
RBI : రుణగ్రహీతలకు భారీ గుడ్న్యూస్... వారు లోన్ కట్టనవసరలేదు.. RBI కొత్త మార్గదర్శకాలు ఇవే..!
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో ఆదాయం నిలిచిపోవడం, ఉపాధి కోల్పోవడం సాధారణమే. అలాంటి కష్టకాలంలో రుణాల భారం మరింత ఒత్తిడిని పెంచుతుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) రుణగ్రహీతలకు గణనీయమైన ఉపశమనం కల్పించేలా కొత్త ‘డిజాస్టర్ రిలీఫ్’ మార్గదర్శకాలను విడుదల చేసింది. విపత్తుల ప్రభావానికి లోనైన ప్రాంతాల్లో ఉన్నవారు తక్షణంగా లోన్ కట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
RBI : రుణగ్రహీతలకు భారీ గుడ్న్యూస్… వారు లోన్ కట్టనవసరలేదు.. RBI కొత్త మార్గదర్శకాలు ఇవే..!
ఆర్బీఐ రూపొందించిన ఈ కొత్త నిబంధనల వల్ల రుణాలు తీసుకున్న వారికి నాలుగు రకాలుగా లాభం చేకూరనుంది. మొదటగా లోన్ రీస్ట్రక్చరింగ్ అవకాశం ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆదాయం తగ్గినా లేదా పూర్తిగా కోల్పోయినా పాత లోన్ల చెల్లింపు గడువును పెంచుకోవచ్చు. ఈఎంఐలను కొత్తగా రీషెడ్యూల్ చేసుకునే వీలుంటుంది. దీనివల్ల తక్షణమే చెల్లించలేకపోయినా డిఫాల్టర్గా పరిగణించరు. రెండవది మోరటోరియం సౌకర్యం. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేవరకు కొన్ని నెలల పాటు అసలు వడ్డీ చెల్లింపులపై విరామం ఇవ్వవచ్చు. మోరటోరియం కాలంలో ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. మూడవది అదనపు రుణాల మంజూరు. వ్యాపారాన్ని మళ్లీ ప్రారంభించడానికి వ్యవసాయ పనులు కొనసాగించడానికి ఫ్రెష్ లోన్స్ లేదా అదనపు క్రెడిట్ సదుపాయాలు కల్పించాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. నాలుగవది తక్కువ వడ్డీ రేట్లు. విపత్తుల సమయంలో ఇచ్చే సహాయక రుణాలపై వడ్డీ భారం తగ్గేలా బ్యాంకులను ప్రోత్సహిస్తోంది.
కేవలం మార్గదర్శకాలు ప్రకటించడం మాత్రమే కాకుండా అవి క్షేత్రస్థాయిలో అమలయ్యేలా ఆర్బీఐ పక్కా ప్రణాళిక రూపొందించింది. ప్రతి జిల్లాలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. విపత్తు సంభవించిన వెంటనే ఈ కమిటీలు జిల్లా యంత్రాంగంతో కలిసి ప్రభావిత ప్రాంతాలను గుర్తిస్తాయి. అక్కడి రుణగ్రహీతలకు ఏయే సడలింపులు ఇవ్వాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటాయి. నష్టం జరిగిన 3 నుంచి 6 నెలలలోపు రుణ పునర్వ్యవస్థీకరణ, క్లెయిమ్ల ప్రక్రియ పూర్తిచేయాలని బ్యాంకులకు గడువు విధించింది.
ప్రకృతి వైపరీత్యాలు ఎవరి నియంత్రణలో ఉండవు. అలాంటి వేళ రుణాలు చెల్లించలేదని బ్యాంకులు ఒత్తిడి తేవడం మానవతా దృక్పథానికి విరుద్ధం. ఈ నేపథ్యంలో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం చిన్న వ్యాపారులు, రైతులు, గృహ రుణాలు తీసుకున్న మధ్యతరగతి కుటుంబాలకు నిజంగా పెద్ద ఊరటగా మారనుంది. కష్టకాలంలో అప్పుల భారం కొంత తగ్గి మళ్లీ నిలబడేందుకు అవకాశం కల్పించడమే ఈ డిజాస్టర్ రిలీఫ్ మార్గదర్శకాల అసలు ఉద్దేశ్యం. విపత్తుల సమయంలో రుణగ్రహీతలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా ఆర్బీఐ తీసుకున్న ఈ అడుగు ప్రశంసనీయం అని చెప్పాలి.
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…
This website uses cookies.