
TV Anchor : ఎండల వార్తలు చదువుతూ స్పృహ తప్పి పడిపోయిన యాంకర్..!
TV Anchor : ఎండాకాలం వస్తే చిన్న పిల్లలతో పాటు ముసలి వాళ్లు చాలా ఇబ్బంది పడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. భానుడి భగభగలతో దేశం నిప్పుల కొలిమిలా మారింది. ఎండ వేడిమి, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు మండలాల్లో రెడ్ అలెర్ట్ కూడా జారీ చేశారు ..ఎండల వేడిమి తాళలేక వడదెబ్బ తగిలి వివిధ జిల్లాల్లో మరణించారు. అయితే ఎవరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్ని సందర్భాలలో పలువురు వడదెబ్బ బారిన పడుతున్నారు. అయితే వేసవితాపం తీవ్రతను తెలియజేసే ఓ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. ఆరు బయట తిరిగే వారికే కాదు, గదుల మధ్య ఉండేవారు కూడా అధిక ఉష్ణోగ్రత కారణంగా పలు ఇబ్బందులకి గురవుతున్నారని తాజా ఘటన అద్ధం పడుతుంది..
వివరాలలోకి వెళితే దూరదర్శన్ కోల్కతా బ్రాంచిలో లోపముద్ర అనే యాంకర్ వాతావరణ వార్తలు చదువుతోంది. సరిగ్గా, అధిక వేడిమి గురించి వార్తలు చదువుతుండగా, ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లి కళ్లు మూసుకుంటూ కుర్చీలో వెనక్కి వాలిపోయింది. ఇది గమనించిన స్టూడియో సిబ్బంది వెంటనే ఆమె ముఖంపై నీళ్లు చల్లి సపర్యలు చేయడంతో తిరిగి కోలుకుంది. అయితే తర్వాత ఆమె మాట్లాడుఊ..స్టూడియోలో కూలింగ్ సిస్టమ్ ఉన్నప్పటికీ వేడిగా ఉండడం వలన ఒక్కసారిగా తనకు కళ్లుమూత పడ్డాయని, కళ్లు మసకబారుతూ టెలి ప్రాంప్టర్ కనిపించకుండా పోయిందని చెప్పుకొచ్చింది.
TV Anchor : ఎండల వార్తలు చదువుతూ స్పృహ తప్పి పడిపోయిన యాంకర్..!
డీ హైడ్రేషన్ కారణంగా బీపీ లెవల్స్ పడిపోవడమే అందుకు కారణమై ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఓ గ్లాసు నీళ్లు తాగిన తర్వాత కుదుటపడ్డానని తన ఫేస్ బుక్ వీడియోలో చెప్పారు. పశ్చిమ బెంగాల్ లోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కు పైబడి నమోదవుతుండడంతో అక్కడి ప్రజలు కూడా భయంతో వణికిపోతున్నారు. దక్షిణ, ఉత్తర 24 పరగణాలు, పర్బా, పశ్చిమ భర్ధమాన్, పశ్చిమ మేదినిపూర్, పురూలియా, ఝర్ గ్రామ్, భిర్భూమ్, ముర్షీదాబాద్, బంకురా జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. అయితే అధిక వేడిమి వలన తనకు ఇలా జరిగిందంటుంది. తన 21 ఏళ్ల కెరీర్లో 15 నిమిషాలు, 30 నిమిషాల నిడివిగల బులెటిన్లు ఎన్నో చదవానని, ఎప్పుడూ ఇలా జరగలేదని అన్నారు.
Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్లకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
This website uses cookies.