Categories: ExclusiveNewsvideos

TV Anchor : ఎండ‌ల వార్త‌లు చ‌దువుతూ స్పృహ త‌ప్పి ప‌డిపోయిన యాంక‌ర్..వీడియో !

Advertisement
Advertisement

TV Anchor : ఎండాకాలం వ‌స్తే చిన్న పిల్ల‌ల‌తో పాటు ముస‌లి వాళ్లు చాలా ఇబ్బంది ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. భానుడి భగభగలతో దేశం నిప్పుల కొలిమిలా మారింది. ఎండ వేడిమి, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు మండలాల్లో రెడ్‌ అలెర్ట్‌ కూడా జారీ చేశారు ..ఎండల వేడిమి తాళలేక వడదెబ్బ తగిలి వివిధ జిల్లాల్లో మ‌ర‌ణించారు. అయితే ఎవ‌రు ఎన్ని జాగ్ర‌త్తలు తీసుకున్నా కూడా కొన్ని సంద‌ర్భాల‌లో ప‌లువురు వ‌డ‌దెబ్బ బారిన ప‌డుతున్నారు. అయితే వేసవితాపం తీవ్రతను తెలియజేసే ఓ ఘటన ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.. ఆరు బయట తిరిగే వారికే కాదు, గ‌దుల మధ్య ఉండేవారు కూడా అధిక ఉష్ణోగ్రత కారణంగా పలు ఇబ్బందుల‌కి గుర‌వుతున్నార‌ని తాజా ఘ‌ట‌న అద్ధం ప‌డుతుంది..

Advertisement

TV Anchor : వడదెబ్బకు గురైన టీవీ యాంకర్

వివ‌రాల‌లోకి వెళితే దూరదర్శన్‌ కోల్‌కతా బ్రాంచిలో లోపముద్ర అనే యాంకర్‌ వాతావరణ వార్తలు చదువుతోంది. సరిగ్గా, అధిక వేడిమి గురించి వార్తలు చదువుతుండగా, ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లి కళ్లు మూసుకుంటూ కుర్చీలో వెనక్కి వాలిపోయింది. ఇది గమనించిన స్టూడియో సిబ్బంది వెంటనే ఆమె ముఖంపై నీళ్లు చల్లి స‌ప‌ర్య‌లు చేయ‌డంతో తిరిగి కోలుకుంది. అయితే త‌ర్వాత ఆమె మాట్లాడుఊ..స్టూడియోలో కూలింగ్‌ సిస్టమ్‌ ఉన్నప్పటికీ వేడిగా ఉండ‌డం వ‌ల‌న ఒక్క‌సారిగా తనకు కళ్లుమూత పడ్డాయని, కళ్లు మసకబారుతూ టెలి ప్రాంప్టర్‌ కనిపించకుండా పోయిందని చెప్పుకొచ్చింది.

Advertisement

TV Anchor : ఎండ‌ల వార్త‌లు చ‌దువుతూ స్పృహ త‌ప్పి ప‌డిపోయిన యాంక‌ర్..!

డీ హైడ్రేషన్‌ కారణంగా బీపీ లెవల్స్‌ పడిపోవడమే అందుకు కారణమై ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఓ గ్లాసు నీళ్లు తాగిన తర్వాత కుదుటపడ్డానని తన ఫేస్ బుక్ వీడియోలో చెప్పారు. పశ్చిమ బెంగాల్ లోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కు పైబడి నమోదవుతుండ‌డంతో అక్క‌డి ప్ర‌జ‌లు కూడా భ‌యంతో వణికిపోతున్నారు. దక్షిణ, ఉత్తర 24 పరగణాలు, పర్బా, పశ్చిమ భర్ధమాన్, పశ్చిమ మేదినిపూర్, పురూలియా, ఝర్ గ్రామ్, భిర్భూమ్, ముర్షీదాబాద్, బంకురా జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. అయితే అధిక వేడిమి వ‌ల‌న త‌న‌కు ఇలా జ‌రిగిందంటుంది. తన 21 ఏళ్ల కెరీర్‌లో 15 నిమిషాలు, 30 నిమిషాల నిడివిగల బులెటిన్‌లు ఎన్నో చదవానని, ఎప్పుడూ ఇలా జరగలేదని అన్నారు.

Advertisement

Recent Posts

India : ఇండియాపై క‌న్నెర్ర చేసిన ప్ర‌కృతి… రిపోర్ట్‌తో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి…!

India : మన దేశాన్ని ప్రకృతి పగబట్టిందా? అంటే అవును అనిపిస్తుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితులు ప్ర‌జ‌ల‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.…

9 hours ago

Trisha : ఎంత బ్ర‌తిమాలినా విన‌లేదు.. త్రిష వ‌ల‌న నా జీవితం నాశనం అయిందంటూ సంచ‌ల‌న కామెంట్స్

Trisha : సౌత్ అగ్ర నటీమణుల్లో త్రిష ఒకరు. నాలుగు పదుల వయసులో కూడా త్రిష డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.…

10 hours ago

UPSC కంబైన్డ్ జియో-సైంటిస్ట్ 2024 నోటిఫికేషన్ విడుద‌ల‌.. సెప్టెంబర్ 24 వరకు ద‌ర‌ఖాస్తుకు అవ‌కాశం..!

UPSC  : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ జియో-సైంటిస్ట్ 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత…

11 hours ago

Fish Venkat : ఫిష్ వెంక‌ట్ అనారోగ్య ప‌రిస్థితి తెలుసుకొని చ‌లించిపోయిన చిరు, చ‌ర‌ణ్‌.. వెంట‌నే ఏం చేశారంటే..!

Fish Venkat : టాలీవుడ్‌లో కొంద‌రు స్టార్స్ ఒకానొక‌ప్పుడు ఓ వెలుగు వెలిగి ఇప్పుడు మాత్రం చాలా దారుణ‌మైన స్థితిని…

12 hours ago

Eating Food : ఆహారం తినడానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయని మీకు తెలుసా..?

Eating Food : హిందూమతంలో జీవశాస్త్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. వాస్తు దోషాలు యొక్క ప్రభావం జీవితంపై కూడా పడుతుందనేది…

13 hours ago

Pithapuram : పిఠాపురంలో ఏం జ‌రుగుతుంది.. వ‌ర్మ వ‌ర్సెస్ జ‌న‌సేన‌ ?

Pithapuram : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయ‌డంతో ఆ పేరు నెట్టింట తెగ మారుమ్రోగింది.పిఠాపురం వైపు ప్ర‌జ‌లు క్యూలు…

14 hours ago

Tonsils : ట్యాన్సిల్ నొప్పిని ఇంటి నివారణలతో కూడా తగ్గించవచ్చు… ఎలాగంటే…!

Tonsils : మనకు జలుబు చేస్తే ట్యాన్సిల్స్ రావడం కామన్. అయితే ఈ టాన్సిల్స్ నాలుక వెనక గొంతుకు ఇరువైపులా…

17 hours ago

Internet : ఇంటర్నెట్ అడిక్షన్ ను ఈజీగా వదిలించుకోవచ్చు… ఎలాగో తెలుసా…!!

Internet  : ప్రస్తుత కాలంలో ఎంతోమంది మద్యం మరియు గంజాయి, పొగాకు లాంటి చెడు వ్యసనాలకు బానిసలు అయ్యి వారి…

18 hours ago

This website uses cookies.