
brahmamudi 11 november 2023 saturday full episode
Brahmamudi 11 Nov Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. బ్రహ్మముడి సీరియల్ 11 నవంబర్ 2023, శనివారం ఎపిసోడ్ 251 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఫ్యామిలీ గురించి నీకు ఆలోచన లేకపోయినా నేను ఆలోచించాలి కదా. అది నా బాధ్యత అంటాడు రాజ్. మన గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ.. ముందు ఇది తినండి అంటే.. నేను తినను అని చెబుతున్నాను కదా. నువ్వు కోపంగా చూస్తే బెదిరిపోవడానికి నేనేమీ మీ షాపులో పని చేసే వాడిని కాదు. వెళ్లు.. నేను తినను అని చెప్పడంతో భోజనం అక్కడ పెట్టి బయటికి వెళ్లబోతుంది కావ్య. దీంతో తీసుకెళ్లు అని ప్లేట్ ఇచ్చి పంపిస్తాడు రాజ్. మీచేతే అన్నం తినిపిస్తాను.. ఎలాగో మీరే చూడండి అని మనసులో అనుకొని బయటికి వెళ్తుంది కావ్య. చిన్నఅత్తయ్య రెడీనా అంటుంది. నేను ఇందాక చెప్పిన విషయం గుర్తుంది కదా అంటే.. గుర్తుంది అంటుంది. ఏంటి చిన్నత్తయ్య మీరు అనేది.. మీరు ఈ పని చేయగలరా అంటుంది కావ్య. ఏం ఎందుకు చేయలేను.. చిన్నప్పటి నుంచి నేను వాడిని దగ్గర్నుంచి చూశా అంటుంది ధాన్యలక్ష్మి. దీంతో మీ మాటే కాదు.. అపర్ణ అత్తయ్య మాట కూడా వినడు అంటుంది కావ్య. అప్పుడే అక్కడి నుంచి వెళ్తున్న అపర్ణ.. అన్ని మాటలు విని.. ఏమైంది.. ఏం జరిగింది అని ధాన్యలక్ష్మిని అడుగుతుంది.
దీంతో ఏం లేదు అక్కయ్య.. రాజ్ భోజనం చేయనన్నాడట. తన మాట వినడం లేదు కదా అంటే.. నీ మాట కాకపోతే నా మాట వింటాడు అని చెప్పా అంటుంది ధాన్యలక్ష్మి. కానీ.. నా మాట కాదు.. మీ మాట కూడా వినడు అని కావ్య చెబుతోంది అంటుంది. కానీ.. రాజ్ ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో నువ్వు చెప్పినా వినడు అని చాలెంజ్ చేస్తోంది అంటే.. నేను రాజ్ కు భోజనం తీసుకెళ్లి తినిపిస్తాను అంటుంది అపర్ణ. ఒకరి కోసం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నా బిడ్డ ఆకలితో పడుకోకూడదు అని తీసుకెళ్తున్నా అని రాజ్ కు భోజనం తీసుకెళ్తుంది అపర్ణ. మరోవైపు రాజ్ కు బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. లేదు.. తినకూడదు. అది చేసింది నేను తినడం ఏంటి అని అనుకుంటాడు. మంచినీళ్లు తాగుతూ ఉంటాడు. భోజనం తీసుకొని అపర్ణ వెళ్తుంది. ఆ కళావతి తినిపిస్తే తినలేదని.. నిన్ను పంపించిందా అంటే.. 25 ఏళ్ల నుంచి నీకే కదా నేను భోజనం తీసుకొచ్చేది అంటుంది. నీకోసం నేనే కష్టపడి భోజనం చేశాను అంటుంది అపర్ణ. దీంతో అపర్ణ తినిపిస్తుంటే తింటాడు రాజ్. దీంతో ధాన్యలక్ష్మి.. కావ్యను మెచ్చుకుంటుంది. రాజ్ భోజనం తినిపించి బయటికి వచ్చి కావ్య, ధాన్యలక్ష్మి కనిపించగానే ఒక మనిషిని గెలిపించాలంటే సాధించడం కాదు.. ప్రేమించాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అపర్ణ.
ఆ తర్వాత బెడ్ రూమ్ లోకి వచ్చి పడుకుంటుంది కావ్య. నవ్వుతూ ఉండటం చూసి ఎందుకు నవ్వుతున్నావు నువ్వు. నువ్వు చెబితే తినలేదని.. మా అమ్మతో పంపించావు కదా. నువ్వే మా అమ్మకు చెప్పి పంపించావు అని నాకు తెలుసు అంటాడు రాజ్. నేను వండలేదండి.. మీ అమ్మ గారే వండారు అంటే.. ఎవరి చేతి వంట ఎలా ఉంటుందో నాకు తెలుసు. అది నువ్వే చేశావని నాకు తెలుసు అంటాడు రాజ్.
కట్ చేస్తే తెల్లవారుతుంది. అందరినీ హాల్ లోకి పిలుస్తాడు సీతారామయ్య. ఇంతలో లాయర్ వస్తాడు. లాయర్ గారు అంతా నేను చెప్పిన విధంగా వీలునామా రాసుకొచ్చారా అంటే.. మీరు చెప్పినట్టుగానే పొందుపరిచాను అంటాడు లాయర్. అసలు ఇప్పుడు ఈ వీలునామా అవసరమా నాన్న అంటాడు సుభాష్. రుద్రాణి మాత్రం తెగ సంతోషిస్తుంది.
ఒకసారి అందులో ఏముందో చదవనివ్వండి అంటుంది రుద్రాణి. దీంతో నీకు మాత్రమే అంత తొందరగా ఉన్నట్టుంది అంటుంది ధాన్యలక్ష్మి. దీంతో రుద్రాణికే కాదు.. అందరికీ నా మీద అనుమానం ఉంది. అందుకే నేను అందరికీ కొన్ని విషయాలు క్లారిఫై చేయాలి అంటాడు సీతారామయ్య.
నా వైపు నుంచి ఆరోగ్య సమస్య ఎదురైంది. ఎవరి అంతర్మధనం బయటపడుతుందో అన్న పిరికితనం నన్ను ఆవహించింది. ఎవరూ వారి ఆంతర్యాలు బయట పెట్టకముందే నేను ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాను. అదే వీలునామా అంటాడు సీతారామయ్య.
నేను ఇప్పటికే ఆలస్యం చేశాను.. నా మనసులో ఏముందో మీ అందరికీ చెప్పాల్సిన అవసరం వచ్చింది. దయచేసి ఎవ్వరూ అడ్డుపడకండి. లాయర్ గారు మీరు చదవండి అంటాడు సీతారామయ్య. లాయర్ చదవబోతుండగా రాజ్ వచ్చి ఆ లెటర్ ను లాక్కుంటాడు. లాయర్ గారు క్షమించాలి.. ఇప్పుడు ఇంటి సభ్యులకు ఈ వీలునామాతో అవసరం లేదు. కాబట్టి దయచేసి మీరు వెళ్లిరండి అంటాడు రాజ్.
అదికాదు సార్ అంటే.. వెంటనే ఆ వీలునామాను చింపేస్తాడు రాజ్. దీంతో రుద్రాణి, రాహుల్ కు కోపం వస్తుంది. రాజ్.. అంటాడు సీతారామయ్య. నేను మీ నిర్ణయాన్ని దిక్కరించి ఈ మాట అనడం లేదు. దయచేసి ఈ విషయంలో మీరు ఏం మాట్లాడకండి అంటే.. రాజ్ నువ్వు చేసిందేంటి అని అడుగుతాడు సీతారామయ్య. మీ గురించి వదిలేసి ఎవరికి ఎంత వాటా వస్తుంది. ఆ వాటాకు ఎంత ఆస్తులు వస్తాయి. ఆ వాటాలో ఎవరికి ఎక్కువ.. ఎవరికి తక్కువ అని లెక్కలు వేసుకుంటూ కూర్చోవడానికి మేము మనుషులం తాతయ్య.. బండరాళ్లం కాదు అంటాడు రాజ్.
రుద్రాణి అవాక్కు అయినట్టుంది అంటుంది ధాన్యలక్ష్మి. మనమందరం అలాగే ఉందాం. నేను కోరుకున్నది కూడా అదే కదా అంటుంది రుద్రాణి. మరోవైపు మన సమస్యకు మనమే పరిష్కారం చూసుకొని సంతోషంగా ఉంటేనే అది నిజంగా తాతయ్యకే హ్యాపీగా ఉంటుంది అని రాజ్ తో అంటుంది కావ్య.
ఇక నుంచి నేను రెచ్చిపోతాను. నేను ఎలా మిమ్మల్ని కాపురం చేసేలా చేస్తానో మీరే మున్ముందు చూస్తారు అని చెబుతుంది కావ్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Redmi 15A 5G : చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం Xiaomi కు చెందిన సబ్-బ్రాండ్ Redmi భారత మార్కెట్లో తన…
SRH Players : ఐపీఎల్ 2026 సీజన్కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ మ్యాచ్లో జరిగిన ఒక చిన్న సంఘటన…
PNG Connection : దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో పైప్లైన్ నేచురల్ గ్యాస్ (PNG)పై ప్రజల్లో…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత పద్ధతిలోనే ఇరాన్…
Revanth Reddy : తెలంగాణ అన్నదాతల ముఖాల్లో చిరునవ్వులు పూయించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ రెండు అదిరిపోయే…
Modi on Iran : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న ఒక…
Dhurandhar 2 Collections : బాలీవుడ్ Bollywood స్టార్ హీరో రణవీర్ సింగ్ Ranveer Singh నటించిన లేటెస్ట్ యాక్షన్…
Garikapati Narasimha Rao : ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. తన…
Vidadala Rajini : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట మరోసారి నిజం కాబోతోందా? గత కొద్ది…
Gas Cylinder : మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్…
Realme 5G : భారతదేశంలో స్మార్ట్ఫోన్ రంగం రోజురోజుకు విస్తరిస్తుండగా రియల్మీ బ్రాండ్ వేగంగా ఎదుగుతూ వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించింది.…
Rythu Bharosa : తెలంగాణలో సాగు ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఊరట కలిగించే కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం అమలు…
This website uses cookies.