప్రజలు కష్టాల్లో కూరుకుపోతున్నారనే వీడియోలు టిక్టాక్లో వైరల్ అవుతున్నాయి. ఇదే నిరసనలను మరింత వేడెక్కించింది. ఈ పరిస్థితులపై స్పందించిన కేపీ శర్మ ఓలి, సోషల్ మీడియా నిషేధం దేశ గౌరవాన్ని కాపాడేందుకేనని సమర్థించుకున్నప్పటికీ, పెరుగుతున్న ఒత్తిడిని ఎదుర్కోలేక చివరికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ పరిణామాలు నేపాల్ రాజకీయ చరిత్రలో కీలక మలుపుగా నిలుస్తున్నాయి.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
Allu Family |సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాణం ‘అల్లు బిజినెస్ పార్క్’ ఇప్పుడు వివాదాస్పదంగా…
This website uses cookies.