
Cat : తండ్రి కొడుకుల ప్రాణాలు తీసిన పిల్లి ..!
Cat : చేతికి వచ్చిన కొడుకు, ఇంటి బాధ్యతలు మోసే తండ్రి ఇద్దరు ఒకేసారి కన్నుమూస్తే కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడమే కష్టంగా ఉంది. చిన్నపాటి నిర్లక్ష్యం వారి ప్రాణాలకు ముప్పు తతెచ్చింది. ఉత్తరప్రదేశ్లోని అక్బర్ పూర్ గ్రామానికి చెందిన ప్రాథమిక పాఠశాలలో ఇంతియా హుజిన్ అనే వ్యక్తి పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్నారు. ఆయన ముచ్చటపడి ఒక పిల్లిని ఇంటికి తెచ్చుకున్నారు. దానిని సాదుకోవటం మొదలుపెట్టారు. క్రమక్రమంగా ఆ పిల్లి ఇంట్లో అందరికీ ఇష్టమైన పెంపుడు జంతువు అయింది. ఈ క్రమంలో ఆ ఇంట్లో అనుకోని ఉపద్రవం చోటుచేసుకుంది. అలా ఇలా తిరుగుతూ వీధిలోకి వచ్చిన పిల్లిని ఓ కుక్క వెంటపడి కరిచేసింది. వెంటనే పిల్లి ఇంట్లోకి పరుగు తీసింది. బయట ఉండి అరుస్తున్న శునకాన్ని ఇంట్లోని వాళ్ళు తరిమేశారు. రక్తం కారుతున్న పిల్లిని నీటితో కడిగేసి వదిలేశారు.
ఈ పరిణామం ఆ ఇంటి ఓనర్ పాలిట మృత్యు శాపం అయింది. పిల్లి కుక్క కాటుకు గురై వారం రోజులు అయింది. ఆ విషయాన్ని అందరూ మరిచిపోయారు. స్కూలు నుంచి ఇంటికి వచ్చిన ఇంతియా సార్ పిల్లిని ఒళ్లో కూర్చోబెట్టుకున్నారు. దానిని ప్రేమతో దువ్వటం మొదలుపెట్టారు. ఆ క్రమంలో పిల్లి పళ్ళు ఆ పెద్దాయన చేతిని తాకాయి. లైట్ గా గాట్లు పడ్డాయి. వెంటనే పెద్దాయన చేతులు కడుక్కొని కూర్చున్నాడు. ఆ విషయాన్ని మరిచిపోయాడు. యాదృచ్ఛికంగా కొన్ని రోజుల తర్వాత ఇంతియా హుజిన్ కొడుకికి కూడా పంటి గాట్లు పడ్డాయి. నవంబర్ 24న ఇంతియా హుజిన్ కుటుంబం ఒక పెళ్లికి హాజరయ్యారు. తర్వాతి రోజు ఇంటికి చేరుకున్నారు. ఆ రోజే ఇంతియా కొడుకు ఆరోగ్య పరిస్థితి మారిపోయింది. ఆయనని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే ఆయన శరీరంలో రాబిస్ లక్షణాలు పెరిగిపోయాయి.
మెరుగైన చికిత్స కోసం కాన్పూర్ కి వెళ్లే లోపు కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. తర్వాత కొద్ది రోజులకే ఇంటి పెద్ద కూడా అదే లక్షణాలతో తుది శ్వాస విడిచారు. ఆ పిల్లి చివరికి తండ్రి కొడుకుల ప్రాణాలని తీసేసింది. వీధి కుక్క కరవడంతో పిల్లికి రాబిస్ ఎటాక్ అయింది. దాని పళ్ళ గాట్లే కుటుంబంలోని ఇద్దరి మరణానికి కారణమైంది. పిల్లి గాట్లు తగిలిన వెంటనే యాంటీ రాబీస్ వ్యాక్సిన్ తీసుకుని ఉంటే వారి ప్రాణాలు నిలబడి ఉండేవని వైద్యులు అన్నారు. కుక్క పిల్లి ఆరోగ్యంగా ఉన్న ఆ పెంపుడు జంతువుల పళ్ళ గాట్లు శరీరానికి సున్నితంగా తగిలిన యాంటీ రాబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పెంపుడు జంతువులకు అప్పుడప్పుడు యాంటీ రాబిస్ ఇంజక్షన్లు వేపించాలి. ఈ ప్రక్రియ సరైన టైంలో జరగలేదు కాబట్టి తండ్రి కొడుకులు మరణించారు.
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
This website uses cookies.