ys jagan
YSRCP : 2019 సాధారణ ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఇక పదేళ్ల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని వైసీపీ నేతలు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో రాజకీయంగా పలు సమీకరణాలతోనే జగన్ సక్సెస్ అయ్యాడనే అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆ అంచనాలను దృష్టిలో పెట్టుకునే రాజకీయంగా ముందుకు వెళ్లాలని జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అవేంటంటే..కులాల సమీకరణాలతో ఎన్నికల్లో గెలవొచ్చు అని చాలా మంది రాజకీయ నాయకులు అనుకుంటారు. కాని అన్ని సమయాల్లో ఆ సమీకరణాలు పని చేయకపోవచ్చు. ఇందుకు బోలెడన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి.
ysrcp
జనం అప్పటి మూడ్ను బట్టి పోలింగ్ ఉంటుందని పలువురు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం సంక్షేమ పథకాలు, కుల సమీకరణాల ఆధారంగా రాజకీయం చేయగలిగే పరిస్థితులు ఉండకపోవచ్చని అంటున్నారు. ప్రతీ రోజు ఫ్యామిలీ గడవడంతో పాటు వారి ఎకానమికల్ కండీషన్స్ మెరుగు కావాలి. అందుకు ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు తగు సాయం చేయాలి. అయితే, ప్రస్తుతం పరిస్థితుల్లో ఏపీలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల్లో జగన్ పాలన పట్ల తీవ్రమైన అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలను గ్రహించి క్షేత్రస్థాయి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం వైసీపీకి ఎంతైనా ఉంది. కాని ఈ క్షేత్రస్థాయి పరిస్థితులు ముఖ్యమంత్రి వరకు రీచ్ అయ్యే సిచ్యువేషన్స్ ఇప్పుడున్నట్లు కనిపించడం లేదు. పింఛన్లు, రేషన్, అమ్మ ఒడితో పాటు ఇతర సంక్షేమ పథకాలు లబ్ధిదారులందరికీ రీచ్ అవుతున్నాయనే రిపోర్టులు జగన్కు అందుతున్నట్లు కనబడుతున్నది.
ys jagan
ఇకపోతే జగన్ సైతం తనను కులాల సమీకరాణాలతో పాటు సంక్షేమ పథకాలు రాజకీయంగా అధికారంలో ఉండటానికి సాయపడతాయని, అవే తనను గట్టెక్కిస్తాయని అంచనా వేసుకుంటున్నట్లు కనబడుతున్నది. బీసీల్లో అత్యధిక కులాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వైసీపీ వైపు ఉన్నాయని భావిస్తున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో రోజురోజుకూ నియోజకవర్గాల్లో శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులపై వ్యతిరేకత పెరుగుతందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో జగన్ క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసుకుంటేనే మంచిదనే అభిప్రాయలు రాజకీయ వర్గాల నుంచి వినబడుతోంది.
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
This website uses cookies.