
woman climbs jio cell tower after fight with fellow sister in law
Viral Video : ఈరోజుల్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ ఉంటారు. మనిషి నైజమే అది. ఎవరు తిట్టినా బాధపడిపోతుంటారు. తమలో తామే కుమిలిపోతుంటారు. ఎవరో తిట్టారని అఘాయిత్యాలు చేసుకునేవాళ్లు కూడా ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకునే వాళ్లూ ఉన్నారు. ఎందుకంటే.. పరువు కోసం ప్రాణాలు ఇస్తారు.. ప్రాణాలు తీస్తారు కొందరు. ఎవరైనా తిడితే తమ పరువు పోయిందని అనుకుంటారు. అందుకే చివరకు తమ ప్రాణాలు కూడా తీసుకోవడానికి వెనుకాడరు.
తాజాగా అటువంటి ఘటనే ఒకటి ఏపీలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కంభంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తోటి కోడలు తిట్టిందని ఓ మహిళ జియో సెల్ టవర్ ఎక్కింది. పెద్దారవీడు అనే గ్రామానికి చెందిన లక్ష్మీబాయిపై కేసు పెట్టడంతో పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్ కు పిలిచారు. ఆమెను విచారించారు. దీంతో ఆమె దాన్ని అవమానంగా భావించింది.తన తోటికోడలు తన మీద కేసు పెట్టడంతో ఆ మహిళ తట్టుకోలేకపోయింది. చివరకు పెద్దారవీడు పోలీసులు తనను పిలిచి విచారించడంతో అవమానంగా భావించింది. పోలీసుల విచారణకు హాజరైన తర్వాత కుంభం వచ్చిన మహిళ.. అక్కడే ఉన్న జియో టవర్ ఎక్కింది.
woman climbs jio cell tower after fight with fellow sister in law
నిరసనకు దిగింది. ఈ విషయం పోలీసులకు తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి ఆ మహిళను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఎంత చెప్పినా అస్సలు వినలేదు. అక్కడి నుంచి దూకేస్తా అంటూ బెదిరించింది ఆ మహిళ. చివరకు కుటుంబ సభ్యులు, పోలీసులు అందరూ అక్కడికి వెళ్లి తనను ఎలాగోలా బుజ్జగించి కిందికి దింపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Gitam University : తెలంగాణలో ప్రముఖ విద్యాసంస్థ అయిన గీతం యూనివర్సిటీకి సంబంధించి వందల కోట్ల విద్యుత్ బకాయిల వ్యవహారం…
Central Government : రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా రైతులకు సమగ్ర…
Russia : గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ వాణిజ్యాన్ని ఆధిపత్యం చేస్తున్న అమెరికన్ డాలర్కు ప్రత్యామ్నాయ వ్యవస్థను నిర్మించాలని రష్యా…
Mad For Each Other Couple Show : బిగ్బాస్ షోకి ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు…
Half-day schools : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ముస్లిం విద్యార్థులు, ఉపాధ్యాయులకు శుభవార్త తెలియజేసింది.…
Pratyusha Death Case : టాలీవుడ్లో విషాదానికి ప్రతీకగా నిలిచిన నటి ప్రత్యూష మృతి కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం…
T20 World Cup 2026 : టీ20 ప్రపంచ కప్లో భారత్ మరోసారి పాకిస్థాన్పై ఆధిపత్యం చాటింది. ఫిబ్రవరి 15న…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల ఫలితాలు వచ్చి చాలా రోజులు అవుతున్నా ఆ ఓటింగ్ జరిగిన తీరు…
This website uses cookies.