ys jagan
YSRCP : 2019 సాధారణ ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఇక పదేళ్ల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని వైసీపీ నేతలు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో రాజకీయంగా పలు సమీకరణాలతోనే జగన్ సక్సెస్ అయ్యాడనే అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆ అంచనాలను దృష్టిలో పెట్టుకునే రాజకీయంగా ముందుకు వెళ్లాలని జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అవేంటంటే..కులాల సమీకరణాలతో ఎన్నికల్లో గెలవొచ్చు అని చాలా మంది రాజకీయ నాయకులు అనుకుంటారు. కాని అన్ని సమయాల్లో ఆ సమీకరణాలు పని చేయకపోవచ్చు. ఇందుకు బోలెడన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి.
ysrcp
జనం అప్పటి మూడ్ను బట్టి పోలింగ్ ఉంటుందని పలువురు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం సంక్షేమ పథకాలు, కుల సమీకరణాల ఆధారంగా రాజకీయం చేయగలిగే పరిస్థితులు ఉండకపోవచ్చని అంటున్నారు. ప్రతీ రోజు ఫ్యామిలీ గడవడంతో పాటు వారి ఎకానమికల్ కండీషన్స్ మెరుగు కావాలి. అందుకు ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు తగు సాయం చేయాలి. అయితే, ప్రస్తుతం పరిస్థితుల్లో ఏపీలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల్లో జగన్ పాలన పట్ల తీవ్రమైన అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలను గ్రహించి క్షేత్రస్థాయి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం వైసీపీకి ఎంతైనా ఉంది. కాని ఈ క్షేత్రస్థాయి పరిస్థితులు ముఖ్యమంత్రి వరకు రీచ్ అయ్యే సిచ్యువేషన్స్ ఇప్పుడున్నట్లు కనిపించడం లేదు. పింఛన్లు, రేషన్, అమ్మ ఒడితో పాటు ఇతర సంక్షేమ పథకాలు లబ్ధిదారులందరికీ రీచ్ అవుతున్నాయనే రిపోర్టులు జగన్కు అందుతున్నట్లు కనబడుతున్నది.
ys jagan
ఇకపోతే జగన్ సైతం తనను కులాల సమీకరాణాలతో పాటు సంక్షేమ పథకాలు రాజకీయంగా అధికారంలో ఉండటానికి సాయపడతాయని, అవే తనను గట్టెక్కిస్తాయని అంచనా వేసుకుంటున్నట్లు కనబడుతున్నది. బీసీల్లో అత్యధిక కులాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వైసీపీ వైపు ఉన్నాయని భావిస్తున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో రోజురోజుకూ నియోజకవర్గాల్లో శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులపై వ్యతిరేకత పెరుగుతందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో జగన్ క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసుకుంటేనే మంచిదనే అభిప్రాయలు రాజకీయ వర్గాల నుంచి వినబడుతోంది.
Ration Card : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రేషన్ కార్డుల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. తెలంగాణలో నూతన కార్డుల…
TDP : ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర మార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో, టీడీపీ కి చెందిన సీనియర్ నాయకుడు సుగవాసి బాలసుబ్రమణ్యం…
Today Gold Rate : గోల్డ్ ప్రియులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం…
Green Tea : వయసు పెరిగే కొద్దీ మెదడు ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమవుతుంది. ఇది అల్జీమర్స్ వ్యాధి. వాస్కులర్ డిమెన్షియా…
Advantages Of Early Dinner : ప్రారంభ భోజనం వల్ల కలిగే ప్రయోజనాలు నిస్సందేహంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ, మనలో…
Weight Loss Story : మీరు Google లో లేదా ఎవరితోనైనా బరువు తగ్గించే చిట్కాల కోసం వెతికినప్పుడు, మీకు…
Good News : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్తగా 8వ వేతన కమిషన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్…
Health Risk: సాధారణంగా తినే ఆహారాలు కలర్ ఫుల్ గా కనిపించాలంటే పలు రకాల రసాయనాళ్ళను వినియోగిస్తున్నారు. ఈ రసాయనాలు…
This website uses cookies.