
passangers thrashed woman in busstand in madhya pradesh video viral
Viral Video : ఈరోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. మనుషులే ఈరోజుల్లో మనుషులకు శత్రువులు అవుతున్నారు. ఎదుటి వారిని చూసి పాపం అనకపోయినా పర్వాలేదు కానీ.. వాళ్లపై దాడి చేసి రాక్షస ఆనందం పొందుతున్నారు కొందరు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నా పాప ఏడుస్తోంది. కొన్ని పాలు కావాలి అని అడిగినందుకు ఓ యువతిని విచక్షణారహితంగా కొట్టారు కొందరు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సాగర్ నగరంలో చోటు చేసుకుంది.
మతిస్థిమితం లేని యువతి సాగర్ బస్టాండ్ లో కూర్చొని ఉంది. తన 5 నెలల పాప ఏడుస్తోంది. దీంతో బస్టాండ్ లో ఉన్న ఓ హోటల్ లోకి వెళ్లి తన పాప ఏడుస్తోందని.. పాపకు పాలు పట్టేందుకు పాలు కావాలని అడిగింది. దీంతో హోటల్ సిబ్బంది ఆమె లాగి పడేసి తీవ్రంగా కొట్టారు. అయితే.. ఆ యువతికి మతిస్థిమితం లేనట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా పాపకు పాలు కావాలి అని అడిగినందుకు ఇలా కొడతారా అంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యువతిపై తీవ్రంగా కొట్టిన వారిపై నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే.. ఆ వీడియో పోలీసులకు చేరడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి యువతిపై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేసి పాపను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.
passangers thrashed woman in busstand in madhya pradesh video viral
ఒక మహిళను పట్టుకొని పాలు అడిగినందుకు ఇంత తీవ్రంగా కొడతారా? ఇదేనా మానవత్వం. అసలు ఆ మహిళను చూసి ఎలా కొట్టాలనిపించింది. ఆమె ఏమైనా దొంగతనం చేసిందా? పాప కోసం పాలు కావాలని అడిగింది. అంతే కదా. దానికే ఆమెను చితకబాదుతారా? నిస్సహాయంగా ఉన్న ఆ మహిళను కొట్టి మీరు సాధించింది ఏంటి. ఒక తల్లి ఆవేదనను కూడా అర్థం చేసుకోలేని మీరు ఏం మనుషులు. మానవత్వం అనే పదాన్ని మరిచిపోయినట్టున్నారు అంటూ నెటిజన్లు వాళ్లపై మండిపడుతున్నారు.
Prabhas : భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే బాక్సాఫీస్ వద్ద యుద్ధ వాతావరణం…
Realme P4 Power 5G: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ రియల్మీ (Realme) భారత మార్కెట్లోకి మరో శక్తివంతమైన స్మార్ట్ఫోన్ను…
Upi Payments Fail : భారతదేశంలో డిజిటల్ విప్లవానికి చిహ్నంగా మారిన యూపీఐ సేవలు ఎంత వేగంగా ఉన్నాయో, సాంకేతిక…
Sunitha : ప్రముఖ సంగీత రియాలిటీ షో 'పాడుతా తీయగా' సీజన్-26 తాజా ఎపిసోడ్ ప్రోమో సంగీత ప్రియులను విశేషంగా…
Tirumala Laddu Prasadam : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ గత కొంతకాలంగా…
Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇన్నాళ్లూ అనుసరించిన…
Vijay Karthik - Keerthi Bhat : బుల్లితెర నటి, 'కార్తీకదీపం' ఫేమ్ కీర్తి భట్ మరియు ఆమె కాబోయే…
KCR : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సంస్థలు అత్యంత కీలక అడుగు…
This website uses cookies.